ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు వారి వార్షిక వేతనంలో భారీ పెంపు కలిగింది. 2024 సంవత్సరానికి టిమ్ కుక్ వేతనం 18 శాతం పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
2023లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.643 కోట్లు) పెరిగింది. ఆపిల్ తన ప్రాక్సీ ఫైలింగ్లో టిమ్ కుక్ యొక్క వేతన వివరాలను వెల్లడించింది. కుక్కు కనీస వేతనం 3 మిలియన్ డాలర్లు కాగా, స్టాక్ అవార్డుల ద్వారా 58.1 మిలియన్ డాలర్లు, అదనపు ప్రోత్సాహకాల రూపంలో 13.5 మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు.
ఇది కుక్ వేతన ప్యాకేజీని మరింత గణనీయంగా పెంచింది. గత కొన్నేళ్లుగా ఆపిల్ సంస్థ టిమ్ కుక్ నేతృత్వంలో అనేక భవిష్యత్గామి టెక్నాలజీ పరిష్కారాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే టిమ్ కుక్ వేతనాన్ని పెంచుతూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, 2025లో టిమ్ కుక్ వేతన ప్యాకేజీలో ఎటువంటి మార్పులు చేయబోమని ఆపిల్ స్పష్టంచేసింది.
This post was last modified on January 12, 2025 10:41 am
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…