ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్ షిప్టులో పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా నైట్ షిప్టులు చేసే ఉద్యోగులు..పని చేస్తున్న సమయంలో ఓ చిన్న కునుకు వేయడం సహజం. చాలా కంపెనీలు కునుకు వేసే ఉద్యోగులను చూసీచూడనట్లు వదిలేస్టుంటాయి. కానీ, చైనాలోని ఓ కంపెనీ మాత్రం కునుకు వేసిన ఉద్యోగిపై వేటు వేసింది.
దీంతో, తన ఉద్యోగం పోయిందంటూ బాధిత ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో, సదరు కంపెనీకి 3.5 లక్షల యువాన్లు (దాదాపు రూ. 40.78 లక్షలు) ఫైన్ వేసింది కోర్టు. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్, టైజింగ్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైజింగ్ లోని ఓ కెమికల్ కంపెనీలో ఝాంగ్ 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కంపెనీలో నిబద్ధత గల ఉద్యోగిగా ఆయనకు పేరుంది. ఓ ఫైన్ డే నైట్ డ్యూటీ చేస్తున్న ఝాంగ్ తన డెస్క్పైనే చిన్న కునుకు తీశాడు.
సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో కొంపలు మునిగిపోయాయి అన్నట్లు హెఆర్ డిపార్ట్ మెంట్ ఫైర్ అయింది. గంటపాటు నిద్రపోయాడంటూ ఉద్యోగం నుంచి ఫైర్ చేసింది. నిద్రపోవడం కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందకు వస్తుందని నోటీసులిచ్చి ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం కోల్పోయిన ఝాంగ్.. తనను అన్యాయంగా తొలగించారంటూ కోర్టును ఆశ్రయించాడు. అయిత, నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి పీకేస్తారా అని కోర్టు ఆ కంపెనీకి చివాట్లు పెట్టి 40 లక్షల రూపాయల ఫైన్ వేసింది. కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమీ జరగలేదని చురకలంటించింది. బైజింగ్ లోని పీపుల్స్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…