Trends

పాకిస్థాన్‌లో ఆడే ప్రసక్తే లేదు.. కేంద్రం హెచ్చరిక

పాకిస్థాన్ వేదికగా 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. భారత ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేస్తూ, పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు సరిగాలేవని, టీమిండియా అక్కడ ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.

బీసీసీఐ ఇప్పటికే పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడటం సాధ్యమని చెప్పలేదని గుర్తు చేశారు. ఇక భారత్ జట్టు పాకిస్థాన్ వెళ్లడం సాధ్యంకాదన్న ఈ ప్రకటన ఐసీసీ కీలక సమావేశం ముందు వచ్చినట్లు తెలిపారు జైస్వాల్ వివరించారు. ఈ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, హైబ్రిడ్ మోడల్ ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ప్రస్తావనకు వస్తోంది.

ఈ మోడల్ ప్రకారం, కొన్ని మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో, మరికొన్ని ఇతర దేశాల్లో నిర్వహిస్తారు. గతంలో ఆసియాకప్ కూడా హైబ్రిడ్ మోడల్‌లో జరిగింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ వేదికను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. భారత్ చెప్పినట్లు మేము నడుచుకోవాలా అన్నట్లే వ్యవహరిస్తోంది.

మరోవైపు భారత్ పాల్గొనకపోతే టోర్నమెంట్ ఆకర్షణ తగ్గుతుందని ఐసీసీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. పీసీబీ మాత్రం ఇది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని, హైబ్రిడ్ మోడల్‌కు సహకరించబోమని స్పష్టంచేసింది. ఈ పరిస్థితుల్లో, వాయిదా పడనున్న ఐసీసీ సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఫైనల్ గా ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

This post was last modified on November 29, 2024 8:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గౌతమ్ & చరణ్ – ఎవరు అన్ లక్కీ

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ భారీ ప్యాన్…

13 minutes ago

మూడో భారతీయుడుకి తలుపులు తీశారు

కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన సినిమాల్లో భారతీయుడు 2 ఒకటి. ఎప్పుడో పాతికేళ్ల…

46 minutes ago

తెలంగాణలో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ సెంటర్లు

ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు…

3 hours ago

పుష్కరం తర్వాత ‘సిరిమల్లె చెట్టు’ దర్శనం

గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే…

3 hours ago

వంశీ అరెస్టు తర్వాత హై డ్రామా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వంశీ…

4 hours ago

కింగ్ డమ్ దాచిపెట్టిన రహస్యాలు ఎన్నో…

నిన్న విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్ కు భారీ స్పందన కనిపిస్తోంది. దేవర, సలార్ తరహా షేడ్స్…

4 hours ago