పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న సేవలను అందుబాటులోకి తేనుంది. కార్మికశాఖ తాజా ప్రకటన ప్రకారం, భవిష్యనిధి చందాదారులు త్వరలోనే ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ సొమ్మును సులభంగా విత్డ్రా చేసుకునే వెసులుబాటు పొందనున్నారు. జనవరి 2025 నాటికి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేలా ఐటీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడించారు.
ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్ల కోసం దరఖాస్తు ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుంది. అత్యవసర సమయంలో ఇది చాలామందికి ఇబ్బంది కలిగిస్తోంది. 15 రోజుల నుంచి 30 రోజుల మధ్య సమయం పడుతోంది. అయితే కొత్త విధానం ద్వారా చందాదారులు తక్షణమే నగదును పొందగలుగుతారు. ఏటీఎంల ద్వారా నేరుగా భవిష్యనిధి సొమ్ము ఉపసంహరించుకోవడం ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ సేవల ప్రారంభం కోసం కార్మికశాఖ ఐటీ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తోంది.
ఈ కొత్త పథకం కార్మికుల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, పీఎఫ్ సేవల సామర్థ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఈ వ్యవస్థలో పురోగతిని గమనించవచ్చని కార్మికశాఖ స్పష్టం చేసింది. ఈ సరికొత్త విధానం పీఎఫ్ చందాదారులకే కాకుండా, ఇతర ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి మార్పును తీసుకురానుంది. ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on December 12, 2024 9:50 am
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…