2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహిస్తారని ఐసీసీ పేర్కొంది.
భద్రతా కారణాల వల్ల పాక్లో భారత జట్టు ఆడడం ఇబ్బందిగా మారడంతో, టోర్నీ నిర్వహణలో ఈ హైబ్రిడ్ విధానాన్ని ఆమోదించారు. ఇక ఇండియా పాక్ తో ఆడాలి అంటే ప్రతీ సారి దుబాయ్ లేదా ఇతర దేశాల్లో వేదిక సిద్ధం చేయాలి. పాకిస్తాన్ కూడా భారత్ లో ఆడబోమని చెప్పడంతో ఐసిసి వారికి కూడా అలంటి ఆఫరే ఇచ్చింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు, 2026 టీ20 ప్రపంచ కప్ (భారత్, శ్రీలంక) కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగనుంది. పాక్కు 2028 టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు దక్కగా, ఈ టోర్నీకి కూడా ఇదే విధానం వర్తించనుంది. భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు తమ తమ అభిప్రాయాలను ఐసీసీకి తెలియజేయగా, భారతదేశం భద్రతా సమస్యల దృష్ట్యా పాక్లో మ్యాచ్లు ఆడటానికి నిరాకరించింది.
అయితే, పాకిస్థాన్ కూడా తమ దేశంలో భారత్ మ్యాచ్లు నిర్వహించాలనే షరతును పెట్టింది. దీనితో ఐసీసీ హైబ్రిడ్ మోడల్ను అనుసరించాలని నిర్ణయించింది. ఈ పరిణామంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అగ్రదేశాలు సన్నద్ధం అవుతుండగా, భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్లు క్రికెట్ అభిమానులలో ప్రత్యేక ఉత్సాహం రేకెత్తించనున్నాయి. టోర్నీ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది.
This post was last modified on December 19, 2024 7:57 pm
ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక…
ఒక హీరో వరుసగా డిజాస్టర్లు ఇచ్చినపుడు.. తన చివరి హిట్ ఎప్పుడో తన అభిమానులు కూడా మరిచిపోయినపుడు.. అతను కొత్తగా…
ఎల్లుండి విడుదల కాబోతున్న కొరియన్ కనకరాజుకి రేపు రాత్రి ప్రీమియర్లు వేయడం దాదాపు ఫిక్స్. ఇంకా టికెట్ల అమ్మకాలు మొదలుకాలేదు…
జూన్ నెలలో పెద్ది విడుదల ముందు వరకు దర్శకుడు బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ ఒకటే కాదు ఇండస్ట్రీ జనాలు…