Trends

ఐపీఎల్ వేలంలో కళ్లు చెదిరే ధరకు రిషబ్ పంత్!

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో పంత్ కోసం ఫ్రాంచైజీలు గట్టి పోటీ చేశారు. ఈ పోటీని లక్నో సూపర్ జెయింట్స్ కైవసం చేసుకుంది. ఎల్ఎస్ జీ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. పంత్‌ను దక్కించుకోవడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం పోటీకి దిగింది.

అయితే రేటు భారీ స్థాయికి చేరడంతో చివరికి సన్‌రైజర్స్ వెనక్కు తగ్గింది. ఇంత భారీ ధరతో రిషబ్ పంత్‌ను లక్నో తమ జట్టుకు చేర్చుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడికి లభించని అత్యధిక రేటు. నేటి వేలంలో రెండు కీలక రికార్డులు బద్దలయ్యాయి. తొలుత ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల రికార్డు నెలకొల్పగా, తర్వాత శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించాడు. కానీ ఈ రికార్డును రిషబ్ పంత్ కేవలం గంటల వ్యవధిలోనే అధిగమించాడు. పంత్ ధరకు సంబంధించిన వార్త క్రికెట్ అభిమానుల్లో సంచలనంగా మారింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల తాలూకు వ్యూహాలు, భారీ ఖర్చులు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పంత్ బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ కీపింగ్ ప్రతిభ కలిపి ఈ రేటుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ రికార్డు ధరతో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో కీలక పాత్ర పోషించనున్నాడని లక్నో యాజమాన్యం ఆశిస్తోంది. ఈ భారీ పెట్టుబడి లాభసాటిగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్ వరకు ఢిల్లీ జట్టులో ఉన్న పంత్ యాజమాన్యంపై అసహనంతోనే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

This post was last modified on November 24, 2024 6:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

2 hours ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

4 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

6 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

7 hours ago