టిక్ టాక్… చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా రికార్డులకెక్కింది. చాన్నాళ్లుగా అగ్ర రాజ్యం అన్న ట్యాగ్ ను అలా అలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్న అమెరికా గుత్తాధిపత్యం సాగిస్తోందంటూ చైనా ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది.
ఈ వ్యాఖ్యలతో ఆ దేశం అమెరికాకు తాను యాంటీ అని కూడా చెప్పకనే చెప్పింది. ఇక ప్రపంచంలోని అన్ని దేశాల వ్యవహారాలను ఎప్పటికప్పుడు తనదైన లెన్స్ లతో చూసే అమెరికా… అవకాశం చూసి కత్తులు దూస్తూ వస్తోంది. టిక్ టాక్ విషయంలోనూ అమెరికా అదే చేసింది.
అయితే ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో టిక్ టాక్ కు తిరిగి అమెరికాలోకి ప్రవేశించాలనే ఆశలు కలిగాయి. అందుకు అనుగుణంగా ఆ సంస్థ కొన్ని చర్యలు కూడా చేపట్టినట్లు సమాచారం.
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ట్రంప్ సోమవారం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ మరుక్షణమే అమెరికా విఫణిలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటూ టిక్ టాక్ భావించింది. అయితే అందుకు ముందుగానే టిక్ టాక్ ఆశలను సజీవంగా ఉంచుతూ ట్రంప్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు.
టిక్ టాక్ లో 50 శాతం వాటాలను అమెరికా ప్రభుత్వానికి బదలాయించగలిగితే…దానిని దేశంలోకి అనుమతించేందుకు ఎలాంటి అవరోధం ఉండబోదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా టిక్ టాక్ ను ఆయన ఆకాశానికెత్తేశారు.
ఈ నేపథ్యంలో అమెరికాలోకి టిక్ టాక్ తిరిగి ఎంట్రీ ఇవ్వడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టిక్ టాక్ లో సగం మేర వాటా అమెరికాకు ఏ రీతిన బదలాయింపు జరుగుతుందన్నదే ఇప్పుడు అసలు సిసలు టాస్క్ గా మారిందని చెప్పాలి.
This post was last modified on January 20, 2025 12:51 pm
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…