Trends

భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు?

సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని జనం చెప్పుకునేలా చేసిందా మహమ్మారి. ఆ మాయదారి వైరస్ చేసిన గాయాల నుంచి కోట్లాది కుటుంబాలు ఇంకా కోలుకోకముందే తాజాగా మరో వైరస్ ప్రపంచంపై పంజా విసిరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

కరోనా మాదిరిగా చైనాలో పుట్టిన హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (హెచ్ ఎంపీవీ) కేసులు ఆ తర్వాత మలేషియాలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ మహమ్మారి వైరస్ భారత్‌కూ పాకినట్లు కనిపిస్తోంది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు జాతీయ మీడియా నుండి కథనాలు వస్తున్నాయి. అయితే, ఓ ప్రైవేటు ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జాతీయ మీడియా కథనాలు రాసిందని కర్ణాటక ఆరోగ్య శాఖ చెబుతోంది.

ఆ రిపోర్ట్ పై తమకు అనుమానాలు లేవంటూనే…రాష్ట్రంలోని ల్యాబ్ లో ఆ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ కేసుపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది. హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన ప్రమాదకరమైన వైరస్. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులను ఇది టార్గెట్ చేస్తుంది.

సాధారణ ఫ్లూ మాదిరిగానే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఈ వైరస్ సోకినవారిలో కనిపిస్తాయి. ఈ వైరస్ తీవ్రత ఎక్కువైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చే అవకాశముంది.

Kumar

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

20 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

1 hour ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

1 hour ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago