సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అని జనం చెప్పుకునేలా చేసిందా మహమ్మారి. ఆ మాయదారి వైరస్ చేసిన గాయాల నుంచి కోట్లాది కుటుంబాలు ఇంకా కోలుకోకముందే తాజాగా మరో వైరస్ ప్రపంచంపై పంజా విసిరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
కరోనా మాదిరిగా చైనాలో పుట్టిన హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ ఎంపీవీ) కేసులు ఆ తర్వాత మలేషియాలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ మహమ్మారి వైరస్ భారత్కూ పాకినట్లు కనిపిస్తోంది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు జాతీయ మీడియా నుండి కథనాలు వస్తున్నాయి. అయితే, ఓ ప్రైవేటు ఆసుపత్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జాతీయ మీడియా కథనాలు రాసిందని కర్ణాటక ఆరోగ్య శాఖ చెబుతోంది.
ఆ రిపోర్ట్ పై తమకు అనుమానాలు లేవంటూనే…రాష్ట్రంలోని ల్యాబ్ లో ఆ పరీక్ష నిర్వహించలేదని తెలిపింది. ఆ కేసుపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇంకా ప్రకటన వెలువడాల్సి ఉంది. హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన ప్రమాదకరమైన వైరస్. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులను ఇది టార్గెట్ చేస్తుంది.
సాధారణ ఫ్లూ మాదిరిగానే జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఈ వైరస్ సోకినవారిలో కనిపిస్తాయి. ఈ వైరస్ తీవ్రత ఎక్కువైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చే అవకాశముంది.
This post was last modified on January 6, 2025 12:27 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…