రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియాకు ఆడిన ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించాడు. తన దశాబ్ద కాలకాలం క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ, అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
క్రికెట్ పట్ల తన ప్రేమను, తనకు ఆ క్రీడ ఇచ్చిన అపార అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. “గత 20 సంవత్సరాలుగా క్రికెట్ మైదానంలో జీవితాన్ని గడిపాను. ఫాస్ట్ బౌలింగ్ నా మొదటి ప్రేమ. ఇవాళ మైదానాన్ని వీడుతున్నప్పటికీ, క్రికెట్ పట్ల నా ప్రేమ ఎప్పటికీ ఉండిపోతుంది,” అని తన సోషల్ మీడియా పోస్టులో ఆరోన్ భావోద్వేగంగా పేర్కొన్నాడు.
విజయ్ హజారే ట్రోఫీ ద్వారా 2010-11లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వరుణ్ ఆరోన్, 21 ఏళ్ల వయస్సులో తన గంటకు 150 కిమీ పైగా వేగంతో బౌలింగ్ సామర్థ్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 9 టెస్టులు, 9 వన్డేలు ఆడిన అతను, మొత్తం 29 వికెట్లను సాధించాడు. 2015లో దక్షిణాఫ్రికాపై బెంగళూరులో జరిగిన టెస్టు మ్యాచ్ వరుణ్ ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది.
దేశవాళీ క్రికెట్లో వరుణ్ 88 లిస్ట్-ఏ మ్యాచ్లలో 141 వికెట్లు, 95 టీ20 మ్యాచ్లలో 93 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో తొమ్మిది సీజన్లకు ప్రాతినిధ్యం వహించిన అతను ఢిల్లీ డేర్డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ వంటి జట్ల తరఫున ఆడాడు. ఐపీఎల్లో అతని వేగవంతమైన బౌలింగ్ తరచుగా ప్రత్యర్థులకు సవాలు విసిరేది. ఇక వరుణ్ రిటైర్మెంట్ పట్ల టీమిండియా క్రికెటర్లు అతనికి విషెస్ అందిస్తున్నారు.
This post was last modified on January 11, 2025 9:04 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…