ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఔట్ తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు వరుసగా విఫలమవుతుండగా, జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ భారత జట్టుకు ఆశలు చిగురింపజేశాడు. కానీ 84 పరుగుల వ్యక్తిగత స్కోరులో అతని ఔట్ తీరు వివాదాలకు కారణమైంది.
పాట్ కమిన్స్ బౌలింగ్లో 70.5 ఓవర్ వద్ద జైస్వాల్ బంతిని ఆడేందుకు ప్రయత్నించగా, అది వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. ఆసీస్ ప్లేయర్లు వెంటనే ఔట్ అని అప్పీలు చేశారు. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో కమిన్స్ రివ్యూ కోరాడు. రిప్లేలో స్నికో మీటర్లో ఎలాంటి స్పైక్స్ రాకపోయినప్పటికీ, బంతి గమనం మారినట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు.
ఈ నిర్ణయం జైస్వీతోపాటు క్రికెట్ అభిమానుల్లోనూ అసంతృప్తి రేకెత్తించింది. థర్డ్ అంపైర్ తీర్పు బలహీనంగా ఉందని, స్నికో మీటర్లో స్పైక్స్ రాకపోతే ఔట్గా ఎలా ప్రకటించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జైస్వాల్ నిష్క్రమణ సమయంలో తన అసహనాన్ని వ్యక్తం చేయగా, ఈ వివాదం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. థర్డ్ అంపైర్ నిద్ర పోతున్నాడా ఏంటీ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అదేవిధంగా అక్షదీప్ వికెట్ కూడా ఇలాంటి చర్చకే దారితీసింది. బాల్ ట్రాకింగ్ లో బాల్ బ్యాట్ ను దాటుతుండగా ఎర్రటి మరకపడడం గమనించిన నెటిజెన్స్ అదెలా ఔట్ గా ప్రకటిస్తారు అనే విమర్శలు చేస్తున్నారు.
క్రీడా విశ్లేషకులు సాంకేతికతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో సాంకేతికత ఉపయోగంపై మరింత కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జైస్వాల్ ఔటైన తర్వాత భారత జట్టు పూర్తిగా కోలుకోలేక, 155 పరుగులకే ఆలౌట్ కావడం ఆడిన ప్రతి వికెట్ మరింత కీలకమని రుజువు చేసింది.
This post was last modified on December 30, 2024 3:46 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…