Trends

ప‌సిడి గ‌నిలో ప్రాణాలు పోయాయ్‌.. 200 మంది మృతి!

అది బంగారు గ‌ని! త‌వ్వుకుంటే సిరులే!! కాక‌పోతే.. ఎలాంటి అధికారిక ఉత్త‌ర్వులు లేవు. అయినా.. కొందరు పేద‌లు.. ఈ గ‌నుల్లోకి వెళ్లి అంతో ఇంతో బంగారం తెచ్చుకుని గుట్టుమ‌ట్టుగా విక్ర‌యించుకుని జీవితాలను పోషించుకుంటున్నారు.

ఇదంతా కొన్ని ద‌శాబ్దాలుగా జ‌రుగుతున్న‌దే. ఆయా గ‌నుల్లోని బంగారాన్ని ప్ర‌భుత్వం త‌వ్వించే అవ‌కాశం ఉన్నా.. ప్ర‌మాదాల కార‌ణంగా ఆయా గ‌నుల‌ను వ‌దిలేసింది. దీంతో అవి పేద‌ల‌కు వ‌రంగా మారాయి.

అయితే.. ఈ ప‌నిని నేరంగా భావించిన ప్ర‌భుత్వం వాటిని అనూహ్యంగా మూసేసింది. దీంతో అప్ప‌టికే బంగారం కోసం వెళ్లిన 500 మందికిపైగా పేద‌లు.. ఆక‌లి ద‌ప్పుల‌తో అల‌మటిస్తున్నారు. వీరిలో సుమారు 200 మందివ‌ర‌కు మ‌ర‌ణించి ఉంటార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేసింది.

వారిని త‌క్ష‌ణం బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన స‌ర్కారుకు శ‌వాలు త‌ప్ప‌.. జీవించి ఉన్న మ‌నుషులు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నార‌ని అర్థ‌మైంది.

ఎక్క‌డ?

పేద‌రికంలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ద‌క్షిణాఫ్రికాలో బంగారు నిక్షేపాలు అధికం. ఇవే ఆదేశానికి వ‌న‌రులు కూడా. అయితే.. కొన్ని గ‌నులు ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో వాటిని ప్ర‌భుత్వం నిలుపుద‌ల చేసింది. ఇక‌, వీటిలో ఉన్న బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ప‌లు రాష్ట్రాల పేద‌లు.. సాహ‌సోపేతంగా వీటిలో కి వెళ్లి అందిన బంగారాన్ని తెచ్చుకుని కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. ఇలా.. రెండు మాసాల కింద‌ట 500 మంది వ‌ర‌కు గ‌నుల్లోకి వెళ్లారు. ఈ విష‌యం తెలిసిన ప్ర‌భుత్వం వెంట‌నే గ‌ని మార్గాల‌ను మూసేసింది.

దీంతో లోప‌లికి వెళ్లిన వారు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోయింది. పైగా.. వారు ఏర్పాటు చేసుకున్న వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా అధికారులు కూల్చేశారు. ఇది మ‌రింత దారుణంగా మారిపోయింది. దీంతో లోప‌లికి వెళ్లిన వారికి ఆహారం, నీరు లేకుండా పోయింది. ఫ‌లితంగా వంద‌ల మంది చ‌నిపోయారు.

ఈ విష‌యం నెమ్మ‌దిగా వెలుగు చూడ‌డంతోపాటు రాజ‌కీయ ప‌క్షాల నుంచి కూడా తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం బాధితుల‌ను బ‌య‌ట‌కు తెచ్చే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, వంద‌ల కొద్దీ శ‌వాలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాగా.. కేవ‌లం ప‌ది మంది మాత్రం కొన ఊపిరితో బ‌య‌ట ప‌డ్డారు.

Kumar

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

25 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

58 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

1 hour ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago