Trends

పాకిస్థాన్‌లో ఆడే ప్రసక్తే లేదు.. కేంద్రం హెచ్చరిక

పాకిస్థాన్ వేదికగా 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. భారత ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేస్తూ, పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు సరిగాలేవని, టీమిండియా అక్కడ ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.

బీసీసీఐ ఇప్పటికే పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడటం సాధ్యమని చెప్పలేదని గుర్తు చేశారు. ఇక భారత్ జట్టు పాకిస్థాన్ వెళ్లడం సాధ్యంకాదన్న ఈ ప్రకటన ఐసీసీ కీలక సమావేశం ముందు వచ్చినట్లు తెలిపారు జైస్వాల్ వివరించారు. ఈ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, హైబ్రిడ్ మోడల్ ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ప్రస్తావనకు వస్తోంది.

ఈ మోడల్ ప్రకారం, కొన్ని మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో, మరికొన్ని ఇతర దేశాల్లో నిర్వహిస్తారు. గతంలో ఆసియాకప్ కూడా హైబ్రిడ్ మోడల్‌లో జరిగింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ వేదికను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. భారత్ చెప్పినట్లు మేము నడుచుకోవాలా అన్నట్లే వ్యవహరిస్తోంది.

మరోవైపు భారత్ పాల్గొనకపోతే టోర్నమెంట్ ఆకర్షణ తగ్గుతుందని ఐసీసీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. పీసీబీ మాత్రం ఇది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని, హైబ్రిడ్ మోడల్‌కు సహకరించబోమని స్పష్టంచేసింది. ఈ పరిస్థితుల్లో, వాయిదా పడనున్న ఐసీసీ సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఫైనల్ గా ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

This post was last modified on November 29, 2024 8:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ట్రంప్ ల‌క్ష్యంగా కాల్పులు… తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం!

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆ దేశ ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌లే ల‌క్ష్యంగా ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. భార‌త…

45 minutes ago

పవన్ అంటే డార్లింగ్ దర్శకుడికి ఎందుకంత ప్రేమ?

తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…

4 hours ago

ధనుష్ ‘కర’లో స్టువర్టుపురం ఛాయలు

ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…

7 hours ago

మాయమైన మెగా కోడలు… వస్తోంది

వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…

9 hours ago

బిజినెస్ రిఫార్మ‌ర్ చంద్ర‌బాబు..

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క `బిజినెస్ రిఫార్మ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌` అవార్డు ల‌భించింది. ముంబైలో జ‌రిగిన‌ కార్య‌క్ర‌మంలో శ‌నివారం…

9 hours ago

టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

నాయ‌కులు ప‌ద్ధ‌తిగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. మ‌ర్యాద‌గా మెల‌గాల‌ని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఎమ్మెల్యేలు, వారి అనుచ‌రుల‌కు కూడా…

11 hours ago