ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు వారి వార్షిక వేతనంలో భారీ పెంపు కలిగింది. 2024 సంవత్సరానికి టిమ్ కుక్ వేతనం 18 శాతం పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
2023లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.643 కోట్లు) పెరిగింది. ఆపిల్ తన ప్రాక్సీ ఫైలింగ్లో టిమ్ కుక్ యొక్క వేతన వివరాలను వెల్లడించింది. కుక్కు కనీస వేతనం 3 మిలియన్ డాలర్లు కాగా, స్టాక్ అవార్డుల ద్వారా 58.1 మిలియన్ డాలర్లు, అదనపు ప్రోత్సాహకాల రూపంలో 13.5 మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు.
ఇది కుక్ వేతన ప్యాకేజీని మరింత గణనీయంగా పెంచింది. గత కొన్నేళ్లుగా ఆపిల్ సంస్థ టిమ్ కుక్ నేతృత్వంలో అనేక భవిష్యత్గామి టెక్నాలజీ పరిష్కారాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే టిమ్ కుక్ వేతనాన్ని పెంచుతూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, 2025లో టిమ్ కుక్ వేతన ప్యాకేజీలో ఎటువంటి మార్పులు చేయబోమని ఆపిల్ స్పష్టంచేసింది.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…