భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు, పులకేశినగర్ పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉతప్ప నిర్వహిస్తున్న సెంచరీస్ లైఫ్స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పీఎఫ్ చెల్లింపులలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలున్నాయి.
కంపెనీ ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినా, ఆ మొత్తాన్ని సంబంధిత ఖాతాల్లో జమ చేయకపోవడంతో ₹23.36 లక్షల మేర మోసం జరిగినట్లు గుర్తించారు. ఈ ఆరోపణలపై డిసెంబర్ 4న పోలీసులకు పీఎఫ్ కమిషనర్ లేఖ రాశారు. నోటీసులు అందించేందుకు పోలీసులు ఉతప్ప నివాసానికి వెళ్లగా, అతను అక్కడ లేడని తెలిసింది. దీనితో పీఎఫ్ కమిషనర్ అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఈ కేసులో ఉతప్ప స్పందన ఇంకా వెలువడలేదు. రాబిన్ ఉతప్ప 2006 నుంచి 2015 వరకు భారత జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగారు. 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్లు ఆడిన ఉతప్ప, తన కెరీర్లో చాలా కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ, ఇప్పుడు ఈ మోసం ఆరోపణలతో ఆయన ఇమేజ్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…