టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో పంత్ కోసం ఫ్రాంచైజీలు గట్టి పోటీ చేశారు. ఈ పోటీని లక్నో సూపర్ జెయింట్స్ కైవసం చేసుకుంది. ఎల్ఎస్ జీ పంత్ను రూ.27 కోట్లకు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. పంత్ను దక్కించుకోవడంలో సన్రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం పోటీకి దిగింది.
అయితే రేటు భారీ స్థాయికి చేరడంతో చివరికి సన్రైజర్స్ వెనక్కు తగ్గింది. ఇంత భారీ ధరతో రిషబ్ పంత్ను లక్నో తమ జట్టుకు చేర్చుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడికి లభించని అత్యధిక రేటు. నేటి వేలంలో రెండు కీలక రికార్డులు బద్దలయ్యాయి. తొలుత ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల రికార్డు నెలకొల్పగా, తర్వాత శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించాడు. కానీ ఈ రికార్డును రిషబ్ పంత్ కేవలం గంటల వ్యవధిలోనే అధిగమించాడు. పంత్ ధరకు సంబంధించిన వార్త క్రికెట్ అభిమానుల్లో సంచలనంగా మారింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల తాలూకు వ్యూహాలు, భారీ ఖర్చులు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పంత్ బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ కీపింగ్ ప్రతిభ కలిపి ఈ రేటుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ రికార్డు ధరతో రిషబ్ పంత్ ఐపీఎల్లో కీలక పాత్ర పోషించనున్నాడని లక్నో యాజమాన్యం ఆశిస్తోంది. ఈ భారీ పెట్టుబడి లాభసాటిగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. గత సీజన్ వరకు ఢిల్లీ జట్టులో ఉన్న పంత్ యాజమాన్యంపై అసహనంతోనే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on November 24, 2024 6:06 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…