Trends

ఉద్యోగులకు శుభవార్త.. ATM ద్వారా పీఎఫ్‌

పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న సేవలను అందుబాటులోకి తేనుంది. కార్మికశాఖ తాజా ప్రకటన ప్రకారం, భవిష్యనిధి చందాదారులు త్వరలోనే ఏటీఎంల ద్వారా తమ పీఎఫ్ సొమ్మును సులభంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు పొందనున్నారు. జనవరి 2025 నాటికి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేలా ఐటీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా వెల్లడించారు.

ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుంది. అత్యవసర సమయంలో ఇది చాలామందికి ఇబ్బంది కలిగిస్తోంది. 15 రోజుల నుంచి 30 రోజుల మధ్య సమయం పడుతోంది. అయితే కొత్త విధానం ద్వారా చందాదారులు తక్షణమే నగదును పొందగలుగుతారు. ఏటీఎంల ద్వారా నేరుగా భవిష్యనిధి సొమ్ము ఉపసంహరించుకోవడం ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ సేవల ప్రారంభం కోసం కార్మికశాఖ ఐటీ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తోంది.

ఈ కొత్త పథకం కార్మికుల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, పీఎఫ్ సేవల సామర్థ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఈ వ్యవస్థలో పురోగతిని గమనించవచ్చని కార్మికశాఖ స్పష్టం చేసింది. ఈ సరికొత్త విధానం పీఎఫ్ చందాదారులకే కాకుండా, ఇతర ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి మార్పును తీసుకురానుంది. ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 12, 2024 9:50 am

Share
Show comments
Published by
Satya
Tags: ATMEPFO

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago