తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారు నిల్వల్ని గుర్తించారు. ఇక్కడ దగ్గర దగ్గర 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లుగా తేల్చారు.
వీటి విలువ మన రూపాయిల్లో రూ.18వేల కోట్లుగా చెబుతున్నారు. అదే పాకిస్థాన్ రూపాయిల్లో చెప్పాలంటే 600 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే అంశాన్ని జియెలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ కూడా వెల్లడించింది.
విపరీతంగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఇంధన ధరలతో సామాన్యుడి బతుకు బండి కష్టంగా మారిన పాక్ ప్రజలకు ఇటీవల కాలంలో వరుస ఉగ్రదాడులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వేళలో భారీగా బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్తలు వారికి కొత్త ఆశల్ని తీసుకొస్తోంది.
ఈ భారీ బంగారాన్ని వెలికి తీసేయటం ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయని.. దేశం మీద ఉన్న అప్పుల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. పాక్ కరెన్సీ విలువ కాస్త వపెరుగుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బంగారు నిల్వలను వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించే అంశంపై తాము ఫోకస్ చేసినట్లుగా పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహాం హసన్ మురాద్ ప్రకటించారు. ఈ బంగారు నిల్వలు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇంతకూ ఈ భారీ బంగారునిల్వలు ఎలా సాధ్యమయ్యాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. సింధు నది.. హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయని.. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడి ఉంటాయిన చెబుతున్నారు.
వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్లకు పేరుకుపోయి.. ఇప్పుడీ నిల్వలకు కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on January 12, 2025 3:37 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…