రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియాకు ఆడిన ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించాడు. తన దశాబ్ద కాలకాలం క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ, అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
క్రికెట్ పట్ల తన ప్రేమను, తనకు ఆ క్రీడ ఇచ్చిన అపార అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. “గత 20 సంవత్సరాలుగా క్రికెట్ మైదానంలో జీవితాన్ని గడిపాను. ఫాస్ట్ బౌలింగ్ నా మొదటి ప్రేమ. ఇవాళ మైదానాన్ని వీడుతున్నప్పటికీ, క్రికెట్ పట్ల నా ప్రేమ ఎప్పటికీ ఉండిపోతుంది,” అని తన సోషల్ మీడియా పోస్టులో ఆరోన్ భావోద్వేగంగా పేర్కొన్నాడు.
విజయ్ హజారే ట్రోఫీ ద్వారా 2010-11లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వరుణ్ ఆరోన్, 21 ఏళ్ల వయస్సులో తన గంటకు 150 కిమీ పైగా వేగంతో బౌలింగ్ సామర్థ్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 9 టెస్టులు, 9 వన్డేలు ఆడిన అతను, మొత్తం 29 వికెట్లను సాధించాడు. 2015లో దక్షిణాఫ్రికాపై బెంగళూరులో జరిగిన టెస్టు మ్యాచ్ వరుణ్ ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది.
దేశవాళీ క్రికెట్లో వరుణ్ 88 లిస్ట్-ఏ మ్యాచ్లలో 141 వికెట్లు, 95 టీ20 మ్యాచ్లలో 93 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో తొమ్మిది సీజన్లకు ప్రాతినిధ్యం వహించిన అతను ఢిల్లీ డేర్డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ వంటి జట్ల తరఫున ఆడాడు. ఐపీఎల్లో అతని వేగవంతమైన బౌలింగ్ తరచుగా ప్రత్యర్థులకు సవాలు విసిరేది. ఇక వరుణ్ రిటైర్మెంట్ పట్ల టీమిండియా క్రికెటర్లు అతనికి విషెస్ అందిస్తున్నారు.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…