ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా రాలేదనేది అందరికీ తెలిసిందే. 2014లో ఫైనల్కు చేరుకున్నప్పటికీ, చివరి దశలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి పంజాబ్ పునరాగమనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ కనీసం టాప్ 5లో నిలవడం లేదు. ఇక ఆ జట్టులో ప్రధాన లోపం కెప్టెన్ గా సరైన ఆటగాడు లేకపోవడమే. అందుకే ఈ సారి పంజాబ్ యాజమాన్యం, ముఖ్యంగా ప్రీతి జింటా, స్ట్రాటజీని పూర్తిగా మార్చి, బలమైన నాయకత్వం కోసం శ్రేయస్ అయ్యర్ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.
పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసి అందరికి షాక్ ఇచ్చారు. తొలుత కోల్కతా, ఆపై ఢిల్లీ జట్లతో పోటీ పడిన పంజాబ్ చివరకు శ్రేయస్ అయ్యర్ను సొంతం చేసుకుంది. అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు కెప్టెన్గా సేవలందించాడు. కెప్టెన్సీ అనుభవం, బ్యాటింగ్ నైపుణ్యం వల్ల పంజాబ్ బలమైన జట్టుగా మారేందుకు అయ్యర్ కీలక పాత్ర పోషించనున్నాడు.
ఢిల్లీని 2020లో ఫైనల్స్ వరకు తీసుకు వెళ్ళాడు. అలాగే 2024లో సీజన్లో కోల్కతా జట్టును ఫైనల్ లో గెలిపించిన కెప్టెన్ గా గుర్తింపు అందుకున్నాడు. అతడి గేమ్ స్ట్రాటజీలు, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే గుణం, ఇన్నింగ్స్ని సమర్థంగా నిర్మించగలిగే సామర్థ్యం పంజాబ్ను ఈ సారి విజయ దిశగా నడిపిస్తుందని ఆశిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ గత సీజన్లలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసినా, స్థిరమైన ప్రదర్శనను చూపలేకపోయింది.
కెప్టెన్సీ మార్పులు, ఆటగాళ్ల గాయాలు, పుంజుకోలేని మిడిలార్డర్ సమస్యలు జట్టును వెనుకకు లాగాయి. ఇది చూసి, ఈ సారి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా ఎంచుకుని పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగేందుకు యాజమాన్యం సిద్ధమైంది. అయ్యార్ నాయకత్వంలో, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ను మరింత మెరుగుపరచి, బౌలింగ్ విభాగానికి సరైన మార్గదర్శకత్వం అందించగలదని నమ్ముతున్నారు. మరి ప్రీతి జింటా ఈ సారి తన కలల ట్రోఫీని అందుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on November 24, 2024 6:36 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…