మంగళవారం తెల్లవారుజామున నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో తీవ్ర భూకంపం సంభవించి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. పలు భవనాలు కూలిపోగా, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడినట్లు టిబెట్ అధికారులు తెలిపారు. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఈ భూకంపం ప్రభావం నేపాల్తో పాటు భారత్లోని పలు రాష్ట్రాల్లోనూ కన్పించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నివేదించబడింది. అలాగే బీహార్, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.
ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 6:30 గంటలకు మొదటిసారి భూమి కంపించగా, 7:02 గంటలకు 4.7 తీవ్రతతో రెండో ప్రకంపన, అనంతరం 4.9 తీవ్రతతో మరో ప్రకంపన చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.
భూగర్భ టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా హిమాలయాలకు సమీపంలోని ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015లో నేపాల్లో జరిగిన భూకంపం అందుకు ఉదాహరణ. ఆ ఘటనలో 9,000 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా భూకంపం మరోసారి ఆ భయానకాన్ని గుర్తు చేసింది. ప్రజలు భయాందోళనలో ఉంటూనే ఆస్తి, ప్రాణ నష్టాన్ని భరించాల్సి వస్తోంది.
భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టిబెట్ మరియు నేపాల్ ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయక చర్యలకు తెరతీశాయి. చికిత్స కోసం బాధితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గాయపడిన వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
This post was last modified on January 7, 2025 11:48 am
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూణ్నాలుగు రోజులుగా నడుస్తున్న సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్కి అవకాశమిచ్చాడు. సొంతంగా…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన…
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఆయన పార్లమెంటులో…
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…