ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం, ఖగోళ ప్రేమికులకు విజువల్ ట్రీట్గా నిలుస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ఈ అద్భుత దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపిస్తాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందనే విషయం తెలిసిందే. జనవరి 25న ఈ గ్రహాల అమరిక గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
ఈ సందర్భంగా మెర్క్యురీ కూడా లైనప్లో చేరి ఈ ప్లానెట్ పరేడ్ను మరింత విశేషంగా మారుస్తుంది. శాస్త్రవేత్తల వివరణ ప్రకారం, ప్లానెట్ పరేడ్ అంటే భూమి దృక్కోణం నుంచి అనేక గ్రహాలు ఒకే రేఖపై వరుసగా కనిపించడం. ఈ అరుదైన సంఘటనలో యురేనస్, నెప్ట్యూన్ను చూడాలంటే టెలిస్కోప్ అవసరం. అయితే శుక్రుడు, అంగారకుడు వంటి గ్రహాలను కేవలం కంటితో కూడా చూడవచ్చు. ఈ గ్రహాలు సూర్యుడి వైపున ఒకే అమరికలో కనబడతాయి.
ఈ అరుదైన ఖగోళ సంఘటనను వీక్షించాలంటే, సూర్యాస్తమయం తర్వాత చీకటిగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లడం మంచిది. సిటీ లైట్లకు దూరంగా పశ్చిమ హోరిజోన్తో కూడిన ప్రాంతం చూడటానికి అనువుగా ఉంటుంది. గ్రహాలను స్పష్టంగా చూడాలంటే బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్తో చూడడం ఉత్తమం.
ఈ నెల 25తో పాటు ఫిబ్రవరి 2న కూడా ప్లానెట్స్ పరేడ్ కనిపించే అవకాశం ఉంది. అమెరికాలో న్యూయార్క్, హ్యూస్టన్ వంటి నగరాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ అద్భుతం వీక్షించవచ్చు.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…