పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్ కు రెండు ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టిన ప్రతిభావంతురాలు. ఇటీవలే వెంకట దత్తసాయి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతడూ తెలుగు వాడే.
ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే… శనివారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో సింధు తన భర్తతో కలిసి కనిపించింది. అంతేకాదండోయ్.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి షటిల్ కోర్టులో ఉల్లాసంగా కనిపించింది. రిజిజు పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
శనివారం ఉదయం 10 గంటల సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో సాయంత్రం 5 గంటల సమయానికి ఏకంగా లక్షకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇంకా ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. అయినా ఈ వీడియోలో అంతగా ఏముందన్న విషయానికి వస్తే… బీజేపీలో యమా యాక్టివ్ గా ఉండే రిజిజు పదేళ్లకు పైబడి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు కదా.
అయినా కూడా ఆయన సింధుకు ఏమాత్రం తగ్గకుండా షటిల్ ఆడుతున్నారు. రిజిజు కొట్టే షాట్లు అచ్చం షటిల్ ప్లేయర్లు కొట్టే షాట్ల మాదిరిగా…ఓ రకంగా చెప్పాలంటే ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ ఆడుతున్నట్లే ఆయన కనిపించారు. కసేపు రిజిజుతో కలిసి ఆడిన సింధు… మరికాసేపు రిజిజుకు పోటీగా ఆడింది.
ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సింధుతో ఆమె భర్త దత్తసాయి కూడా కనిపించారు. ఆట మధ్యలో నూతన దంపతులు ఇద్దరూ కేంద్ర మంత్రితో సరదాగా సంభాషిస్తూ కనిపించారు. ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లో భాగంగా ఇలా సింధు, దత్తసాయితో కలిసి బ్యాడ్మింటన్ ఆడానంటూ రిజిజు చెప్పుకొచ్చారు. సింధుతో మ్యాచ్ చాలా సరదాగా సాగిందని కూడా రిజిజు కామెంట్ చేశారు.
This post was last modified on January 11, 2025 6:29 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…