Trends

కునుకేస్తే ఉద్యోగం పీకేస్తారా? కోర్టు చీవాట్లు

ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్ షిప్టులో పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా నైట్ షిప్టులు చేసే ఉద్యోగులు..పని చేస్తున్న సమయంలో ఓ చిన్న కునుకు వేయడం సహజం. చాలా కంపెనీలు కునుకు వేసే ఉద్యోగులను చూసీచూడనట్లు వదిలేస్టుంటాయి. కానీ, చైనాలోని ఓ కంపెనీ మాత్రం కునుకు వేసిన ఉద్యోగిపై వేటు వేసింది.

దీంతో, తన ఉద్యోగం పోయిందంటూ బాధిత ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో, సదరు కంపెనీకి 3.5 లక్షల యువాన్లు (దాదాపు రూ. 40.78 లక్షలు) ఫైన్ వేసింది కోర్టు. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైజింగ్ లోని ఓ కెమికల్ కంపెనీలో ఝాంగ్‌ 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కంపెనీలో నిబద్ధత గల ఉద్యోగిగా ఆయనకు పేరుంది. ఓ ఫైన్ డే నైట్ డ్యూటీ చేస్తున్న ఝాంగ్ తన డెస్క్‌పైనే చిన్న కునుకు తీశాడు.

సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో కొంపలు మునిగిపోయాయి అన్నట్లు హెఆర్ డిపార్ట్ మెంట్ ఫైర్ అయింది. గంటపాటు నిద్రపోయాడంటూ ఉద్యోగం నుంచి ఫైర్ చేసింది. నిద్రపోవడం కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందకు వస్తుందని నోటీసులిచ్చి ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం కోల్పోయిన ఝాంగ్.. తనను అన్యాయంగా తొలగించారంటూ కోర్టును ఆశ్రయించాడు. అయిత, నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి పీకేస్తారా అని కోర్టు ఆ కంపెనీకి చివాట్లు పెట్టి 40 లక్షల రూపాయల ఫైన్ వేసింది. కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమీ జరగలేదని చురకలంటించింది. బైజింగ్ లోని పీపుల్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on November 25, 2024 12:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: ChinaOffice

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago