ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం, ఖగోళ ప్రేమికులకు విజువల్ ట్రీట్గా నిలుస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ఈ అద్భుత దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపిస్తాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందనే విషయం తెలిసిందే. జనవరి 25న ఈ గ్రహాల అమరిక గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
ఈ సందర్భంగా మెర్క్యురీ కూడా లైనప్లో చేరి ఈ ప్లానెట్ పరేడ్ను మరింత విశేషంగా మారుస్తుంది. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం, ప్లానెట్ పరేడ్ అంటే భూమి దృక్కోణం నుంచి అనేక గ్రహాలు ఒకే రేఖపై వరుసగా కనిపించడం. ఈ అరుదైన సంఘటనలో యురేనస్, నెప్ట్యూన్ను చూడాలంటే టెలిస్కోప్ అవసరం. అయితే శుక్రుడు, అంగారకుడు వంటి గ్రహాలను కేవలం కంటితో కూడా చూడవచ్చు. ఈ గ్రహాలు సూర్యుడి వైపున ఒకే అమరికలో కనబడతాయి.
ఈ అరుదైన ఖగోళ సంఘటనను వీక్షించాలంటే, సూర్యాస్తమయం తర్వాత చీకటిగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లడం మంచిది. సిటీ లైట్లకు దూరంగా పశ్చిమ హోరిజోన్తో కూడిన ప్రాంతం చూడటానికి అనువుగా ఉంటుంది. గ్రహాలను స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్తో చూడడం ఉత్తమం.
ఈ నెల 25తో పాటు ఫిబ్రవరి 2న కూడా ప్లానెట్స్ పరేడ్ కనిపించే అవకాశం ఉంది. అమెరికాలో న్యూయార్క్, హ్యూస్టన్ వంటి నగరాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ అద్భుతం వీక్షించవచ్చు.
This post was last modified on January 16, 2025 6:29 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…