Trends

ఆ రోజుల్లో… శ్రీవారు క‌నిపించేది సెక‌నంటే సెక‌నే!!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఓ 2 నిమిషాలు ల‌భిస్తుంద‌ని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్న‌గారు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ద‌ర్శ‌నం విష‌యంలో ఒక నిర్ణ‌యం తీసుకున్నారు. “ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని వ‌చ్చే భ‌క్తుల కోసం శ్రీవారి ద‌ర్శ‌నం క‌నీసం నిమిషం కూడా క‌ల్పించ‌లేమా?” అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఈ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌ని అప్ప‌టి ఈవోను ఆదేశించారు. దీంతో ఒక నిమిషం సేపు శ్రీవారిని ద‌ర్శించుకునేలా ఈవో నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే క్యూ లైన్ల స్థానంలో కాంప్లెక్సులు వ‌చ్చాయి. అంటే.. ద‌ర్శ‌నం క‌నీసం ఒక్క నిమిషం అయినా.. క‌ల్పించాలంటే భారీ సంఖ్య‌లో వ‌చ్చేవారిని అలా నిల‌బెట్ట‌కుండా.. కూర్చోబెట్టాల‌ని, ఆల‌స్య‌మైనా.. ఫ‌ర్వాలేదు.. అయ్య‌వారిని ఆసాంతం ద‌ర్శించేలా చేయాల‌న్న బృహ‌త్ సంక‌ల్పంతో కాంప్లెక్సులు నిర్మించి.. ‘నిమిషం’ నిబంధ‌న‌ను అమ‌లు చేశారు. ఇది కొన్నాళ్లు అమ‌లైంది. అయితే.. భ‌క్తుల ర‌ద్దీ పెరిగిపోవ‌డం.. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వాలు మార‌డంతో ఈ నిర్ణ‌యం బుట్ట‌దాఖ‌లైంది.

త‌ర్వాత‌..వీఐపీ సంస్కృతికి పెద్ద‌పీట ప‌డింది. ఇక‌, ఇప్పుడు శ్రీవారు ఎవ‌రిని క‌రుణించాల‌న్నా.. 30-35 సెక‌నుల మ‌ధ్యే! అంతే.. స‌మ‌యంలో స్వామి వారి ముందు సామాన్యుడి దండాలు.. మొక్కులు ఉంటా యి. ఇంత‌కు మించి.. ఏ ఒక్క సామాన్యుడు(300 పెట్టి టికెట్ కొన్నా కూడా) కూడా శ్రీవారి ముందు మోక‌రిల్లే స‌మ‌యం లేనే లేదు. ఇది రాను రాను మ‌రింత క్షీణిస్తోంది. తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణ‌యం అయితే.. శ్రీవారి ముందు భ‌క్తుడి నిరీక్ష‌ణా స‌మ‌యం కేవ‌లం సెక‌నంటే సెక‌నుకు ప‌డిపోయింది.

ఆశ్చ‌ర్యంగా ఉన్నా నిజం. వ‌చ్చే నెల సంక్రాంతి, కొత్త సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని.. ముఖ్యంగా వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని 10, 11, 12 తేదీల్లో.. శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు సామాన్య భ‌క్తుల కోసం 1.2 ల‌క్ష‌ల టికెట్లు విడుద‌ల చేస్తున్నారు. అంటే మూడు రోజుల్లో ల‌క్షా 20 వేల మంది భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తున్నారు. వీరంతా సామాన్యులే. ఇక‌, వీఐపీలు, వీవీఐపీలు ప్ర‌త్యేకం. వీరికి వేరే కోటా ఉంటుంది. అంటే.. మొత్తంగా మూడు రోజుల్లో వ‌చ్చే భ‌క్తులు ల‌క్షా 20 వేల మంది భ‌క్తుల‌కు శ్రీవారిద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నార‌న్న మాట‌.

దీనిని కొంత కాలిక్యులేట్ చేస్తే.. వ‌చ్చే లెక్క చూద్దాం..

రోజుకు 24 గంట‌లు. శ్రీవారి ద‌ర్శ‌నం ల‌భించేది 20 గంట‌లు. అర్థ‌రాత్రి 1.30 నుంచి 3.30 వ‌ర‌కు మూసివేస్తారు. ఇక‌, నైవేద్య విరామం, ఇత‌ర సేవ‌ల విరామాల పేరిట మ‌రో 2 గంట‌లు పోగా.. 20 గంట‌లు శ్రీవారి ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌ని అంచ‌నా వేసుకుంటే.. మూడు రోజులు.. 60 గంట‌ల పాటు శ్రీవారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఈ లెక్క‌న ల‌క్షా 20 వేల మంది భ‌క్తుల‌కు టికెట్లు ఇస్తే.. ఇంత మందిలో ఒక్కొక్క‌రికీ శ్రీవారిని ద‌ర్శించుకునే స‌మ‌యం కేవ‌లం ‘సెక‌ను’ మాత్ర‌మే. గంట‌కు 2000 మంది ద‌ర్శించుకుంటారు. అంటే.. నిమిషానికి 40 మంది. సెక‌ను, లేదా సెక‌నున్న‌ర‌కు ఒక్క‌రు! ఇదీ.. శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం. సో.. ఆయా రోజుల్లో శ్రీవారి ద‌ర్శ‌నం ఈష‌ణ్మాత్ర‌మేన‌న్న మాట!!

This post was last modified on December 26, 2024 11:50 pm

Share
Show comments
Published by
Satya
Tags: TirumalaTTD

Recent Posts

ఆయ‌న ‘ఎన్నిక‌ల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కుల గ‌ణ‌న‌, ఎస్సీ రిజ‌ర్వేషన్ వ‌ర్గీక‌ర‌ణ‌పై బీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి…

14 minutes ago

స్టార్ పిల్లలను పట్టించుకోవడం లేదబ్బా

మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…

18 minutes ago

టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ

జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…

18 minutes ago

తండేల్ రేట్ల పెంపుపై హాట్ డిస్కషన్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…

1 hour ago

చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…

2 hours ago

జపాన్ దేశానికి ‘శనివారం’ – సరిపోతుందా?

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…

2 hours ago