Trends

ఒలింపిక్ మెడల్స్ నాణ్యతపై రచ్చరచ్చ

ఒలిపింక్స్ అంటేనే… వరల్డ్ క్లాస్ ఈవెంట్. దీనిని మించిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఈవెంట్ లో విజేతలకు ఇచ్చే పతకాల నాణ్యత ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటిదాకా అసలు అనుమానాలే రాలేదు. అయితే… పారిస్ ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ ఈవెంట్ మెడల్స్ ఫై గగ్గోలు పెడుతున్నారు.

ఆలా తమ చేతికి వచ్చిన మెడల్ ఇలా రంగు వెలిసి పోయిందట. ఈ మేరకు భారత క్రీడాకారులే కాకుండా పలు దేశాలకు చెందిన ప్లేయర్స్ కూడా మెడల్స్ కలర్ వెలిసిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు.

భారత్ కు చెందిన షూటింగ్ ప్లేయర్లు స్వప్నిల్, సరబ్ జ్యోత్ సింగ్ లు పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. పారిస్ వేదికగా వీరు మెడల్స్ తీసుకోగా… స్వదేశానికి తిరిగి వచ్చేలోగానే వాటి రంగు వెలిసిపోయిందట.

కేవలం 7 రోజుల్లోనే ఈ మెడల్స్ రంగు వెలిసిపోవడంఫై పెద్ద రచ్చ మొదలైంది. పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను బాకర్ పతకాలదీ ఇదే స్థితి అంట.

ఇదేదో… ఒక్క భారత క్రీడాకారులకు ఇచ్చిన పెడల్స్ కు పట్టిన గతి కాదు. చాల దేశాలకు చెందిన క్రీడాకారులకు ఇచ్చిన పతకాల పరిస్థితీ ఇదేనట. పారిస్ క్రీడా సంబరం ముగిసిన రోజుల వ్యవధిలోనే ఒలింపిక్స్ కమీటీకి ఈ దిశగా ఫిర్యాదులు రావడం మొదలైందట. దీంతో రంగు వెలసిన మెడల్స్ తిరిగి ఇస్తే వాటి స్థానంలో కొత్త పతకాలను ఇస్తామని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం చెబుతోంది.

ఇదే మాటను భారత ఒలింపిక్ సంఘం కూడా చెబుతోంది. అయినా.. రంగు మారిన మెడల్స్ రీప్లేస్ చేస్తామని చెప్పడం కాదు… ఒలింపిక్స్ ప్రతిష్ట దెబ్బ తినేలా ఉన్న ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపై సమగ్ర విచారణ జరగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on January 15, 2025 10:32 am

Share

Recent Posts

యష్ ఇమేజ్ వల్లే ఇంత ఓపెనింగ్

టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…

1 hour ago

చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…

2 hours ago

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

3 hours ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

3 hours ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

5 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

11 hours ago