Trends

డబ్బు కోసమే పంత్ ఢిల్లీ వదిలేశాడా?

ఐపీఎల్ 2025 వేలంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు (రూ. 27 కోట్లకు) పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే, 2016-24 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పంత్ ను ఆ జట్టు వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పంత్ కావాలనే ఢిల్లీ క్యాపిటల్స్ ను వదులుకున్నాడని..పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయలేదని ఆ జట్టు కోచ్ హేమంగ్ బదానీ తాజాగా బాంబు పేల్చాడు.

పంత్ డబ్బుల కోసమే ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వెళ్లాడని చెప్పాడు. తన మార్కెట్ రేట్ ఎంత ఉందో తెలుసుకునేందుకు పంత్ ఇలా ఢిల్లీని వదిలేశాడని బదానీ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ను రిటైన్ చేసుకోవాలని రిటెన్షన్‌కు ఒప్పుకోలేదని, ఎంత కన్విన్స్ చేసినా మాట వినకుండా వేలంలోకి వెళ్లిపోయాడని సంచలన ఆరోపణలు చేశాడు. రిటెన్షన్ హయ్యెస్ట్ క్యాప్‌డ్ సాలరీ రూ. 18 కోట్ల కంటే ఎక్కువ పలుకుతానని పంత్ భావించాడని, అతను అనుకున్నట్లుగానే భారీ ధర పలికాడని, మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కిందని చెప్పాడు.

ఇక, పంత్ వెళ్లిపోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ కూడా స్పందించింది. పంత్ కెప్టెన్సీపై ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ కు పంత్ హర్ట్ అయ్యాడని, ఎమోషనల్‌గా ఈ నిర్ణయం తీసుకున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ అన్నారు. తమ ఫీడ్ బ్యాక్ ను పంత్ అపార్థం చేసుకున్నాడని, పంత్ కోసం ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా కూడా ప్రయత్నించామని అన్నారు. అయితే, రూ. 27 కోట్ల ధర ఎక్కువవడంతో వదిలేశామని చెప్పారు.

This post was last modified on December 8, 2024 6:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

28 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago