Trends

ఐపీఎల్ లో వార్నర్ ఖేల్ ఖతం?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతోంది. ఎడారి దేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ తొలి రోజు 84మంది ప్లేయర్లు ఆక్షన్ కు వచ్చారు. కొందరు ప్లేయర్లకు కోట్లు కురిపిస్తుంటే మరికొందరికి మొండి చేయి చూపిస్తోంది. ఈ టోర్నమెంటులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోగా, మరికొందరు అంతర్జాతీయ క్రికెటర్లు, భారత ఆటగాళ్లు అసలు అమ్ముడుపోలేదు.

ముఖ్యంగా ప్రపంచ టీ20 క్రికెట్ లో విధ్వంసర బ్యాటర్ గా పేరున్న డేవిడ్ వార్నర్ ను ఏ ఫ్రాంజైజీ కొనేందుకు ఆసక్తి చూపలేదు. అన్ సోల్డ్ం ప్లేయర్ గా డేవిడ్ వార్నర్ మిగిలడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జరిగిన మినీ వేలంలో 6.25 కోట్లకు ఢిల్లీ ఫ్రాంఛైజీ డేవిడ్ వార్నర్ ను కొనుగోలు చేసింది. అయితే, ఈ సారి వార్నర్ పై ఢిల్లీతో పాటు మరే ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐపీఎల్ లో వార్నర్ ఖేల్ ఖతం అయినట్లేనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

ఇక, ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో కూడా అమ్ముడు పోలేదు. టీ20 క్రికెట్ స్పెషలిస్ట్ గా పేరున్న బెయిర్ స్టోను కొనేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. వికెట్ కీపర్/ విధ్వంసకర బ్యాట్స్ మన్ అయిన బెయిర్ స్టోను ఏ జట్టు కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ కూడా అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. గత వేలంలో 7.75 కోట్లు పలికిన దేవదత్ ను కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. ప్రస్తుతం పడిక్కల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోని తొలి టెస్టులో ఆడుతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on November 24, 2024 10:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

4 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago