భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఆడతాడని.. టీమ్ ఇండియా జెర్సీలో కనిపిస్తాడని చాలామంది ఊహించలేదు. రెండేళ్ల కిందట అతడికి అంత పెద్ద ప్రమాదం జరిగింది. 2022 డిసెంబరులో తెల్లవారుజామున ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు తనే కారు డ్రైవ్ చేసుకుని వెళ్తుండగా.. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడం.. పంత్ తీవ్ర గాయాలతో కారులో చిక్కుకుపోవడం.. మంటలు చెలరేగి కారు దగ్ధమైపోతున్న దశలో ఎవరో అది చూసి పంత్ను బయటికి లాగడం.. చకచకా జరిగాయి.
ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే పంత్.. ఆ మంటల్లో కాలిపోయేవాడు. పంత్ను బయటికి తీసి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతడి ప్రాణం నిలిచింది. కానీ తీవ్ర గాయాలతో అతను ఆరు నెలల పాటు మంచం దిగలేదు. అనేక సర్జరీల తర్వాత అతను కోలుకున్నాడు. ఆపై నెమ్మదిగా సాధన చేసి 15 నెలల విరామం తర్వాత ఆటలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు.ఆ ప్రమాదంలో రజత్, నిషు అనే కుర్రాళ్లు పంత్ ప్రాణాన్ని కాపాడారు. ప్రమాదం జరిగిన దగ్గర్లోనే వీళ్లిద్దరూ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వాళ్లు అప్రమత్తం కాకపోయి ఉంటే పంత్ అనేవాడు ఉండేవాడు కాదు.
ఆ రోజు వాళ్లిద్దరూ చేసిన సాయాన్ని గుర్తుంచుకుని పంత్.. ఇద్దరికీ బైకులు కొని ఇచ్చాడట. వాటి మీదే ఇప్పుడు ఆ ఇద్దరూ తిరుగుతున్నారు. రజత్, నిషులకు పంత్ కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్తో పునరామగనం చేసిన పంత్.. ఢిల్లీ తరఫున బాగానే ఆడాడు. ఆపై టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసి టీ20 ప్రపంచకప్లో సత్తా చాటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో ఆడుతున్నాడు. ఈ రోజు, రేపు జరగనున్న ఐపీఎల్ వేలంలో అతడికి భారీ ధర పలుకుతుందనే అంచనాలున్నాయి.
This post was last modified on November 24, 2024 2:04 pm
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నాయకుడు ఏదోకటి మాట్లాడుతూ మీడియాకు చేతినిండా పని పెడుతున్నారు. ఒకరోజు కొండా సురేఖ, మరో…
కేవలం తొమ్మిది రోజుల్లో ది ప్యారడైజ్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. విపరీతమైన అంచనాలతో పాటు ఒత్తిడి కూడా అదే స్థాయిలో…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్…
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…