Trends

ఒలింపిక్ మెడల్స్ నాణ్యతపై రచ్చరచ్చ

ఒలిపింక్స్ అంటేనే… వరల్డ్ క్లాస్ ఈవెంట్. దీనిని మించిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఈవెంట్ లో విజేతలకు ఇచ్చే పతకాల నాణ్యత ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటిదాకా అసలు అనుమానాలే రాలేదు. అయితే… పారిస్ ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ ఈవెంట్ మెడల్స్ ఫై గగ్గోలు పెడుతున్నారు.

ఆలా తమ చేతికి వచ్చిన మెడల్ ఇలా రంగు వెలిసి పోయిందట. ఈ మేరకు భారత క్రీడాకారులే కాకుండా పలు దేశాలకు చెందిన ప్లేయర్స్ కూడా మెడల్స్ కలర్ వెలిసిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు.

భారత్ కు చెందిన షూటింగ్ ప్లేయర్లు స్వప్నిల్, సరబ్ జ్యోత్ సింగ్ లు పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. పారిస్ వేదికగా వీరు మెడల్స్ తీసుకోగా… స్వదేశానికి తిరిగి వచ్చేలోగానే వాటి రంగు వెలిసిపోయిందట.

కేవలం 7 రోజుల్లోనే ఈ మెడల్స్ రంగు వెలిసిపోవడంఫై పెద్ద రచ్చ మొదలైంది. పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను బాకర్ పతకాలదీ ఇదే స్థితి అంట.

ఇదేదో… ఒక్క భారత క్రీడాకారులకు ఇచ్చిన పెడల్స్ కు పట్టిన గతి కాదు. చాల దేశాలకు చెందిన క్రీడాకారులకు ఇచ్చిన పతకాల పరిస్థితీ ఇదేనట. పారిస్ క్రీడా సంబరం ముగిసిన రోజుల వ్యవధిలోనే ఒలింపిక్స్ కమీటీకి ఈ దిశగా ఫిర్యాదులు రావడం మొదలైందట. దీంతో రంగు వెలసిన మెడల్స్ తిరిగి ఇస్తే వాటి స్థానంలో కొత్త పతకాలను ఇస్తామని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం చెబుతోంది.

ఇదే మాటను భారత ఒలింపిక్ సంఘం కూడా చెబుతోంది. అయినా.. రంగు మారిన మెడల్స్ రీప్లేస్ చేస్తామని చెప్పడం కాదు… ఒలింపిక్స్ ప్రతిష్ట దెబ్బ తినేలా ఉన్న ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపై సమగ్ర విచారణ జరగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on January 15, 2025 10:32 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago