దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విడాకుల వేళ.. భార్యకు భర్త చెల్లించాల్సిన శాశ్విత మనోవర్తిని డిసైడ్ చేసేందుకు కీలక తీర్పును వెలువరించటమే కాదు.. మనోవర్తిని డిసైడ్ చేసేందుకు 8 మార్గదర్శకాల్ని జారీ చేసింది. వీటిని అనుసరించి మనోవర్తి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయాలని పేర్కొంది. భర్త చెల్లించాల్సిన మనోవర్తిని అతడిని శిక్షించే విధంగా ఉండకూదని పేర్కొంది.
అదే సమయంలో అతడి జీవిత భాగస్వామిగా వ్యవహరించిన మహిళ విడాకుల అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చెల్లింపులు జరపాల్సి ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి 8 సూత్రాలను డిసైడ్ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాత్.. జస్టిస్ ప్రసన్న.. జస్టిస్ బి వరాలే ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
దేశంలోని ఇతర విడాకుల కేసులకు సంబంధించి మార్గర్శకంగా ఉండే అంశాలకు కారణమైన కేసు విషయంలోకి వెళితే.. ఒక జంట ఆరేళ్లు కలిసి ఉంది. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లు విడిగా జీవించారు. చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది మనోవర్తి నిర్ధారించే సమయంలో గమనించాల్సిన అంశాలకు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసింది. అంతేకాదు మనోవర్తి నిర్దారణకు కచ్ఛితమైన సూత్రాలు ఏమీ ఉండవని చెప్పింది. అంతేకాదు.. తాము జారీ చేసిన మార్గదర్శకాల్ని అన్ని కోర్టులు పాటించాలని తెలిపింది.
సుప్రీం జారీ చేసిన 8 మార్గదర్శకాలు ఇవే..
This post was last modified on December 13, 2024 9:42 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…