రియాల్టీ గేమ్ షోలకు ఒక ఇమేజ్ తీసుకొచ్చిన టీవీ షోగా కౌన్ బనేగా కరోర్ పతి కార్యక్రమాన్ని చెప్పాలి. ఇప్పటివరకు ఈ షో పదకొండు సిరీస్ లను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా పన్నెండో సీజన్ ను మొదలు పెట్టారు. అయినప్పటికీ ఈ షో కు పాపులార్టీ తగ్గలేదు. తాజాగా హాట్ సీట్లోకి వచ్చారు హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సబితా రెడ్డి. ఇప్పుడామె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
అల్వాల్ ప్రాంతానికి చెందిన ఆమె టీచరుగా పని చేస్తున్నారు. ఆమె హాట్ సీట్ లోకి కూర్చున్న తర్వాత ఆమె స్ఫూర్తివంతమైన జీవితాన్ని చూసిన బిగ్ బీ ఫిదా అయ్యారు. భర్త మరణించిన తర్వాత తానే పిల్లల్ని పెంచి పెద్ద చేయటం.. వారికి విద్యాబుద్ధుల్ని అందించటం చూసి బిగ్ బీ ఎంతగానో కదిలిపోయారు.
పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా.. మంచిగా చదివించిన ఆమెను బిగ్ బీ పొగిడేశారు. దీనికి సంబంధించిన గేమ్ షో ఈ రోజు (మంగళవారం) రాత్రి సోనీ టీవీలో టెలికాస్ట్ కానుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మధ్యతరగతి మహిళ ఈ గేమ్ షోలోకి రావటం ఒక ఎత్తు అయితే.. తన లైఫ్ స్టోరీతో బిగ్ బీని సైతం ఎమోషన్ కు గురి చేసిన ఆమె ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు.
This post was last modified on October 7, 2020 9:43 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…