హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బార్ అండ్ రెస్టారెంట్లో ఈ ప్రమాదం జరగడంతో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నించాయి. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో సమీప భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఐదో అంతస్తు పూర్తిగా దగ్ధం కాగా, నాలుగో అంతస్తులోనూ కొంత నష్టం జరిగినట్లు తెలిసింది. ఘటన స్థలంలో పెద్ద శబ్ధం రావడంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. అలాగే బిల్డింగ్ పైన పొగ విస్తరించడం సమీప జనాలను ఆందోళన కలిగించింది.
అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను సమర్థవంతంగా ఆర్పివేశారు. ఘటనా ప్రాంతంలోని సాఫ్ట్వేర్ కంపెనీ భవనానికి చెందిన ఉద్యోగులను సురక్షితంగా బయటకు తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడం ఊరట కలిగించింది. అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావచ్చని అంటున్నారు. అయితే, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుంది.
This post was last modified on December 21, 2024 3:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…