తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారు నిల్వల్ని గుర్తించారు. ఇక్కడ దగ్గర దగ్గర 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లుగా తేల్చారు.
వీటి విలువ మన రూపాయిల్లో రూ.18వేల కోట్లుగా చెబుతున్నారు. అదే పాకిస్థాన్ రూపాయిల్లో చెప్పాలంటే 600 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే అంశాన్ని జియెలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ కూడా వెల్లడించింది.
విపరీతంగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఇంధన ధరలతో సామాన్యుడి బతుకు బండి కష్టంగా మారిన పాక్ ప్రజలకు ఇటీవల కాలంలో వరుస ఉగ్రదాడులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వేళలో భారీగా బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్తలు వారికి కొత్త ఆశల్ని తీసుకొస్తోంది.
ఈ భారీ బంగారాన్ని వెలికి తీసేయటం ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయని.. దేశం మీద ఉన్న అప్పుల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. పాక్ కరెన్సీ విలువ కాస్త వపెరుగుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బంగారు నిల్వలను వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించే అంశంపై తాము ఫోకస్ చేసినట్లుగా పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహాం హసన్ మురాద్ ప్రకటించారు. ఈ బంగారు నిల్వలు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇంతకూ ఈ భారీ బంగారునిల్వలు ఎలా సాధ్యమయ్యాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. సింధు నది.. హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయని.. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడి ఉంటాయిన చెబుతున్నారు.
వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్లకు పేరుకుపోయి.. ఇప్పుడీ నిల్వలకు కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on January 12, 2025 3:37 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…