పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్ కు రెండు ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టిన ప్రతిభావంతురాలు. ఇటీవలే వెంకట దత్తసాయి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతడూ తెలుగు వాడే.
ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే… శనివారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో సింధు తన భర్తతో కలిసి కనిపించింది. అంతేకాదండోయ్.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి షటిల్ కోర్టులో ఉల్లాసంగా కనిపించింది. రిజిజు పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
శనివారం ఉదయం 10 గంటల సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో సాయంత్రం 5 గంటల సమయానికి ఏకంగా లక్షకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇంకా ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. అయినా ఈ వీడియోలో అంతగా ఏముందన్న విషయానికి వస్తే… బీజేపీలో యమా యాక్టివ్ గా ఉండే రిజిజు పదేళ్లకు పైబడి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు కదా.
అయినా కూడా ఆయన సింధుకు ఏమాత్రం తగ్గకుండా షటిల్ ఆడుతున్నారు. రిజిజు కొట్టే షాట్లు అచ్చం షటిల్ ప్లేయర్లు కొట్టే షాట్ల మాదిరిగా…ఓ రకంగా చెప్పాలంటే ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ ఆడుతున్నట్లే ఆయన కనిపించారు. కసేపు రిజిజుతో కలిసి ఆడిన సింధు… మరికాసేపు రిజిజుకు పోటీగా ఆడింది.
ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సింధుతో ఆమె భర్త దత్తసాయి కూడా కనిపించారు. ఆట మధ్యలో నూతన దంపతులు ఇద్దరూ కేంద్ర మంత్రితో సరదాగా సంభాషిస్తూ కనిపించారు. ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లో భాగంగా ఇలా సింధు, దత్తసాయితో కలిసి బ్యాడ్మింటన్ ఆడానంటూ రిజిజు చెప్పుకొచ్చారు. సింధుతో మ్యాచ్ చాలా సరదాగా సాగిందని కూడా రిజిజు కామెంట్ చేశారు.
This post was last modified on January 11, 2025 6:29 pm
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…