సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని జనం చెప్పుకునేలా చేసిందా మహమ్మారి. ఆ మాయదారి వైరస్ చేసిన గాయాల నుంచి కోట్లాది కుటుంబాలు ఇంకా కోలుకోకముందే తాజాగా మరో వైరస్ ప్రపంచంపై పంజా విసిరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
కరోనా మాదిరిగా చైనాలో పుట్టిన హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ ఎంపీవీ) కేసులు ఆ తర్వాత మలేషియాలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ మహమ్మారి వైరస్ భారత్కూ పాకినట్లు కనిపిస్తోంది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు జాతీయ మీడియా నుండి కథనాలు వస్తున్నాయి. అయితే, ఓ ప్రైవేటు ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జాతీయ మీడియా కథనాలు రాసిందని కర్ణాటక ఆరోగ్య శాఖ చెబుతోంది.
ఆ రిపోర్ట్ పై తమకు అనుమానాలు లేవంటూనే…రాష్ట్రంలోని ల్యాబ్ లో ఆ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ కేసుపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది. హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన ప్రమాదకరమైన వైరస్. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులను ఇది టార్గెట్ చేస్తుంది.
సాధారణ ఫ్లూ మాదిరిగానే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఈ వైరస్ సోకినవారిలో కనిపిస్తాయి. ఈ వైరస్ తీవ్రత ఎక్కువైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చే అవకాశముంది.
This post was last modified on January 6, 2025 12:27 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…