ఐపీఎల్ మెగా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా మారింది. అత్యంత పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్కు ఎంపికైన వైభవ్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో వేలంలోకి అడుగుపెట్టగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. చివరికి రాజస్థాన్ అతడిని రూ.1.10 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించారు. “సెలెక్షన్ ట్రయల్స్లో వైభవ్ తన ప్రతిభతో అద్భుతంగా రాణించాడు. అతడి ఆటలో ఉన్న నైపుణ్యం, క్రమశిక్షణ మనకు ఆహ్లాదకరంగా అనిపించాయి. ఈ వయసులోనే అతడిలో ఉన్న టాలెంట్ను చూసి అతడిని జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం,” అని ద్రవిడ్ తెలిపారు.
వైభవ్ తండ్రి సంజీవ్ మాట్లాడుతూ, “ప్రస్తుతం అతడు అండర్-19 ఆసియా కప్ కోసం దుబాయ్లో ఉన్నాడు. నాగ్పూర్లో జరిగిన ట్రయల్స్లో అతడు ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సూచన మేరకు ఒకే ఓవర్లో 17 పరుగులు చేయాలని టార్గెట్ ఇవ్వగా, అతడు మూడు సిక్సర్లు బాది దాన్ని సునాయాసంగా సాధించాడు,” అన్నారు.
వైభవ్ వయసు విషయంలో వస్తున్న ఆరోపణలను ఆయన తండ్రి ఖండించారు. “అతడు 13 ఏళ్ల వయస్కుడే. ఈ వయసును నిర్ధారించడానికి బీసీసీఐ నిర్వహించిన ఎముక పరీక్షల్లోనూ ఇదే స్పష్టమైంది. ఇంకా అనుమానాలు ఉంటే మరలా పరీక్షించవచ్చని,” ఆయన తెలిపారు. వైభవ్ భవిష్యత్తు ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మరింత వెలుగులోకి రానుంది. చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఆహ్వానం పొందడం అతడికి గొప్ప అవకాశమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అతను రాబోయే రోజుల్లో ఏ విదంగా ఆకట్టుకుంటాడో చూడాలి.
This post was last modified on November 26, 2024 5:26 pm
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ…
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…