Trends

ఐపీఎల్ లో వార్నర్ ఖేల్ ఖతం?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతోంది. ఎడారి దేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ తొలి రోజు 84మంది ప్లేయర్లు ఆక్షన్ కు వచ్చారు. కొందరు ప్లేయర్లకు కోట్లు కురిపిస్తుంటే మరికొందరికి మొండి చేయి చూపిస్తోంది. ఈ టోర్నమెంటులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోగా, మరికొందరు అంతర్జాతీయ క్రికెటర్లు, భారత ఆటగాళ్లు అసలు అమ్ముడుపోలేదు.

ముఖ్యంగా ప్రపంచ టీ20 క్రికెట్ లో విధ్వంసర బ్యాటర్ గా పేరున్న డేవిడ్ వార్నర్ ను ఏ ఫ్రాంజైజీ కొనేందుకు ఆసక్తి చూపలేదు. అన్ సోల్డ్ం ప్లేయర్ గా డేవిడ్ వార్నర్ మిగిలడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జరిగిన మినీ వేలంలో 6.25 కోట్లకు ఢిల్లీ ఫ్రాంఛైజీ డేవిడ్ వార్నర్ ను కొనుగోలు చేసింది. అయితే, ఈ సారి వార్నర్ పై ఢిల్లీతో పాటు మరే ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐపీఎల్ లో వార్నర్ ఖేల్ ఖతం అయినట్లేనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

ఇక, ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో కూడా అమ్ముడు పోలేదు. టీ20 క్రికెట్ స్పెషలిస్ట్ గా పేరున్న బెయిర్ స్టోను కొనేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. వికెట్ కీపర్/ విధ్వంసకర బ్యాట్స్ మన్ అయిన బెయిర్ స్టోను ఏ జట్టు కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ కూడా అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. గత వేలంలో 7.75 కోట్లు పలికిన దేవదత్ ను కొనేందుకు ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. ప్రస్తుతం పడిక్కల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోని తొలి టెస్టులో ఆడుతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on November 24, 2024 10:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

48 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago