టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో పంత్ కోసం ఫ్రాంచైజీలు గట్టి పోటీ చేశారు. ఈ పోటీని లక్నో సూపర్ జెయింట్స్ కైవసం చేసుకుంది. ఎల్ఎస్ జీ పంత్ను రూ.27 కోట్లకు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. పంత్ను దక్కించుకోవడంలో సన్రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం పోటీకి దిగింది.
అయితే రేటు భారీ స్థాయికి చేరడంతో చివరికి సన్రైజర్స్ వెనక్కు తగ్గింది. ఇంత భారీ ధరతో రిషబ్ పంత్ను లక్నో తమ జట్టుకు చేర్చుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడికి లభించని అత్యధిక రేటు. నేటి వేలంలో రెండు కీలక రికార్డులు బద్దలయ్యాయి. తొలుత ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల రికార్డు నెలకొల్పగా, తర్వాత శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించాడు. కానీ ఈ రికార్డును రిషబ్ పంత్ కేవలం గంటల వ్యవధిలోనే అధిగమించాడు. పంత్ ధరకు సంబంధించిన వార్త క్రికెట్ అభిమానుల్లో సంచలనంగా మారింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల తాలూకు వ్యూహాలు, భారీ ఖర్చులు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పంత్ బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ కీపింగ్ ప్రతిభ కలిపి ఈ రేటుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ రికార్డు ధరతో రిషబ్ పంత్ ఐపీఎల్లో కీలక పాత్ర పోషించనున్నాడని లక్నో యాజమాన్యం ఆశిస్తోంది. ఈ భారీ పెట్టుబడి లాభసాటిగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. గత సీజన్ వరకు ఢిల్లీ జట్టులో ఉన్న పంత్ యాజమాన్యంపై అసహనంతోనే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on November 24, 2024 6:06 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…