Trends

పాక్ సుడి తిరిగింది: నదిలో 33 టన్నుల బంగారు నిల్వలు

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారు నిల్వల్ని గుర్తించారు. ఇక్కడ దగ్గర దగ్గర 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లుగా తేల్చారు.

వీటి విలువ మన రూపాయిల్లో రూ.18వేల కోట్లుగా చెబుతున్నారు. అదే పాకిస్థాన్ రూపాయిల్లో చెప్పాలంటే 600 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే అంశాన్ని జియెలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ కూడా వెల్లడించింది.

విపరీతంగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఇంధన ధరలతో సామాన్యుడి బతుకు బండి కష్టంగా మారిన పాక్ ప్రజలకు ఇటీవల కాలంలో వరుస ఉగ్రదాడులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వేళలో భారీగా బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్తలు వారికి కొత్త ఆశల్ని తీసుకొస్తోంది.

ఈ భారీ బంగారాన్ని వెలికి తీసేయటం ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయని.. దేశం మీద ఉన్న అప్పుల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. పాక్ కరెన్సీ విలువ కాస్త వపెరుగుతుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. బంగారు నిల్వలను వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించే అంశంపై తాము ఫోకస్ చేసినట్లుగా పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహాం హసన్ మురాద్ ప్రకటించారు. ఈ బంగారు నిల్వలు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్లుగా చెబుతున్నారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇంతకూ ఈ భారీ బంగారునిల్వలు ఎలా సాధ్యమయ్యాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. సింధు నది.. హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయని.. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడి ఉంటాయిన చెబుతున్నారు.

వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్లకు పేరుకుపోయి.. ఇప్పుడీ నిల్వలకు కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు.

This post was last modified on January 12, 2025 3:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

3 hours ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

5 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

5 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

7 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

7 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

8 hours ago