దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విడాకుల వేళ.. భార్యకు భర్త చెల్లించాల్సిన శాశ్విత మనోవర్తిని డిసైడ్ చేసేందుకు కీలక తీర్పును వెలువరించటమే కాదు.. మనోవర్తిని డిసైడ్ చేసేందుకు 8 మార్గదర్శకాల్ని జారీ చేసింది. వీటిని అనుసరించి మనోవర్తి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయాలని పేర్కొంది. భర్త చెల్లించాల్సిన మనోవర్తిని అతడిని శిక్షించే విధంగా ఉండకూదని పేర్కొంది.
అదే సమయంలో అతడి జీవిత భాగస్వామిగా వ్యవహరించిన మహిళ విడాకుల అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి 8 సూత్రాలను డిసైడ్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాత్.. జస్టిస్ ప్రసన్న.. జస్టిస్ బి వరాలే ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
దేశంలోని ఇతర విడాకుల కేసులకు సంబంధించి మార్గర్శకంగా ఉండే అంశాలకు కారణమైన కేసు విషయంలోకి వెళితే.. ఒక జంట ఆరేళ్లు కలిసి ఉంది. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లు విడిగా జీవించారు. చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది మనోవర్తి నిర్ధారించే సమయంలో గమనించాల్సిన అంశాలకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది. అంతేకాదు మనోవర్తి నిర్దారణకు కచ్ఛితమైన సూత్రాలు ఏమీ ఉండవని చెప్పింది. అంతేకాదు.. తాము జారీ చేసిన మార్గదర్శకాల్ని అన్ని కోర్టులు పాటించాలని తెలిపింది.
సుప్రీం జారీ చేసిన 8 మార్గదర్శకాలు ఇవే..
This post was last modified on December 13, 2024 9:42 am
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…