Trends

దెబ్బకు దిగి వచ్చిన మెటా.. భారత్ కు క్షమాపణలు

కొద్ది రోజుల క్రితం ఒక పాడ్ కాస్ట్ లో ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడిన ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు..మెటా అధినేత జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. సమన్లు పంపటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 2024లో జరిగిన ఎన్నికల్లో ఏ అధికార పార్టీ కూడా విజయం సాధించలేదని పేర్కొన్నారు.

అయితే.. జుకర్ చేసిన వ్యాఖ్యలు చాలా దేశాల్లో వాస్తవమే అయినా.. భారత్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్న సంగతి తెలిసిందే. కొవిడ్ తర్వాత భారత్ తో సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయినట్లుగా జుకర్ పేర్కొన్నారు.

భారతదేశంలో ప్రజాస్వామ్య పద్దతిలో జరిగిన ఎన్నికల ప్రక్రియను అవహేళన చేసినట్లుగా.. భారత ప్రభుత్వంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.

2024లో జరిగినసార్వత్రిక ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని.. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం.. 220 కోట్ల వ్యాక్సిన్లు అందించటంతోపాటు.. కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయటం లాంటి అంశాల్ని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ.. జుకర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇదే విషయాన్ని ఎక్స్ లో పోస్టు పెట్టటం తెలిసిందే.

మరోవైపు.. జుకర్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఆయనపై చర్యలకు సిద్ధమైంది. ఇలాంటి వేళ.. మెటా స్పందించింది. భారత ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరింది. అనుకోకుండా జరిగిన పొరపాటుగా పేర్కొంటూ.. తమను క్షమించాలని కోరింది. జుకర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన పోస్టుకు స్పందించిన మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివానంద్ టుక్ రాల్.. ‘2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్నపార్టీలు మళ్లీ విజయం సాధించలేదంటూ మార్క్ చేసిన వాదన చాలా దేశాల్లో నిజమే.

కానీ.. భారత్ లో మాత్రం అందుకు బిననంగా జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. మెటాకు భారత్ అతి ముఖ్యమైన భాగస్వామి. ఈ దేశ క్రియేటివిటి ఫ్యూచరర్ లో మేమూ కీలక పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మెటా రంగంలోకి దిగిన భారత సర్కారుకు క్షమాపణలు చెప్పటం.. చెంపలేసుకోవటంతో ఈ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చిందని చెప్పాలి. అయితే.. భారతదేశంలోని రాజకీయాల గురించి మాట్లాడే వేళలో.. జుకర్ కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాన్ని తాజా ఎపిసోడ్ తో గుర్తించి ఉంటారని భావించాలి.

This post was last modified on January 16, 2025 7:38 am

Share

Recent Posts

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

27 minutes ago

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

2 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

4 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

8 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

11 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

12 hours ago