Trends

ప‌సిడి గ‌నిలో ప్రాణాలు పోయాయ్‌.. 200 మంది మృతి!

అది బంగారు గ‌ని! త‌వ్వుకుంటే సిరులే!! కాక‌పోతే.. ఎలాంటి అధికారిక ఉత్త‌ర్వులు లేవు. అయినా.. కొందరు పేద‌లు.. ఈ గ‌నుల్లోకి వెళ్లి అంతో ఇంతో బంగారం తెచ్చుకుని గుట్టుమ‌ట్టుగా విక్ర‌యించుకుని జీవితాలను పోషించుకుంటున్నారు.

ఇదంతా కొన్ని ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న‌దే. ఆయా గ‌నుల్లోని బంగారాన్ని ప్ర‌భుత్వం త‌వ్వించే అవ‌కాశం ఉన్నా.. ప్ర‌మాదాల కార‌ణంగా ఆయా గ‌నుల‌ను వ‌దిలేసింది. దీంతో అవి పేద‌ల‌కు వ‌రంగా మారాయి.

అయితే.. ఈ ప‌నిని నేరంగా భావించిన ప్ర‌భుత్వం వాటిని అనూహ్యంగా మూసేసింది. దీంతో అప్ప‌టికే బంగారం కోసం వెళ్లిన 500 మందికిపైగా పేద‌లు.. ఆక‌లి ద‌ప్పుల‌తో అల‌మటిస్తున్నారు. వీరిలో సుమారు 200 మందివ‌ర‌కు మ‌ర‌ణించి ఉంటార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేసింది.

వారిని త‌క్ష‌ణం బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన స‌ర్కారుకు శ‌వాలు త‌ప్ప‌.. జీవించి ఉన్న మ‌నుషులు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నార‌ని అర్థ‌మైంది.

ఎక్క‌డ?

పేద‌రికంలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ద‌క్షిణాఫ్రికాలో బంగారు నిక్షేపాలు అధికం. ఇవే ఆదేశానికి వ‌న‌రులు కూడా. అయితే.. కొన్ని గ‌నులు ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో వాటిని ప్ర‌భుత్వం నిలుపుద‌ల చేసింది. ఇక‌, వీటిలో ఉన్న బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ప‌లు రాష్ట్రాల పేద‌లు.. సాహ‌సోపేతంగా వీటిలో కి వెళ్లి అందిన బంగారాన్ని తెచ్చుకుని కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. ఇలా.. రెండు మాసాల కింద‌ట 500 మంది వ‌ర‌కు గ‌నుల్లోకి వెళ్లారు. ఈ విష‌యం తెలిసిన ప్ర‌భుత్వం వెంట‌నే గ‌ని మార్గాల‌ను మూసేసింది.

దీంతో లోప‌లికి వెళ్లిన వారు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోయింది. పైగా.. వారు ఏర్పాటు చేసుకున్న వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా అధికారులు కూల్చేశారు. ఇది మ‌రింత దారుణంగా మారిపోయింది. దీంతో లోప‌లికి వెళ్లిన వారికి ఆహారం, నీరు లేకుండా పోయింది. ఫ‌లితంగా వంద‌ల మంది చ‌నిపోయారు.

ఈ విష‌యం నెమ్మ‌దిగా వెలుగు చూడ‌డంతోపాటు రాజ‌కీయ ప‌క్షాల నుంచి కూడా తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం బాధితుల‌ను బ‌య‌ట‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, వంద‌ల కొద్దీ శ‌వాలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాగా.. కేవ‌లం ప‌ది మంది మాత్రం కొన ఊపిరితో బ‌య‌ట ప‌డ్డారు.

This post was last modified on January 15, 2025 1:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

11 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

41 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago