ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు వారి వార్షిక వేతనంలో భారీ పెంపు కలిగింది. 2024 సంవత్సరానికి టిమ్ కుక్ వేతనం 18 శాతం పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
2023లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.643 కోట్లు) పెరిగింది. ఆపిల్ తన ప్రాక్సీ ఫైలింగ్లో టిమ్ కుక్ యొక్క వేతన వివరాలను వెల్లడించింది. కుక్కు కనీస వేతనం 3 మిలియన్ డాలర్లు కాగా, స్టాక్ అవార్డుల ద్వారా 58.1 మిలియన్ డాలర్లు, అదనపు ప్రోత్సాహకాల రూపంలో 13.5 మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు.
ఇది కుక్ వేతన ప్యాకేజీని మరింత గణనీయంగా పెంచింది. గత కొన్నేళ్లుగా ఆపిల్ సంస్థ టిమ్ కుక్ నేతృత్వంలో అనేక భవిష్యత్గామి టెక్నాలజీ పరిష్కారాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే టిమ్ కుక్ వేతనాన్ని పెంచుతూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, 2025లో టిమ్ కుక్ వేతన ప్యాకేజీలో ఎటువంటి మార్పులు చేయబోమని ఆపిల్ స్పష్టంచేసింది.
This post was last modified on January 12, 2025 10:41 am
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…