టిక్ టాక్… చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా రికార్డులకెక్కింది. చాన్నాళ్లుగా అగ్ర రాజ్యం అన్న ట్యాగ్ ను అలా అలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్న అమెరికా గుత్తాధిపత్యం సాగిస్తోందంటూ చైనా ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది.
ఈ వ్యాఖ్యలతో ఆ దేశం అమెరికాకు తాను యాంటీ అని కూడా చెప్పకనే చెప్పింది. ఇక ప్రపంచంలోని అన్ని దేశాల వ్యవహారాలను ఎప్పటికప్పుడు తనదైన లెన్స్ లతో చూసే అమెరికా… అవకాశం చూసి కత్తులు దూస్తూ వస్తోంది. టిక్ టాక్ విషయంలోనూ అమెరికా అదే చేసింది.
అయితే ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో టిక్ టాక్ కు తిరిగి అమెరికాలోకి ప్రవేశించాలనే ఆశలు కలిగాయి. అందుకు అనుగుణంగా ఆ సంస్థ కొన్ని చర్యలు కూడా చేపట్టినట్లు సమాచారం.
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ట్రంప్ సోమవారం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ మరుక్షణమే అమెరికా విఫణిలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటూ టిక్ టాక్ భావించింది. అయితే అందుకు ముందుగానే టిక్ టాక్ ఆశలను సజీవంగా ఉంచుతూ ట్రంప్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు.
టిక్ టాక్ లో 50 శాతం వాటాలను అమెరికా ప్రభుత్వానికి బదలాయించగలిగితే…దానిని దేశంలోకి అనుమతించేందుకు ఎలాంటి అవరోధం ఉండబోదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా టిక్ టాక్ ను ఆయన ఆకాశానికెత్తేశారు.
ఈ నేపథ్యంలో అమెరికాలోకి టిక్ టాక్ తిరిగి ఎంట్రీ ఇవ్వడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టిక్ టాక్ లో సగం మేర వాటా అమెరికాకు ఏ రీతిన బదలాయింపు జరుగుతుందన్నదే ఇప్పుడు అసలు సిసలు టాస్క్ గా మారిందని చెప్పాలి.
This post was last modified on January 20, 2025 12:51 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…