Trends

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహిస్తారని ఐసీసీ పేర్కొంది.

భద్రతా కారణాల వల్ల పాక్‌లో భారత జట్టు ఆడడం ఇబ్బందిగా మారడంతో, టోర్నీ నిర్వహణలో ఈ హైబ్రిడ్ విధానాన్ని ఆమోదించారు. ఇక ఇండియా పాక్ తో ఆడాలి అంటే ప్రతీ సారి దుబాయ్ లేదా ఇతర దేశాల్లో వేదిక సిద్ధం చేయాలి. పాకిస్తాన్ కూడా భారత్ లో ఆడబోమని చెప్పడంతో ఐసిసి వారికి కూడా అలంటి ఆఫరే ఇచ్చింది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు, 2026 టీ20 ప్రపంచ కప్ (భారత్‌, శ్రీలంక) కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగనుంది. పాక్‌కు 2028 టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు దక్కగా, ఈ టోర్నీకి కూడా ఇదే విధానం వర్తించనుంది. భారత్‌, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు తమ తమ అభిప్రాయాలను ఐసీసీకి తెలియజేయగా, భారతదేశం భద్రతా సమస్యల దృష్ట్యా పాక్‌లో మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించింది.

అయితే, పాకిస్థాన్ కూడా తమ దేశంలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించాలనే షరతును పెట్టింది. దీనితో ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలని నిర్ణయించింది. ఈ పరిణామంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అగ్రదేశాలు సన్నద్ధం అవుతుండగా, భారత్‌, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులలో ప్రత్యేక ఉత్సాహం రేకెత్తించనున్నాయి. టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది.

This post was last modified on December 19, 2024 7:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

45 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago