ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా రాలేదనేది అందరికీ తెలిసిందే. 2014లో ఫైనల్కు చేరుకున్నప్పటికీ, చివరి దశలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి పంజాబ్ పునరాగమనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ కనీసం టాప్ 5లో నిలవడం లేదు. ఇక ఆ జట్టులో ప్రధాన లోపం కెప్టెన్ గా సరైన ఆటగాడు లేకపోవడమే. అందుకే ఈ సారి పంజాబ్ యాజమాన్యం, ముఖ్యంగా ప్రీతి జింటా, స్ట్రాటజీని పూర్తిగా మార్చి, బలమైన నాయకత్వం కోసం శ్రేయస్ అయ్యర్ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి అందరికి షాక్ ఇచ్చారు. తొలుత కోల్కతా, ఆపై ఢిల్లీ జట్లతో పోటీ పడిన పంజాబ్ చివరకు శ్రేయస్ అయ్యర్ను సొంతం చేసుకుంది. అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు కెప్టెన్గా సేవలందించాడు. కెప్టెన్సీ అనుభవం, బ్యాటింగ్ నైపుణ్యం వల్ల పంజాబ్ బలమైన జట్టుగా మారేందుకు అయ్యర్ కీలక పాత్ర పోషించనున్నాడు.
ఢిల్లీని 2020లో ఫైనల్స్ వరకు తీసుకు వెళ్ళాడు. అలాగే 2024లో సీజన్లో కోల్కతా జట్టును ఫైనల్ లో గెలిపించిన కెప్టెన్ గా గుర్తింపు అందుకున్నాడు. అతడి గేమ్ స్ట్రాటజీలు, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే గుణం, ఇన్నింగ్స్ని సమర్థంగా నిర్మించగలిగే సామర్థ్యం పంజాబ్ను ఈ సారి విజయ దిశగా నడిపిస్తుందని ఆశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ గత సీజన్లలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసినా, స్థిరమైన ప్రదర్శనను చూపలేకపోయింది.
కెప్టెన్సీ మార్పులు, ఆటగాళ్ల గాయాలు, పుంజుకోలేని మిడిలార్డర్ సమస్యలు జట్టును వెనుకకు లాగాయి. ఇది చూసి, ఈ సారి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా ఎంచుకుని పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగేందుకు యాజమాన్యం సిద్ధమైంది. అయ్యార్ నాయకత్వంలో, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ను మరింత మెరుగుపరచి, బౌలింగ్ విభాగానికి సరైన మార్గదర్శకత్వం అందించగలదని నమ్ముతున్నారు. మరి ప్రీతి జింటా ఈ సారి తన కలల ట్రోఫీని అందుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on November 24, 2024 6:36 pm
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…