Trends

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహిస్తారని ఐసీసీ పేర్కొంది.

భద్రతా కారణాల వల్ల పాక్‌లో భారత జట్టు ఆడడం ఇబ్బందిగా మారడంతో, టోర్నీ నిర్వహణలో ఈ హైబ్రిడ్ విధానాన్ని ఆమోదించారు. ఇక ఇండియా పాక్ తో ఆడాలి అంటే ప్రతీ సారి దుబాయ్ లేదా ఇతర దేశాల్లో వేదిక సిద్ధం చేయాలి. పాకిస్తాన్ కూడా భారత్ లో ఆడబోమని చెప్పడంతో ఐసిసి వారికి కూడా అలంటి ఆఫరే ఇచ్చింది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు, 2026 టీ20 ప్రపంచ కప్ (భారత్‌, శ్రీలంక) కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగనుంది. పాక్‌కు 2028 టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు దక్కగా, ఈ టోర్నీకి కూడా ఇదే విధానం వర్తించనుంది. భారత్‌, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు తమ తమ అభిప్రాయాలను ఐసీసీకి తెలియజేయగా, భారతదేశం భద్రతా సమస్యల దృష్ట్యా పాక్‌లో మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించింది.

అయితే, పాకిస్థాన్ కూడా తమ దేశంలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించాలనే షరతును పెట్టింది. దీనితో ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలని నిర్ణయించింది. ఈ పరిణామంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అగ్రదేశాలు సన్నద్ధం అవుతుండగా, భారత్‌, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులలో ప్రత్యేక ఉత్సాహం రేకెత్తించనున్నాయి. టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది.

This post was last modified on December 19, 2024 7:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago