Trends

డబ్బు కోసమే పంత్ ఢిల్లీ వదిలేశాడా?

ఐపీఎల్ 2025 వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు (రూ. 27 కోట్లకు) పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే, 2016-24 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పంత్ ను ఆ జట్టు వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పంత్ కావాలనే ఢిల్లీ క్యాపిటల్స్ ను వదులుకున్నాడని..పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయలేదని ఆ జట్టు కోచ్ హేమంగ్ బదానీ తాజాగా బాంబు పేల్చాడు.

పంత్ డబ్బుల కోసమే ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వెళ్లాడని చెప్పాడు. తన మార్కెట్ రేట్ ఎంత ఉందో తెలుసుకునేందుకు పంత్ ఇలా ఢిల్లీని వదిలేశాడని బదానీ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను రిటైన్ చేసుకోవాలని రిటెన్షన్‌కు ఒప్పుకోలేదని, ఎంత కన్విన్స్ చేసినా మాట వినకుండా వేలంలోకి వెళ్లిపోయాడని సంచలన ఆరోపణలు చేశాడు. రిటెన్షన్ హయ్యెస్ట్ క్యాప్‌డ్ సాలరీ రూ. 18 కోట్ల కంటే ఎక్కువ పలుకుతానని పంత్ భావించాడని, అతను అనుకున్నట్లుగానే భారీ ధర పలికాడని, మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కిందని చెప్పాడు.

ఇక, పంత్ వెళ్లిపోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ కూడా స్పందించింది. పంత్ కెప్టెన్సీపై ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ కు పంత్ హర్ట్ అయ్యాడని, ఎమోషనల్‌గా ఈ నిర్ణయం తీసుకున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ అన్నారు. తమ ఫీడ్ బ్యాక్ ను పంత్ అపార్థం చేసుకున్నాడని, పంత్ కోసం ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా కూడా ప్రయత్నించామని అన్నారు. అయితే, రూ. 27 కోట్ల ధర ఎక్కువవడంతో వదిలేశామని చెప్పారు.

Kumar

Recent Posts

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

39 minutes ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

2 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

2 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

2 hours ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

3 hours ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

5 hours ago