Trends

పంజాబ్ ప్రీతి.. శ్రేయస్ కోసం అంత రేటెందుకంటే…

ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా రాలేదనేది అందరికీ తెలిసిందే. 2014లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, చివరి దశలో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి పంజాబ్ పునరాగమనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ కనీసం టాప్ 5లో నిలవడం లేదు. ఇక ఆ జట్టులో ప్రధాన లోపం కెప్టెన్ గా సరైన ఆటగాడు లేకపోవడమే. అందుకే ఈ సారి పంజాబ్ యాజమాన్యం, ముఖ్యంగా ప్రీతి జింటా, స్ట్రాటజీని పూర్తిగా మార్చి, బలమైన నాయకత్వం కోసం శ్రేయస్ అయ్యర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి అందరికి షాక్ ఇచ్చారు. తొలుత కోల్‌కతా, ఆపై ఢిల్లీ జట్లతో పోటీ పడిన పంజాబ్ చివరకు శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకుంది. అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు కెప్టెన్‌గా సేవలందించాడు. కెప్టెన్సీ అనుభవం, బ్యాటింగ్ నైపుణ్యం వల్ల పంజాబ్ బలమైన జట్టుగా మారేందుకు అయ్యర్ కీలక పాత్ర పోషించనున్నాడు.

ఢిల్లీని 2020లో ఫైనల్స్ వరకు తీసుకు వెళ్ళాడు. అలాగే 2024లో సీజన్‌లో కోల్‌కతా జట్టును ఫైనల్ లో గెలిపించిన కెప్టెన్ గా గుర్తింపు అందుకున్నాడు. అతడి గేమ్ స్ట్రాటజీలు, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే గుణం, ఇన్నింగ్స్‌ని సమర్థంగా నిర్మించగలిగే సామర్థ్యం పంజాబ్‌ను ఈ సారి విజయ దిశగా నడిపిస్తుందని ఆశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ గత సీజన్లలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసినా, స్థిరమైన ప్రదర్శనను చూపలేకపోయింది.

కెప్టెన్సీ మార్పులు, ఆటగాళ్ల గాయాలు, పుంజుకోలేని మిడిలార్డర్ సమస్యలు జట్టును వెనుకకు లాగాయి. ఇది చూసి, ఈ సారి శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్‌గా ఎంచుకుని పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగేందుకు యాజమాన్యం సిద్ధమైంది. అయ్యార్ నాయకత్వంలో, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత మెరుగుపరచి, బౌలింగ్ విభాగానికి సరైన మార్గదర్శకత్వం అందించగలదని నమ్ముతున్నారు. మరి ప్రీతి జింటా ఈ సారి తన కలల ట్రోఫీని అందుకుంటుందో లేదో చూడాలి.

This post was last modified on November 24, 2024 6:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago