Trends

అమెరికాలో 11 మంది భారతీయులు మృతి

ఘోర విషాద ఉదంతం వెలుగు చూసింది. అమెరికాలో పదకొండు మంది భారతీయులు అనుమానాస్పద రీతిలో మరణించారు. జార్జియాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. స్కై రిసార్ట్ గా ఫేమస్ అయిన గూడౌరిలోని రెస్టారెంట్ లో పని చేసే పన్నెండు మంది సిబ్బంది అనుమానాస్పద రీతిలో మరణించారు. వీరిలో పదకొండు మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ షాకింగ్ ఉదంతాన్ని భారతీయ అధికారులు ధ్రువీకరించారు.

ఘటన జరిగిన హోటల్లో వారంతా సిబ్బందిగా ఉన్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనను అత్యంత దురదృష్ట ఘటనగా భారత రాయబార కార్యాలయం రియాక్టు అయ్యింది. మృతులకుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన రాయబార కార్యాలయం వారి మృతదేహాల్ని సాధ్యమైనంత త్వరగా వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.

అయితే.. ఈ దారుణ ఉదంతం ఈ నెల పద్నాలుగున చోటు చేసుకుందని.. మరణించిన వారి మీద దాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని.. శరీరం మీదా గాయాలు లేవని అమెరికా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితులంతా కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే చనిపోయారని.. రెస్టారెంట్ లోని సెకండ్ ఫ్లోర్ లో డెడ్ బాడీలు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

ఈ మరణాల్ని అనుమానాస్పద మరణాలుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బాధితుల బెడ్రూం గదులకు దగ్గర్లోనే ఒక పవర్ జనరేటర్ ను గుర్తించారు. విద్యుత్ సరఫరా ఆగటంతో జనరేటర్ ను అక్కడ ఏర్పాటు చేశారని.. దాని పొగ కారణంగానే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. శాస్త్రీయంగా తేల్చేందుకు ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేశారు. ఆ రిపోర్టు వస్తే ఈ మరణాలకు కచ్ఛితమైన కారణాలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నారు. ఈ తరహా మరణాలు ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదన్న అభిప్రాయాన్ని అక్కడి మీడియా సంస్థలు పేర్కొనటం గమనార్హం.

This post was last modified on December 17, 2024 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

33 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

54 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

2 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

3 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago