Political News

ఇకపై ఏపీలో ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానం

తన హయాంలో ‘నాడు-నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తానని, ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 1-5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని కేంద్రం నూతన విద్యా పాలసీని తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే 6వ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన చేయాలన్న యోచనలో జగన్ సర్కార్ ఉంది. మరోవైపు, నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఏపీ సర్కార్ మరిన్ని మార్పులు చేర్పులు చేపట్టింది.

అందులో భాగంగానే దేశంలో తొలిసారిగా 1వతరగతి నుంచే ఏపీలో సెమిస్టర్ విద్యావిధానాన్ని ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టనున్న ఈ విధానానికి తగినట్లుగానే పాఠ్య పుస్తకాలను 3 సెమిస్టర్‌లలాగా విభజించారు. ఒక పేజిలో తెలుగులో… మరో పేజీలో ఇంగ్లీష్‌లో ముద్రించడం ద్వారా ఇంగ్లీష్ బోధన అర్దమయ్యే రీతిలో పుస్తకాలు రూపొందించింది

దీంతోపాటు, ఏపీలో తొలిసారిగా విధ్యార్ధులకు వర్క్ బుక్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు.టీచర్స్ కి, తల్లితండ్రులకి‌ కూడా హేండ్ బుక్స్ ఇవ్వనున్నారు. విధ్యార్దుల దృష్టిని ఆకర్షించేలా రంగురంగుల బొమ్మలతో పాఠ్య పుస్తకాల రూపొందించారు. మార్చి నెలాఖరునాటుకి హైస్కూళ్లకి.. జూన్ నాటికి ప్రాదమిక పాఠశాలలకి పాఠ్యపుస్తకాలని పంపిణీ చేశామని విద్యాశాఖాధికారులు తెలిపారు. దీంతోపాటు, నూతన సిలబస్ ను కూడా తీసుకురానుంది. సిలబస్ లో మార్పుల కోసం రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ అమెరికా, ఆస్డ్రేలియా లాంటి 10 దేశాల ప్రాధమిక విద్యావిధానాలపై, దేశంలోని 15 రాష్ట్రాల ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్ పై అధ్యయనం చేసింది.

ఒకటి నుంచి ఆరో తరగతి వరకు నూతన విద్యావిధానం ద్వారా మార్పులు తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం 84 రకాల పాఠ్య పుస్తకాలు, 63 వర్క్ బుక్‌లను రూపొందించడంతో పాటు తమిళం, ఒరియా, కన్నడ, ఉర్ధూ మీడియంలలో పాఠ్య పుస్తకాలు ముద్రించింది. కొత్త సిలబస్ ప్రకారం ఒకటి, రెండు తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు.. మూడు, నాలుగు, అయిదు తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, మేథ్స్‌, సైన్స్ పాఠ్య పుస్తకాలు ఉంటాయి. ఆరో తరగతి విధ్యార్ధులకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలగా ఉండబోతున్నాయి.

This post was last modified on October 7, 2020 9:56 am

Share
Show comments
Published by
satya

Recent Posts

శింగ‌న‌మ‌ల సింగ‌మ‌లై ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పార్టీల‌న్నీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. అభ్య‌ర్థులు…

36 mins ago

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…

2 hours ago

చిన్న దర్శకుడి మీద పెద్ద బాధ్యత

మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…

2 hours ago

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

3 hours ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

3 hours ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

4 hours ago