రియాల్టీ గేమ్ షోలకు ఒక ఇమేజ్ తీసుకొచ్చిన టీవీ షోగా కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమాన్ని చెప్పాలి. ఇప్పటివరకు ఈ షో పదకొండు సిరీస్ లను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా పన్నెండో సీజన్ ను మొదలు పెట్టారు. అయినప్పటికీ ఈ షో కు పాపులార్టీ తగ్గలేదు. తాజాగా హాట్ సీట్లోకి వచ్చారు హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సబితా రెడ్డి. ఇప్పుడామె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆమె టీచరుగా పని చేస్తున్నారు. ఆమె హాట్ సీట్ లోకి కూర్చున్న తర్వాత ఆమె స్ఫూర్తివంతమైన జీవితాన్ని చూసిన బిగ్ బీ ఫిదా అయ్యారు. భర్త మరణించిన తర్వాత తానే పిల్లల్ని పెంచి పెద్ద చేయటం.. వారికి విద్యాబుద్ధుల్ని అందించటం చూసి బిగ్ బీ ఎంతగానో కదిలిపోయారు.
పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా.. మంచిగా చదివించిన ఆమెను బిగ్ బీ పొగిడేశారు. దీనికి సంబంధించిన గేమ్ షో ఈ రోజు (మంగళవారం) రాత్రి సోనీ టీవీలో టెలికాస్ట్ కానుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మధ్యతరగతి మహిళ ఈ గేమ్ షోలోకి రావటం ఒక ఎత్తు అయితే.. తన లైఫ్ స్టోరీతో బిగ్ బీని సైతం ఎమోషన్ కు గురి చేసిన ఆమె ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు.
This post was last modified on October 7, 2020 9:43 am
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల…
పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో…
'ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…