ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో కొత్త ఈమెయిల్ సేవను ప్రారంభించేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్స్ మెయిల్’’ సృష్టిస్తే ఎలా ఉంటుంది?’’ అని ఓ యూజర్ చేసిన సూచనకు మస్క్ స్పందిస్తూ, ‘‘ఇది జీమెయిల్, ఇతర ఈమెయిల్ సేవలకు కఠినమైన పోటీని కల్పిస్తుంది’’ అని చెప్పారు.
ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్లో యాపిల్ మెయిల్ 53.67% తో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, గూగుల్ జీమెయిల్ 30.70% తో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని అవుట్లుక్, యాహూ మెయిల్ వంటి ఇతర సర్వీసులు దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ మెయిల్ ప్రవేశం మరింత పోటీతత్వాన్ని తీసుకురానుందని నిపుణులు భావిస్తున్నారు.
మస్క్ ఇప్పటికే ఎక్స్ (మాజీ ట్విట్టర్) ద్వారా టెక్ ప్రపంచంలో ప్రాధాన్యతను స్థిరపర్చారు. ఇప్పుడు ‘‘ఎక్స్ మెయిల్’’ ప్రవేశపెట్టడం ద్వారా మరిన్ని విభాగాల్లో విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. వినూత్నమైన సాంకేతికతలతో ఇది ఈమెయిల్ సేవల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించే అవకాశం ఉందని ఆభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, ‘‘ఎక్స్ ఫోన్’’ వంటి సరికొత్త ప్రాజెక్టులపై యూజర్ల నుంచి ప్రేరణ లభిస్తుండటం గమనార్హం. ఎక్స్ మెయిల్, ఎక్స్ ఫోన్ లాంటి ప్రణాళికలతో టెక్ దిగ్గజాలకు మస్క్ భారీ పోటీ ఇవ్వనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రణాళికలు ఎలా అమలు జరుగుతాయో టెక్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
This post was last modified on December 16, 2024 6:56 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…