ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్ షిప్టులో పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా నైట్ షిప్టులు చేసే ఉద్యోగులు..పని చేస్తున్న సమయంలో ఓ చిన్న కునుకు వేయడం సహజం. చాలా కంపెనీలు కునుకు వేసే ఉద్యోగులను చూసీచూడనట్లు వదిలేస్టుంటాయి. కానీ, చైనాలోని ఓ కంపెనీ మాత్రం కునుకు వేసిన ఉద్యోగిపై వేటు వేసింది.
దీంతో, తన ఉద్యోగం పోయిందంటూ బాధిత ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో, సదరు కంపెనీకి 3.5 లక్షల యువాన్లు (దాదాపు రూ. 40.78 లక్షలు) ఫైన్ వేసింది కోర్టు. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైజింగ్ లోని ఓ కెమికల్ కంపెనీలో ఝాంగ్ 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కంపెనీలో నిబద్ధత గల ఉద్యోగిగా ఆయనకు పేరుంది. ఓ ఫైన్ డే నైట్ డ్యూటీ చేస్తున్న ఝాంగ్ తన డెస్క్పైనే చిన్న కునుకు తీశాడు.
సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో కొంపలు మునిగిపోయాయి అన్నట్లు హెఆర్ డిపార్ట్ మెంట్ ఫైర్ అయింది. గంటపాటు నిద్రపోయాడంటూ ఉద్యోగం నుంచి ఫైర్ చేసింది. నిద్రపోవడం కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందకు వస్తుందని నోటీసులిచ్చి ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం కోల్పోయిన ఝాంగ్.. తనను అన్యాయంగా తొలగించారంటూ కోర్టును ఆశ్రయించాడు. అయిత, నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి పీకేస్తారా అని కోర్టు ఆ కంపెనీకి చివాట్లు పెట్టి 40 లక్షల రూపాయల ఫైన్ వేసింది. కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమీ జరగలేదని చురకలంటించింది. బైజింగ్ లోని పీపుల్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 25, 2024 12:32 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…