ఘోర విషాద ఉదంతం వెలుగు చూసింది. అమెరికాలో పదకొండు మంది భారతీయులు అనుమానాస్పద రీతిలో మరణించారు. జార్జియాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. స్కై రిసార్ట్ గా ఫేమస్ అయిన గూడౌరిలోని రెస్టారెంట్ లో పని చేసే పన్నెండు మంది సిబ్బంది అనుమానాస్పద రీతిలో మరణించారు. వీరిలో పదకొండు మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ షాకింగ్ ఉదంతాన్ని భారతీయ అధికారులు ధ్రువీకరించారు.
ఘటన జరిగిన హోటల్లో వారంతా సిబ్బందిగా ఉన్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనను అత్యంత దురదృష్ట ఘటనగా భారత రాయబార కార్యాలయం రియాక్టు అయ్యింది. మృతులకుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపిన రాయబార కార్యాలయం వారి మృతదేహాల్ని సాధ్యమైనంత త్వరగా వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.
అయితే.. ఈ దారుణ ఉదంతం ఈ నెల పద్నాలుగున చోటు చేసుకుందని.. మరణించిన వారి మీద దాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని.. శరీరం మీదా గాయాలు లేవని అమెరికా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాధితులంతా కార్బన్ మోనాక్సైడ్ పీల్చటం వల్లే చనిపోయారని.. రెస్టారెంట్ లోని సెకండ్ ఫ్లోర్ లో డెడ్ బాడీలు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ మరణాల్ని అనుమానాస్పద మరణాలుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బాధితుల బెడ్రూం గదులకు దగ్గర్లోనే ఒక పవర్ జనరేటర్ ను గుర్తించారు. విద్యుత్ సరఫరా ఆగటంతో జనరేటర్ ను అక్కడ ఏర్పాటు చేశారని.. దాని పొగ కారణంగానే మరణించి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. శాస్త్రీయంగా తేల్చేందుకు ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేశారు. ఆ రిపోర్టు వస్తే ఈ మరణాలకు కచ్ఛితమైన కారణాలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నారు. ఈ తరహా మరణాలు ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదన్న అభిప్రాయాన్ని అక్కడి మీడియా సంస్థలు పేర్కొనటం గమనార్హం.
This post was last modified on December 17, 2024 2:00 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…