ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం, ఖగోళ ప్రేమికులకు విజువల్ ట్రీట్గా నిలుస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ఈ అద్భుత దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపిస్తాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందనే విషయం తెలిసిందే. జనవరి 25న ఈ గ్రహాల అమరిక గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
ఈ సందర్భంగా మెర్క్యురీ కూడా లైనప్లో చేరి ఈ ప్లానెట్ పరేడ్ను మరింత విశేషంగా మారుస్తుంది. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం, ప్లానెట్ పరేడ్ అంటే భూమి దృక్కోణం నుంచి అనేక గ్రహాలు ఒకే రేఖపై వరుసగా కనిపించడం. ఈ అరుదైన సంఘటనలో యురేనస్, నెప్ట్యూన్ను చూడాలంటే టెలిస్కోప్ అవసరం. అయితే శుక్రుడు, అంగారకుడు వంటి గ్రహాలను కేవలం కంటితో కూడా చూడవచ్చు. ఈ గ్రహాలు సూర్యుడి వైపున ఒకే అమరికలో కనబడతాయి.
ఈ అరుదైన ఖగోళ సంఘటనను వీక్షించాలంటే, సూర్యాస్తమయం తర్వాత చీకటిగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లడం మంచిది. సిటీ లైట్లకు దూరంగా పశ్చిమ హోరిజోన్తో కూడిన ప్రాంతం చూడటానికి అనువుగా ఉంటుంది. గ్రహాలను స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్తో చూడడం ఉత్తమం.
ఈ నెల 25తో పాటు ఫిబ్రవరి 2న కూడా ప్లానెట్స్ పరేడ్ కనిపించే అవకాశం ఉంది. అమెరికాలో న్యూయార్క్, హ్యూస్టన్ వంటి నగరాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ అద్భుతం వీక్షించవచ్చు.
This post was last modified on January 16, 2025 6:29 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…