ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం, ఖగోళ ప్రేమికులకు విజువల్ ట్రీట్గా నిలుస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ఈ అద్భుత దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపిస్తాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందనే విషయం తెలిసిందే. జనవరి 25న ఈ గ్రహాల అమరిక గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
ఈ సందర్భంగా మెర్క్యురీ కూడా లైనప్లో చేరి ఈ ప్లానెట్ పరేడ్ను మరింత విశేషంగా మారుస్తుంది. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం, ప్లానెట్ పరేడ్ అంటే భూమి దృక్కోణం నుంచి అనేక గ్రహాలు ఒకే రేఖపై వరుసగా కనిపించడం. ఈ అరుదైన సంఘటనలో యురేనస్, నెప్ట్యూన్ను చూడాలంటే టెలిస్కోప్ అవసరం. అయితే శుక్రుడు, అంగారకుడు వంటి గ్రహాలను కేవలం కంటితో కూడా చూడవచ్చు. ఈ గ్రహాలు సూర్యుడి వైపున ఒకే అమరికలో కనబడతాయి.
ఈ అరుదైన ఖగోళ సంఘటనను వీక్షించాలంటే, సూర్యాస్తమయం తర్వాత చీకటిగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లడం మంచిది. సిటీ లైట్లకు దూరంగా పశ్చిమ హోరిజోన్తో కూడిన ప్రాంతం చూడటానికి అనువుగా ఉంటుంది. గ్రహాలను స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్తో చూడడం ఉత్తమం.
ఈ నెల 25తో పాటు ఫిబ్రవరి 2న కూడా ప్లానెట్స్ పరేడ్ కనిపించే అవకాశం ఉంది. అమెరికాలో న్యూయార్క్, హ్యూస్టన్ వంటి నగరాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ అద్భుతం వీక్షించవచ్చు.
This post was last modified on January 16, 2025 6:29 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…