పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్ కు రెండు ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టిన ప్రతిభావంతురాలు. ఇటీవలే వెంకట దత్తసాయి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతడూ తెలుగు వాడే.
ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే… శనివారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో సింధు తన భర్తతో కలిసి కనిపించింది. అంతేకాదండోయ్.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి షటిల్ కోర్టులో ఉల్లాసంగా కనిపించింది. రిజిజు పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
శనివారం ఉదయం 10 గంటల సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో సాయంత్రం 5 గంటల సమయానికి ఏకంగా లక్షకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇంకా ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. అయినా ఈ వీడియోలో అంతగా ఏముందన్న విషయానికి వస్తే… బీజేపీలో యమా యాక్టివ్ గా ఉండే రిజిజు పదేళ్లకు పైబడి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు కదా.
అయినా కూడా ఆయన సింధుకు ఏమాత్రం తగ్గకుండా షటిల్ ఆడుతున్నారు. రిజిజు కొట్టే షాట్లు అచ్చం షటిల్ ప్లేయర్లు కొట్టే షాట్ల మాదిరిగా…ఓ రకంగా చెప్పాలంటే ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ ఆడుతున్నట్లే ఆయన కనిపించారు. కసేపు రిజిజుతో కలిసి ఆడిన సింధు… మరికాసేపు రిజిజుకు పోటీగా ఆడింది.
ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సింధుతో ఆమె భర్త దత్తసాయి కూడా కనిపించారు. ఆట మధ్యలో నూతన దంపతులు ఇద్దరూ కేంద్ర మంత్రితో సరదాగా సంభాషిస్తూ కనిపించారు. ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లో భాగంగా ఇలా సింధు, దత్తసాయితో కలిసి బ్యాడ్మింటన్ ఆడానంటూ రిజిజు చెప్పుకొచ్చారు. సింధుతో మ్యాచ్ చాలా సరదాగా సాగిందని కూడా రిజిజు కామెంట్ చేశారు.
This post was last modified on January 11, 2025 6:29 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…