‘పోస్ట్ నో ఈవిల్’, న‌గ‌రాల్లో పోస్ట‌ర్లు పెట్టిన ఏపీ ప్ర‌భుత్వం

వైసీపీ హ‌యాంలో దారి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్నామ‌ని ప‌దే పదే చెప్పిన సీఎం చంద్ర‌బా బు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు నిజంగానే ఆ ప‌ని చేస్తున్నారు. ఇప్పటికి అంత‌ర్గ‌తంగా కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను దారిలోకి తీసుకువ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు తాజాగా సోష‌ల్ మీడియా ను కూడా సంస్క‌రించే ప‌నిని ప్రారంభించారు. వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా అంటే.. బూతుల‌కు, దుర్బాష‌ల‌కు, ప‌రుష కామెంట్ల‌కు వేదిక‌గా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి.

నాయ‌కుల‌పైనా, పార్టీల‌పైనే కాకుండా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా తీవ్ర విమర్శ‌లు చేసిన నెటిజ‌న్లు ఉన్నారు. వీరంద‌రినీ ఇప్పుడు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు.. సోష‌ల్ మీడియాలో ఒక్క నాయ‌కుల‌పైనే కాదు.. సొంత వ్య‌వ‌హారాలు స‌హా.. యువ‌తులపైనా.. మ‌హిళ‌ల‌పైనా కామెంట్లు చేయ‌కుం డా క‌ట్ట‌డి చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ఇష్టానుసారంగా మారిపోయిన సోష‌ల్ మీడియాను ఇప్పుడు ప్ర‌జా ప్ర‌యోజ‌న మాధ్య‌మంగా మలిచేందుకు, యువ‌త‌లో మార్పు తెచ్చేందుకు కూట‌మి స‌ర్కారు ప్ర‌త్యేక ప్ర‌చారం చేప‌ట్టింది.

దీనిలో భాగంగా ప్ర‌ధాన కూడ‌ళ్లు.. ర‌హ‌దారుల‌పై భారీ ఎత్తునప్ర‌భుత్వ ఖ‌ర్చుతో పోస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేసిం ది. విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి, విశాఖ‌, తిరుప‌తి, రాజ‌మండ్రి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌తోపాటు క‌డ‌ప‌లోనూ ఈ పోస్ట‌ర్ల‌ను విరివిగా ఏర్పాటు చేశారు. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దనే గాంధీజీ సూక్తి తో ఈ ప్ర‌చారం ప్రారంభించారు. ఈ పోస్ట‌ర్ల‌పై మూడు కోతుల బొమ్మ‌లు కూడా ముద్రించారు. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర‌, చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులను మ‌లిచారు.

“పోస్ట్ నో ఈవిల్” పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర‌హ‌దారులు, ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన ఈ పోస్ట‌ర్ల‌ద్వారా “మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్‌పీరియ‌న్స్‌` అనే నినాదాన్ని ప్ర‌చారం చేయ‌నున్నారు. త‌ద్వారా సోష‌ల్ మీడియాను అత్య‌వ‌స‌ర సేవ‌లు, విలువైన స‌మాచారం, శుభాకాంక్ష‌లు, ధ‌న్య‌వాదాలు తెలుపుకునేలా వినియోగించాల‌ని.. అభ్యంత‌క‌ర మెసేజ్‌ల కోసం కాద‌ని స‌ర్కారు నేరుగా స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. తొలిసారి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on December 29, 2024 9:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

50 minutes ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

2 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

3 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

4 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

6 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

8 hours ago