Trends

కునుకేస్తే ఉద్యోగం పీకేస్తారా? కోర్టు చీవాట్లు

ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్ షిప్టులో పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా నైట్ షిప్టులు చేసే ఉద్యోగులు..పని చేస్తున్న సమయంలో ఓ చిన్న కునుకు వేయడం సహజం. చాలా కంపెనీలు కునుకు వేసే ఉద్యోగులను చూసీచూడనట్లు వదిలేస్టుంటాయి. కానీ, చైనాలోని ఓ కంపెనీ మాత్రం కునుకు వేసిన ఉద్యోగిపై వేటు వేసింది.

దీంతో, తన ఉద్యోగం పోయిందంటూ బాధిత ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో, సదరు కంపెనీకి 3.5 లక్షల యువాన్లు (దాదాపు రూ. 40.78 లక్షలు) ఫైన్ వేసింది కోర్టు. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైజింగ్ లోని ఓ కెమికల్ కంపెనీలో ఝాంగ్‌ 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కంపెనీలో నిబద్ధత గల ఉద్యోగిగా ఆయనకు పేరుంది. ఓ ఫైన్ డే నైట్ డ్యూటీ చేస్తున్న ఝాంగ్ తన డెస్క్‌పైనే చిన్న కునుకు తీశాడు.

సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో కొంపలు మునిగిపోయాయి అన్నట్లు హెఆర్ డిపార్ట్ మెంట్ ఫైర్ అయింది. గంటపాటు నిద్రపోయాడంటూ ఉద్యోగం నుంచి ఫైర్ చేసింది. నిద్రపోవడం కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందకు వస్తుందని నోటీసులిచ్చి ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం కోల్పోయిన ఝాంగ్.. తనను అన్యాయంగా తొలగించారంటూ కోర్టును ఆశ్రయించాడు. అయిత, నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి పీకేస్తారా అని కోర్టు ఆ కంపెనీకి చివాట్లు పెట్టి 40 లక్షల రూపాయల ఫైన్ వేసింది. కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమీ జరగలేదని చురకలంటించింది. బైజింగ్ లోని పీపుల్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on November 25, 2024 12:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: ChinaOffice

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

8 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

44 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago