ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో కొత్త ఈమెయిల్ సేవను ప్రారంభించేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్స్ మెయిల్’’ సృష్టిస్తే ఎలా ఉంటుంది?’’ అని ఓ యూజర్ చేసిన సూచనకు మస్క్ స్పందిస్తూ, ‘‘ఇది జీమెయిల్, ఇతర ఈమెయిల్ సేవలకు కఠినమైన పోటీని కల్పిస్తుంది’’ అని చెప్పారు.
ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్లో యాపిల్ మెయిల్ 53.67% తో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, గూగుల్ జీమెయిల్ 30.70% తో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని అవుట్లుక్, యాహూ మెయిల్ వంటి ఇతర సర్వీసులు దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ మెయిల్ ప్రవేశం మరింత పోటీతత్వాన్ని తీసుకురానుందని నిపుణులు భావిస్తున్నారు.
మస్క్ ఇప్పటికే ఎక్స్ (మాజీ ట్విట్టర్) ద్వారా టెక్ ప్రపంచంలో ప్రాధాన్యతను స్థిరపర్చారు. ఇప్పుడు ‘‘ఎక్స్ మెయిల్’’ ప్రవేశపెట్టడం ద్వారా మరిన్ని విభాగాల్లో విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. వినూత్నమైన సాంకేతికతలతో ఇది ఈమెయిల్ సేవల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించే అవకాశం ఉందని ఆభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, ‘‘ఎక్స్ ఫోన్’’ వంటి సరికొత్త ప్రాజెక్టులపై యూజర్ల నుంచి ప్రేరణ లభిస్తుండటం గమనార్హం. ఎక్స్ మెయిల్, ఎక్స్ ఫోన్ లాంటి ప్రణాళికలతో టెక్ దిగ్గజాలకు మస్క్ భారీ పోటీ ఇవ్వనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రణాళికలు ఎలా అమలు జరుగుతాయో టెక్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
This post was last modified on December 16, 2024 6:56 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…