ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు వారి వార్షిక వేతనంలో భారీ పెంపు కలిగింది. 2024 సంవత్సరానికి టిమ్ కుక్ వేతనం 18 శాతం పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
2023లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.643 కోట్లు) పెరిగింది. ఆపిల్ తన ప్రాక్సీ ఫైలింగ్లో టిమ్ కుక్ యొక్క వేతన వివరాలను వెల్లడించింది. కుక్కు కనీస వేతనం 3 మిలియన్ డాలర్లు కాగా, స్టాక్ అవార్డుల ద్వారా 58.1 మిలియన్ డాలర్లు, అదనపు ప్రోత్సాహకాల రూపంలో 13.5 మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు.
ఇది కుక్ వేతన ప్యాకేజీని మరింత గణనీయంగా పెంచింది. గత కొన్నేళ్లుగా ఆపిల్ సంస్థ టిమ్ కుక్ నేతృత్వంలో అనేక భవిష్యత్గామి టెక్నాలజీ పరిష్కారాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే టిమ్ కుక్ వేతనాన్ని పెంచుతూ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, 2025లో టిమ్ కుక్ వేతన ప్యాకేజీలో ఎటువంటి మార్పులు చేయబోమని ఆపిల్ స్పష్టంచేసింది.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…