రియాల్టీ గేమ్ షోలకు ఒక ఇమేజ్ తీసుకొచ్చిన టీవీ షోగా కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమాన్ని చెప్పాలి. ఇప్పటివరకు ఈ షో పదకొండు సిరీస్ లను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా పన్నెండో సీజన్ ను మొదలు పెట్టారు. అయినప్పటికీ ఈ షో కు పాపులార్టీ తగ్గలేదు. తాజాగా హాట్ సీట్లోకి వచ్చారు హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సబితా రెడ్డి. ఇప్పుడామె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆమె టీచరుగా పని చేస్తున్నారు. ఆమె హాట్ సీట్ లోకి కూర్చున్న తర్వాత ఆమె స్ఫూర్తివంతమైన జీవితాన్ని చూసిన బిగ్ బీ ఫిదా అయ్యారు. భర్త మరణించిన తర్వాత తానే పిల్లల్ని పెంచి పెద్ద చేయటం.. వారికి విద్యాబుద్ధుల్ని అందించటం చూసి బిగ్ బీ ఎంతగానో కదిలిపోయారు.
పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా.. మంచిగా చదివించిన ఆమెను బిగ్ బీ పొగిడేశారు. దీనికి సంబంధించిన గేమ్ షో ఈ రోజు (మంగళవారం) రాత్రి సోనీ టీవీలో టెలికాస్ట్ కానుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మధ్యతరగతి మహిళ ఈ గేమ్ షోలోకి రావటం ఒక ఎత్తు అయితే.. తన లైఫ్ స్టోరీతో బిగ్ బీని సైతం ఎమోషన్ కు గురి చేసిన ఆమె ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…