ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియాకు గాయాల బెడద కలిసిరావడం లేదు. నెట్ ప్రాక్టీస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. మోకాలికి తగిలిన గాయం కారణంగా రోహిత్ కొంతసేపు నొప్పితో పోరాడుతూ, చివరకు ఫిజియోల సాయం తీసుకున్నాడు. గాయం తీవ్రత అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, వైద్య బృందం నాలుగో టెస్ట్కు ముందు రోహిత్ పరిస్థితిని సమీక్షించనుంది.
ఇప్పటికే కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఆటకు దూరమవుతున్న వార్తలు తెరపైకి వచ్చాయి. తాజా పరిణామంతో టీమిండియా గాయాల బారిన పడినట్లు కనిపిస్తోంది. రెండవ టెస్ట్ నుంచి గాయంతో దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ స్థానంలో ఓపెనింగ్కు ఎవరు వస్తారన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది. రోహిత్ గాయం కారణంగా కూడా క్రీడా వ్యూహంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ బౌలింగ్ ప్రాక్టీస్తో బిజీగా గడిపారు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా తమ శైలిని పదునుపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని జట్టు వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, ఈ సిరీస్లో భారత్ ఇప్పటివరకు పోటీతత్వాన్ని ప్రదర్శించినప్పటికీ గాయాల కారణంగా ఆటగాళ్ల అందుబాటులో లేకపోవడం టీమిండియా పట్ల ఆందోళన కలిగిస్తోంది. నాలుగో టెస్ట్ విజయంతో సిరీస్ను సమం చేయాలన్న లక్ష్యంతో ఉన్న భారత్, గాయాల అంశాన్ని అధిగమించేలా ప్రత్యామ్నాయ వ్యూహాలను ప్రణాళికా దశలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. మరి ఫైనల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
This post was last modified on December 22, 2024 2:53 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…