పాకిస్థాన్ వేదికగా 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. భారత ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేస్తూ, పాకిస్థాన్లో భద్రతా పరిస్థితులు సరిగాలేవని, టీమిండియా అక్కడ ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.
బీసీసీఐ ఇప్పటికే పాకిస్థాన్లో మ్యాచ్లు ఆడటం సాధ్యమని చెప్పలేదని గుర్తు చేశారు. ఇక భారత్ జట్టు పాకిస్థాన్ వెళ్లడం సాధ్యంకాదన్న ఈ ప్రకటన ఐసీసీ కీలక సమావేశం ముందు వచ్చినట్లు తెలిపారు జైస్వాల్ వివరించారు. ఈ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, హైబ్రిడ్ మోడల్ ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ప్రస్తావనకు వస్తోంది.
ఈ మోడల్ ప్రకారం, కొన్ని మ్యాచ్లను పాకిస్థాన్లో, మరికొన్ని ఇతర దేశాల్లో నిర్వహిస్తారు. గతంలో ఆసియాకప్ కూడా హైబ్రిడ్ మోడల్లో జరిగింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ వేదికను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. భారత్ చెప్పినట్లు మేము నడుచుకోవాలా అన్నట్లే వ్యవహరిస్తోంది.
మరోవైపు భారత్ పాల్గొనకపోతే టోర్నమెంట్ ఆకర్షణ తగ్గుతుందని ఐసీసీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. పీసీబీ మాత్రం ఇది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని, హైబ్రిడ్ మోడల్కు సహకరించబోమని స్పష్టంచేసింది. ఈ పరిస్థితుల్లో, వాయిదా పడనున్న ఐసీసీ సమావేశం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఫైనల్ గా ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
This post was last modified on November 29, 2024 8:29 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…