Trends

యూఎస్ పౌరసత్వంలో భారతీయుల రికార్డు

ప్రతిసారి అమెరికా పౌరసత్వం పొందే విదేశీయుల సంఖ్యలో భారతీయుల వాటా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికా పౌరసత్వం పొందిన వారిలో 49,700 మంది భారతీయులున్నారు. ఈ సంఖ్య యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆధారంగా వెల్లడించబడింది. అగ్రస్థానంలో మెక్సికో 13.1 శాతం వాటాతో కొనసాగగా, భారతీయులు రెండో స్థానంలో నిలిచారు.

మొత్తం పౌరసత్వం పొందిన విదేశీయులలో 6.1 శాతం భారతీయులే కావడం గమనార్హం. తర్వాత ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, వియత్నం దేశాలు ఉన్నాయి. ఈ ఐదు దేశాల పౌరులు కలిపి 33 శాతం పౌరసత్వం పొందిన వారిలో ఉండటం విశేషం. అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల్లో ఎక్కువమంది కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్ వంటి 10 ముఖ్య రాష్ట్రాలలో స్థిరపడ్డారని సమాచారం.

భారతీయుల సంఖ్య పెరిగినప్పటికీ, వీరిలో ఎక్కువమంది కుటుంబ ప్రాయోజిత లేదా ఉపాధి ఆధారిత కేటగిరీల ద్వారా పౌరసత్వం పొందినట్లు పేర్కొనబడింది. అంతే కాకుండా, శరణార్థులు, డైవర్సిటీ ఇమ్మిగ్రేషన్ వీసా ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా, 2022లో 65,960 మంది భారతీయులు పౌరసత్వం పొందగా, 2024 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగింది.

అగ్రరాజ్యంలో భారతీయుల జనాభా 50 లక్షల మార్క్ దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో భారతీయుల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతుండటంతో భారతీయ-అమెరికన్ సమాజం మరింత బలపడుతోంది. ఈ గణాంకాలు భవిష్యత్తులో భారతీయుల అంతర్జాతీయ స్థాయి ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి. అలాగే అక్కడ రాజకీయ రంగంలో కూడా భారతీయులు అడుగులు వేస్తుండడం విశేషం.

This post was last modified on December 21, 2024 1:47 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరుతో వెంకీ సినిమా ఎందుకు అవ్వలేదు?

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికీ ఓ కల. ఒక తరాన్ని ఊపు…

5 hours ago

బాబు పథకం దేశానికే ఆదర్శం అయ్యింది!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతే. ఈ విషయాన్ని వైరి వర్గాలు ఎంత విమర్శించినా.. ఆ…

6 hours ago

విక్రమ్ సినిమాకు ఇలాంటి పరిస్థితా

ఒకప్పుడు అపరిచితుడు టైంలో విక్రమ్ సినిమాల ఓపెనింగ్స్ కి ట్రేడ్ మతులు పోయేవి. తర్వాత వచ్చే వాటికి డిమాండ్ పెరిగి…

8 hours ago

‘జ‌గ‌న్ 2.0’.. వైసీపీ లోక‌ల్ టాక్ ఇదే.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. 2.0పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ 2.0 చాలా భి…

8 hours ago

జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతున్న జైలు ప‌క్షులు!

వైసీపీ త‌ర‌ఫున గ‌త ప్ర‌భుత్వంలో ఉండి.. పార్టీని, అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేస‌మ‌యంలో అప్ప‌టి…

9 hours ago

అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం… ఐసీసీ గ్రీన్ సిగ్నల్?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ…

10 hours ago