నితీష్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్న తెలుగు క్రికెటర్ పేరిది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్.. తొలి మ్యాచ్లోనే రెండు ఇన్నింగ్స్ల్లోనూ విలువైన పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఎనిమిది నెలల ముందు అనామకుడైన ఈ క్రికెటర్ ఇప్పుడు ప్రతిష్టాత్మక సిరీస్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని.. జట్టు విజయంలో కీలకంగా మారతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.
ఈ ఏడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన అతను.. ఆల్ రౌండ్ మెరుపులతో అదరగొట్టాడు. తర్వాత భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో ఆడి అక్కడా సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న భారత టెస్టు జట్టులో అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని కూడా అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.తర్వాతి ఐపీఎల్ సీజన్కు నితీష్ను సన్రైజర్స్ అట్టిపెట్టుకుంది. అతడి ధర.. రూ.6 కోట్లు. ఐతే భారత జట్టు తరఫున కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీష్ వేలంలోకి వెళ్లి ఉంటే మినిమం పది కోట్లు పలికేవాడని.. తన రేటు రూ.15 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కానీ నితీష్ మాత్రం తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన సన్రైజర్స్తోనే కొనసాగాలనుకున్నాడు. తనకు వాళ్లు ఫిక్స్ చేసిన రేటు పట్ల సంతృప్తి చెందాడు. వేలంలోకి ఎందుకు వెళ్లలేదని తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో నితీష్ను అడిగితే.. తనకు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాంఛైజీకి ఆడడమే ఇష్టమని.. ఇక్కడి ఫ్యాన్స్ తనను ఎంతగానో ఆదరించారని.. వాళ్ల మధ్య మన లోకల్ ఫ్రాంఛైజీకి ఆడడంలో ఉన్న ఆనందం వేరని.. వేలంలోకి వెళ్తే వేరే జట్టుకు వెళ్లిపోతానేమో అనిపించి సన్రైజర్స్తో కొనసాగడానికే తాను మొగ్గు చూపానని నితీష్ తెలిపాడు. మొత్తానికి లోకల్ ఫీలింగ్తో నితీష్ కోట్లు వదులకోవడం గొప్ప విషయమని తెలుగు నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on December 1, 2024 4:18 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…