ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు వారి వార్షిక వేతనంలో భారీ పెంపు కలిగింది. 2024 సంవత్సరానికి టిమ్ కుక్ వేతనం 18 శాతం పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
2023లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.643 కోట్లు) పెరిగింది. ఆపిల్ తన ప్రాక్సీ ఫైలింగ్లో టిమ్ కుక్ యొక్క వేతన వివరాలను వెల్లడించింది. కుక్కు కనీస వేతనం 3 మిలియన్ డాలర్లు కాగా, స్టాక్ అవార్డుల ద్వారా 58.1 మిలియన్ డాలర్లు, అదనపు ప్రోత్సాహకాల రూపంలో 13.5 మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు.
ఇది కుక్ వేతన ప్యాకేజీని మరింత గణనీయంగా పెంచింది. గత కొన్నేళ్లుగా ఆపిల్ సంస్థ టిమ్ కుక్ నేతృత్వంలో అనేక భవిష్యత్గామి టెక్నాలజీ పరిష్కారాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే టిమ్ కుక్ వేతనాన్ని పెంచుతూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, 2025లో టిమ్ కుక్ వేతన ప్యాకేజీలో ఎటువంటి మార్పులు చేయబోమని ఆపిల్ స్పష్టంచేసింది.
This post was last modified on January 12, 2025 10:41 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…