తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధూ నది లోయలో భారీగా బంగారు నిల్వల్ని గుర్తించారు. ఇక్కడ దగ్గర దగ్గర 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లుగా తేల్చారు.
వీటి విలువ మన రూపాయిల్లో రూ.18వేల కోట్లుగా చెబుతున్నారు. అదే పాకిస్థాన్ రూపాయిల్లో చెప్పాలంటే 600 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే అంశాన్ని జియెలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ కూడా వెల్లడించింది.
విపరీతంగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఇంధన ధరలతో సామాన్యుడి బతుకు బండి కష్టంగా మారిన పాక్ ప్రజలకు ఇటీవల కాలంలో వరుస ఉగ్రదాడులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వేళలో భారీగా బంగారు నిల్వలు బయటపడ్డాయన్న వార్తలు వారికి కొత్త ఆశల్ని తీసుకొస్తోంది.
ఈ భారీ బంగారాన్ని వెలికి తీసేయటం ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయని.. దేశం మీద ఉన్న అప్పుల భారం తగ్గుతుందని భావిస్తున్నారు. పాక్ కరెన్సీ విలువ కాస్త వపెరుగుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బంగారు నిల్వలను వెలికి తీసే ప్రక్రియను ప్రారంభించే అంశంపై తాము ఫోకస్ చేసినట్లుగా పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహాం హసన్ మురాద్ ప్రకటించారు. ఈ బంగారు నిల్వలు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇంతకూ ఈ భారీ బంగారునిల్వలు ఎలా సాధ్యమయ్యాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. సింధు నది.. హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయని.. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడి ఉంటాయిన చెబుతున్నారు.
వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్లకు పేరుకుపోయి.. ఇప్పుడీ నిల్వలకు కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on January 12, 2025 3:37 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…