ఘోర విషాద ఉదంతం వెలుగు చూసింది. అమెరికాలో పదకొండు మంది భారతీయులు అనుమానాస్పద రీతిలో మరణించారు. జార్జియాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. స్కై రిసార్ట్ గా ఫేమస్ అయిన గూడౌరిలోని రెస్టారెంట్ లో పని చేసే పన్నెండు మంది సిబ్బంది అనుమానాస్పద రీతిలో మరణించారు. వీరిలో పదకొండు మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ షాకింగ్ ఉదంతాన్ని భారతీయ అధికారులు ధ్రువీకరించారు.
ఘటన జరిగిన హోటల్లో వారంతా సిబ్బందిగా ఉన్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనను అత్యంత దురదృష్ట ఘటనగా భారత రాయబార కార్యాలయం రియాక్టు అయ్యింది. మృతులకుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన రాయబార కార్యాలయం వారి మృతదేహాల్ని సాధ్యమైనంత త్వరగా వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.
అయితే.. ఈ దారుణ ఉదంతం ఈ నెల పద్నాలుగున చోటు చేసుకుందని.. మరణించిన వారి మీద దాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని.. శరీరం మీదా గాయాలు లేవని అమెరికా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితులంతా కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే చనిపోయారని.. రెస్టారెంట్ లోని సెకండ్ ఫ్లోర్ లో డెడ్ బాడీలు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ మరణాల్ని అనుమానాస్పద మరణాలుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బాధితుల బెడ్రూం గదులకు దగ్గర్లోనే ఒక పవర్ జనరేటర్ ను గుర్తించారు. విద్యుత్ సరఫరా ఆగటంతో జనరేటర్ ను అక్కడ ఏర్పాటు చేశారని.. దాని పొగ కారణంగానే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. శాస్త్రీయంగా తేల్చేందుకు ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేశారు. ఆ రిపోర్టు వస్తే ఈ మరణాలకు కచ్ఛితమైన కారణాలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నారు. ఈ తరహా మరణాలు ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదన్న అభిప్రాయాన్ని అక్కడి మీడియా సంస్థలు పేర్కొనటం గమనార్హం.
This post was last modified on December 17, 2024 2:00 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…