Trends

ఐపీఎల్ వేలంలో కళ్లు చెదిరే ధరకు రిషబ్ పంత్!

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో పంత్ కోసం ఫ్రాంచైజీలు గట్టి పోటీ చేశారు. ఈ పోటీని లక్నో సూపర్ జెయింట్స్ కైవసం చేసుకుంది. ఎల్ఎస్ జీ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. పంత్‌ను దక్కించుకోవడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం పోటీకి దిగింది.

అయితే రేటు భారీ స్థాయికి చేరడంతో చివరికి సన్‌రైజర్స్ వెనక్కు తగ్గింది. ఇంత భారీ ధరతో రిషబ్ పంత్‌ను లక్నో తమ జట్టుకు చేర్చుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడికి లభించని అత్యధిక రేటు. నేటి వేలంలో రెండు కీలక రికార్డులు బద్దలయ్యాయి. తొలుత ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల రికార్డు నెలకొల్పగా, తర్వాత శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించాడు. కానీ ఈ రికార్డును రిషబ్ పంత్ కేవలం గంటల వ్యవధిలోనే అధిగమించాడు. పంత్ ధరకు సంబంధించిన వార్త క్రికెట్ అభిమానుల్లో సంచలనంగా మారింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల తాలూకు వ్యూహాలు, భారీ ఖర్చులు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పంత్ బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ కీపింగ్ ప్రతిభ కలిపి ఈ రేటుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ రికార్డు ధరతో రిషబ్ పంత్ ఐపీఎల్‌లో కీలక పాత్ర పోషించనున్నాడని లక్నో యాజమాన్యం ఆశిస్తోంది. ఈ భారీ పెట్టుబడి లాభసాటిగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్ వరకు ఢిల్లీ జట్టులో ఉన్న పంత్ యాజమాన్యంపై అసహనంతోనే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

This post was last modified on November 24, 2024 6:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

19 minutes ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

1 hour ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

3 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

4 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

7 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

9 hours ago