పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్ కు రెండు ఒలింపిక్ పతకాలు సాధించిపెట్టిన ప్రతిభావంతురాలు. ఇటీవలే వెంకట దత్తసాయి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతడూ తెలుగు వాడే.
ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే… శనివారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో సింధు తన భర్తతో కలిసి కనిపించింది. అంతేకాదండోయ్.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి షటిల్ కోర్టులో ఉల్లాసంగా కనిపించింది. రిజిజు పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
శనివారం ఉదయం 10 గంటల సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో సాయంత్రం 5 గంటల సమయానికి ఏకంగా లక్షకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇంకా ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. అయినా ఈ వీడియోలో అంతగా ఏముందన్న విషయానికి వస్తే… బీజేపీలో యమా యాక్టివ్ గా ఉండే రిజిజు పదేళ్లకు పైబడి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు కదా.
అయినా కూడా ఆయన సింధుకు ఏమాత్రం తగ్గకుండా షటిల్ ఆడుతున్నారు. రిజిజు కొట్టే షాట్లు అచ్చం షటిల్ ప్లేయర్లు కొట్టే షాట్ల మాదిరిగా…ఓ రకంగా చెప్పాలంటే ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ ఆడుతున్నట్లే ఆయన కనిపించారు. కసేపు రిజిజుతో కలిసి ఆడిన సింధు… మరికాసేపు రిజిజుకు పోటీగా ఆడింది.
ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సింధుతో ఆమె భర్త దత్తసాయి కూడా కనిపించారు. ఆట మధ్యలో నూతన దంపతులు ఇద్దరూ కేంద్ర మంత్రితో సరదాగా సంభాషిస్తూ కనిపించారు. ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లో భాగంగా ఇలా సింధు, దత్తసాయితో కలిసి బ్యాడ్మింటన్ ఆడానంటూ రిజిజు చెప్పుకొచ్చారు. సింధుతో మ్యాచ్ చాలా సరదాగా సాగిందని కూడా రిజిజు కామెంట్ చేశారు.
This post was last modified on January 11, 2025 6:29 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…