ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ ప్లాట్ఫారంగా గుర్తింపు పొందిన ఓయో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మేజర్ వయసు ఉన్నవారెవరైనా ఐడీ ప్రూఫ్ చూపించి రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రత్యేకంగా ప్రేమజంటలకు ఇది ఫస్ట్ ఆప్షన్గా నిలిచింది. అయితే నూతన సంవత్సరంలో ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు.
తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలు ప్రకారం, ఇకపై ఓయోలో రూమ్ బుక్ చేసుకునే జంటలు తమ వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వడం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మీరట్ నగరంతో ఈ రూల్ అమలు ప్రారంభమవుతుందని, తర్వాత క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు రితేశ్ అగర్వాల్ వివరించారు.
ఓయో ప్రతినిధుల ప్రకటన ప్రకారం, ఈ కొత్త నిబంధనలు సంస్థ చొరవగా తీసుకున్న నిర్ణయం. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణించే వారికి సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని చెబుతున్నారు. అలాగే, హోటల్ బుకింగ్ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ కొత్త రూల్స్పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఓయో సంస్థ ఈ విధంగా రిస్క్ తీసుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. మరి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో ఏమేరకు ప్రభావం ఉంటుందో చూడాలి.
This post was last modified on January 5, 2025 3:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…