Trends

మస్క్ నుండి కొత్త బాంబ్ !

ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో కొత్త ఈమెయిల్ సేవను ప్రారంభించేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్స్ మెయిల్’’ సృష్టిస్తే ఎలా ఉంటుంది?’’ అని ఓ యూజర్ చేసిన సూచనకు మస్క్ స్పందిస్తూ, ‘‘ఇది జీమెయిల్, ఇతర ఈమెయిల్ సేవలకు కఠినమైన పోటీని కల్పిస్తుంది’’ అని చెప్పారు.

ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్‌లో యాపిల్ మెయిల్ 53.67% తో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, గూగుల్ జీమెయిల్ 30.70% తో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని అవుట్‌లుక్, యాహూ మెయిల్ వంటి ఇతర సర్వీసులు దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ మెయిల్ ప్రవేశం మరింత పోటీతత్వాన్ని తీసుకురానుందని నిపుణులు భావిస్తున్నారు.

మస్క్ ఇప్పటికే ఎక్స్ (మాజీ ట్విట్టర్) ద్వారా టెక్ ప్రపంచంలో ప్రాధాన్యతను స్థిరపర్చారు. ఇప్పుడు ‘‘ఎక్స్ మెయిల్’’ ప్రవేశపెట్టడం ద్వారా మరిన్ని విభాగాల్లో విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. వినూత్నమైన సాంకేతికతలతో ఇది ఈమెయిల్ సేవల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించే అవకాశం ఉందని ఆభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు, ‘‘ఎక్స్ ఫోన్’’ వంటి సరికొత్త ప్రాజెక్టులపై యూజర్ల నుంచి ప్రేరణ లభిస్తుండటం గమనార్హం. ఎక్స్ మెయిల్, ఎక్స్ ఫోన్ లాంటి ప్రణాళికలతో టెక్ దిగ్గజాలకు మస్క్ భారీ పోటీ ఇవ్వనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రణాళికలు ఎలా అమలు జరుగుతాయో టెక్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

This post was last modified on December 16, 2024 6:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago