అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించి, ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 క్రికెట్లో తన శక్తిని మరోసారి నిరూపించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.
ఓపెనర్లు కమిలిని (5), సానికా చల్కే (0)లు విఫలమవడంతో ఇన్నింగ్స్ దూకుడు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ గొంగడి త్రిష (52) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును గట్టెక్కించింది. కెప్టెన్ నికీ ప్రసాద్ (12), మిథిలా (17), ఆయుషి శుక్లా (10)లు తోడ్పాటునిచ్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా అక్తర్ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగు వికెట్లు తీసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. భారత బౌలర్ల దాటికి 18.3 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌటైంది.
జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా, మిగిలిన వారు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా మూడు వికెట్లు పడగొట్టింది. సిసోదియా, సోనమ్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు తీయగా, జోషిత ఒక వికెట్ సాధించింది. ఈ విజయంతో భారత అమ్మాయిలు తమ సమర్థతను ప్రపంచానికి చాటారు. అండర్-19 కేటగిరీలో భారత మహిళల జట్టు సాధించిన ఈ ఘనతకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గెలుపు అందించిన గొంగడి త్రిష, ఆయుషి శుక్లా అద్భుతమైన ప్రదర్శనతో ప్రశంసలందుకున్నారు.
This post was last modified on December 22, 2024 2:56 pm
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…