Trends

హెఎంపీవీ వైరస్…ఇండియాది, చైనాది వేర్వేరా?

కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల మీద ఎంత ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. బెంగుళూరులో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయని ఐసీఎంఆర్ అధికారికంగా ధృవీకరించింది.

అయితే, హెఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదని, 20 ఏళ్ల నుంచి ఇండియాతోపాటు పలు దేశాలలో అడపాదడపా ఆ కేసులు నమోదవుతుంటాయని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి దినేశ్ గుండు చెబుతున్నారు. అయితే, చైనాలో హెచ్ఎంపీవీ వేరియంట్ కొత్తదని, భారత్ లో కనుగొన్న వేరియంట్, చైనా వేరియంట్ ఒకటా కాదా అన్నది ఇంకా తేలాల్సి ఉందని ఆయన చెప్పారు.

ఈ కొత్త వైరస్ గురించి మరిన్ని వివరాలు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావాల్సి ఉందన్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 3, 8 నెలల వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్‌ ను గుర్తించామని, ఒక చిన్నారికి వైరస్‌ తగ్గుముఖం పట్టగా.. మరొకరికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆ ఇద్దరు చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని వెల్లడించారు.

ఈ కేసులతో అలర్ట్ అయిన భారత్…డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ మీటింగ్ నిర్వహించింది. ముందస్తు చర్యగా ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ నిర్ధారణ పరీక్షలును పలు చోట్ల నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీహెచ్ఎస్ తెలిపింది.

కొత్త హెచ్ఎంపీవీ వేరియంట్ గురించి తెలుసుకునేందుకు చైనా ఆరోగ్య శాఖను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థతో టచ్ లో ఉన్నామని, ఈ కొత్త వైరస్ కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, అప్రమత్తమవుతామని చెప్పింది.

This post was last modified on January 6, 2025 1:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

53 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago