Trends

ప్రాణాలు కాపాడిన వాళ్లకు పంత్ ఏమిచ్చాడు?

భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఆడతాడని.. టీమ్ ఇండియా జెర్సీలో కనిపిస్తాడని చాలామంది ఊహించలేదు. రెండేళ్ల కిందట అతడికి అంత పెద్ద ప్రమాదం జరిగింది. 2022 డిసెంబరులో తెల్లవారుజామున ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు తనే కారు డ్రైవ్ చేసుకుని వెళ్తుండగా.. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడం.. పంత్ తీవ్ర గాయాలతో కారులో చిక్కుకుపోవడం.. మంటలు చెలరేగి కారు దగ్ధమైపోతున్న దశలో ఎవరో అది చూసి పంత్‌ను బయటికి లాగడం.. చకచకా జరిగాయి.

ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే పంత్.. ఆ మంటల్లో కాలిపోయేవాడు. పంత్‌ను బయటికి తీసి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతడి ప్రాణం నిలిచింది. కానీ తీవ్ర గాయాలతో అతను ఆరు నెలల పాటు మంచం దిగలేదు. అనేక సర్జరీల తర్వాత అతను కోలుకున్నాడు. ఆపై నెమ్మదిగా సాధన చేసి 15 నెలల విరామం తర్వాత ఆటలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు.ఆ ప్రమాదంలో రజత్, నిషు అనే కుర్రాళ్లు పంత్ ప్రాణాన్ని కాపాడారు. ప్రమాదం జరిగిన దగ్గర్లోనే వీళ్లిద్దరూ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వాళ్లు అప్రమత్తం కాకపోయి ఉంటే పంత్ అనేవాడు ఉండేవాడు కాదు.

ఆ రోజు వాళ్లిద్దరూ చేసిన సాయాన్ని గుర్తుంచుకుని పంత్.. ఇద్దరికీ బైకులు కొని ఇచ్చాడట. వాటి మీదే ఇప్పుడు ఆ ఇద్దరూ తిరుగుతున్నారు. రజత్, నిషులకు పంత్ కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‌తో పునరామగనం చేసిన పంత్.. ఢిల్లీ తరఫున బాగానే ఆడాడు. ఆపై టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసి టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆడుతున్నాడు. ఈ రోజు, రేపు జరగనున్న ఐపీఎల్ వేలంలో అతడికి భారీ ధర పలుకుతుందనే అంచనాలున్నాయి.

This post was last modified on November 24, 2024 2:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: #RishabPant

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

51 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago