ఈ ఏడాది ఐపీఎల్లో అంపైరింగ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కరోనా భయం మధ్య, బయో బబుల్లో, అది కూడా యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడూ ఐపీఎల్లో అంపైరింగ్ చేసే ఎలైట్ అంపైర్లు ఈసారి అందుబాటులో లేరు. చాలా వరకు భారతీయ అంపైర్లు, అంతగా పేరు లేని విదేశీ అంపైర్లు మ్యాచ్ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఐతే వారి అంపైరింగ్ ప్రమాణాలకు తగ్గట్లు లేకపోవడం విమర్శల పాలవుతంోది. తరచుగా అంపైరింగ్ తప్పిదాలు చోటు చేసుకుంటుండటంతో ఇటు ఆటగాళ్ల నుంచి అటు అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో మంగళవారం రాత్రి చెన్నై సూపర్కింగ్స్, సన్రైజర్స్ మ్యాచ్లో చోటు చేసుకున్న ఓ పరిణామం దుమారం రేపింది.
ఛేదనలో సన్రైజర్స్ బ్యాటింగ్ సందర్భంగా 19వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన బంతి ఆఫ్ సైడ్ ఆవల పడింది. రషీద్ ఖాన్ దాన్ని షాట్ ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అది వైడ్ అనే అంతా అనుకున్నారు. అంపైర్ కూడా వైడ్ ఇవ్వడానికి చేతులు చాచుతూ పక్కకు తిరిగాడు. కానీ అంతలో ధోని కోపంగా అంపైర్ వైపు చూస్తూ ఇది వైడేంటి అన్నట్లుగా సంకేతం ఇచ్చాడు. అంతే.. అంపైర్ చేతులు కిందికి దించుతూ వైడ్ సిగ్నల్ ఇవ్వకుండా ఆగిపోయాడు.
ఇదంతా డగౌట్ నుంచి చూస్తున్న సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఇదేం అన్యాయం అన్నట్లుగా చూశాడు. టీవీలో ఈ దృశ్యాలు చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అది వైడా కాదా అన్నది పక్కన పెడితే.. ధోని కోపం చూసి అంపైర్ వైడ్ ఇవ్వబోయి ఆగిపోవడం ఎవ్వరికీ మింగుడు పడలేదు. దీంతో సన్రైజర్స్ అభిమానులు, చెన్నై సూపర్ కింగ్స్ వ్యతిరేకులు ధోనీని, అంపైర్ను ట్రోల్ చేశారు. ఐపీఎల్ ప్రమాణాలను ప్రశ్నించారు.
This post was last modified on October 14, 2020 3:46 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…