‘పోస్ట్ నో ఈవిల్’, న‌గ‌రాల్లో పోస్ట‌ర్లు పెట్టిన ఏపీ ప్ర‌భుత్వం

వైసీపీ హ‌యాంలో దారి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్నామ‌ని ప‌దే పదే చెప్పిన సీఎం చంద్ర‌బా బు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు నిజంగానే ఆ ప‌ని చేస్తున్నారు. ఇప్పటికి అంత‌ర్గ‌తంగా కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను దారిలోకి తీసుకువ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు తాజాగా సోష‌ల్ మీడియా ను కూడా సంస్క‌రించే ప‌నిని ప్రారంభించారు. వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా అంటే.. బూతుల‌కు, దుర్బాష‌ల‌కు, ప‌రుష కామెంట్ల‌కు వేదిక‌గా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి.

నాయ‌కుల‌పైనా, పార్టీల‌పైనే కాకుండా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా తీవ్ర విమర్శ‌లు చేసిన నెటిజ‌న్లు ఉన్నారు. వీరంద‌రినీ ఇప్పుడు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు.. సోష‌ల్ మీడియాలో ఒక్క నాయ‌కుల‌పైనే కాదు.. సొంత వ్య‌వ‌హారాలు స‌హా.. యువ‌తులపైనా.. మ‌హిళ‌ల‌పైనా కామెంట్లు చేయ‌కుం డా క‌ట్ట‌డి చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ఇష్టానుసారంగా మారిపోయిన సోష‌ల్ మీడియాను ఇప్పుడు ప్ర‌జా ప్ర‌యోజ‌న మాధ్య‌మంగా మలిచేందుకు, యువ‌త‌లో మార్పు తెచ్చేందుకు కూట‌మి స‌ర్కారు ప్ర‌త్యేక ప్ర‌చారం చేప‌ట్టింది.

దీనిలో భాగంగా ప్ర‌ధాన కూడ‌ళ్లు.. ర‌హ‌దారుల‌పై భారీ ఎత్తునప్ర‌భుత్వ ఖ‌ర్చుతో పోస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేసిం ది. విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి, విశాఖ‌, తిరుప‌తి, రాజ‌మండ్రి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌తోపాటు క‌డ‌ప‌లోనూ ఈ పోస్ట‌ర్ల‌ను విరివిగా ఏర్పాటు చేశారు. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దనే గాంధీజీ సూక్తి తో ఈ ప్ర‌చారం ప్రారంభించారు. ఈ పోస్ట‌ర్ల‌పై మూడు కోతుల బొమ్మ‌లు కూడా ముద్రించారు. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర‌, చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులను మ‌లిచారు.

“పోస్ట్ నో ఈవిల్” పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర‌హ‌దారులు, ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన ఈ పోస్ట‌ర్ల‌ద్వారా “మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్‌పీరియ‌న్స్‌` అనే నినాదాన్ని ప్ర‌చారం చేయ‌నున్నారు. త‌ద్వారా సోష‌ల్ మీడియాను అత్య‌వ‌స‌ర సేవ‌లు, విలువైన స‌మాచారం, శుభాకాంక్ష‌లు, ధ‌న్య‌వాదాలు తెలుపుకునేలా వినియోగించాల‌ని.. అభ్యంత‌క‌ర మెసేజ్‌ల కోసం కాద‌ని స‌ర్కారు నేరుగా స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా.. తొలిసారి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on December 29, 2024 9:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

3 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

4 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

5 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

5 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

5 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

6 hours ago