కడప ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి, వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోప ణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది బెయిల్ రద్దు చేయమం టారా? సీబీఐ వాదనలపై మీరు ఏం చెబుతారు? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసు విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేసింది.
ఏం జరిగింది..?వైసీపీ అధినేత జగన్ బాబాయి.. వివేకానందరెడ్డి దారుణ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని గతంలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఆయన కొన్నాళ్లు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే.. తన ఆరోగ్యం బాగోలేదని, తాను ఎవరినీ ప్రలోభాలకు గురి చేయనని, సాక్ష్యులను బెదిరించనని చెబుతూ.. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిని విచారించిన తెలంగాణ హైకోర్టు భాస్కరరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ..ఇటీవల సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బెయిల్ రద్దు చేయాలా? అని అడుగుతూ.. భాస్కరరెడ్డి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో న్యాయవాది స్పందిస్తూ.. దీనిపై తమకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై భాస్కరరెడ్డి వచ్చేఏడాదిమార్చి నాటికి సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
This post was last modified on November 29, 2024 3:43 pm
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…