Trends

భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు?

సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని జనం చెప్పుకునేలా చేసిందా మహమ్మారి. ఆ మాయదారి వైరస్ చేసిన గాయాల నుంచి కోట్లాది కుటుంబాలు ఇంకా కోలుకోకముందే తాజాగా మరో వైరస్ ప్రపంచంపై పంజా విసిరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

కరోనా మాదిరిగా చైనాలో పుట్టిన హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (హెచ్ ఎంపీవీ) కేసులు ఆ తర్వాత మలేషియాలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ మహమ్మారి వైరస్ భారత్‌కూ పాకినట్లు కనిపిస్తోంది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు జాతీయ మీడియా నుండి కథనాలు వస్తున్నాయి. అయితే, ఓ ప్రైవేటు ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జాతీయ మీడియా కథనాలు రాసిందని కర్ణాటక ఆరోగ్య శాఖ చెబుతోంది.

ఆ రిపోర్ట్ పై తమకు అనుమానాలు లేవంటూనే…రాష్ట్రంలోని ల్యాబ్ లో ఆ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ కేసుపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది. హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన ప్రమాదకరమైన వైరస్. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులను ఇది టార్గెట్ చేస్తుంది.

సాధారణ ఫ్లూ మాదిరిగానే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఈ వైరస్ సోకినవారిలో కనిపిస్తాయి. ఈ వైరస్ తీవ్రత ఎక్కువైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చే అవకాశముంది.

This post was last modified on January 6, 2025 12:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

55 minutes ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

4 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

6 hours ago