ప్రముఖులకు సంబంధించి విషయాలు తరచూ చర్చకు వస్తూ ఉంటాయి. మీడియాకు మించి సోషల్ మీడియా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అవసరం లేని విషయాల మీద చర్చ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కొన్ని అబద్ధాల్ని అందమైన నిజాలుగా చూపించే సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది నిజం? అన్నది తెలుసుకోవటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది.
దేశీయంగా సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ వినియోగించే ఐఫోన్ ముచ్చట తరచూ జరుగుతుంటుంది. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ గా అంబానీ ఫ్యామిలీకి ఒక ఇమేజ్ ఉంది. ఆడంబరాల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. దీంతో.. వారికి సంబంధించిన కొన్ని అబద్ధాలు నిజాలుగా ప్రచారం జరుగుతుంటాయి. ఆ కోవలోకే వస్తుంది ఈ నీతా అంబానీ వద్ద ఉన్న వందల కోట్ల రూపాయిల విలువ చేసే ఐఫోన్.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ నీతా అంబాని వద్ద ఉన్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. దీనికి కారణం నీతా అంబానీ వద్ద ఉన్న ఐఫోన్ వెనుక బంగారంతో పాటు.. ఖరీదైన పింక్ డైమండ్ ఉందని.. దాని విలువ రూ.403 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతూ ఉంటుంది.అయితే.. దీనికి సంబంధించి రిలయన్స్ వివరణ ఇవ్వటమే కాదు.. ప్రముఖ మీడియా సంస్థల్లో ఒకటైన ఇండియా టుడే సైతం.. అలాంటి ఫోన్ ను నీతూ అంబానీ ఎప్పుడు వాడలేదని తేల్చేసింది.
అదే సమయంలో..ఆమె ధరించే దుస్తుల అంశం చర్చకు వచ్చింది. ఇటీవల ఆమె ముంబయిలోని ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ఓపెనింగ్ కు వచ్చిన ఆమె.. ఒక డ్రెస్ ను ధరించారు. అది పలువురిని ఆకర్షించింది. సోషల్ సర్కిల్స్ లో హాట్ చర్చగా మారిన ఆమె ధరించిన వైట్ సిల్క్ టాప్ ఖరీదైనదిగా లెక్క తేల్చారు. దాని ధర మన రూపాయిల్లో రూ.1.18 లక్షలుగా చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర కూడా ఆమె వద్ద ఉందని.. దాని ధర రూ.40 లక్షలు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ 20 సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ సతీమణి అన్న తర్వాత ఆ మాత్రం ఉండొద్దా?
This post was last modified on December 29, 2024 4:16 pm
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…