Trends

ప్రాణాలు కాపాడిన వాళ్లకు పంత్ ఏమిచ్చాడు?

భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఆడతాడని.. టీమ్ ఇండియా జెర్సీలో కనిపిస్తాడని చాలామంది ఊహించలేదు. రెండేళ్ల కిందట అతడికి అంత పెద్ద ప్రమాదం జరిగింది. 2022 డిసెంబరులో తెల్లవారుజామున ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు తనే కారు డ్రైవ్ చేసుకుని వెళ్తుండగా.. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడం.. పంత్ తీవ్ర గాయాలతో కారులో చిక్కుకుపోవడం.. మంటలు చెలరేగి కారు దగ్ధమైపోతున్న దశలో ఎవరో అది చూసి పంత్‌ను బయటికి లాగడం.. చకచకా జరిగాయి.

ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే పంత్.. ఆ మంటల్లో కాలిపోయేవాడు. పంత్‌ను బయటికి తీసి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతడి ప్రాణం నిలిచింది. కానీ తీవ్ర గాయాలతో అతను ఆరు నెలల పాటు మంచం దిగలేదు. అనేక సర్జరీల తర్వాత అతను కోలుకున్నాడు. ఆపై నెమ్మదిగా సాధన చేసి 15 నెలల విరామం తర్వాత ఆటలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు.ఆ ప్రమాదంలో రజత్, నిషు అనే కుర్రాళ్లు పంత్ ప్రాణాన్ని కాపాడారు. ప్రమాదం జరిగిన దగ్గర్లోనే వీళ్లిద్దరూ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వాళ్లు అప్రమత్తం కాకపోయి ఉంటే పంత్ అనేవాడు ఉండేవాడు కాదు.

ఆ రోజు వాళ్లిద్దరూ చేసిన సాయాన్ని గుర్తుంచుకుని పంత్.. ఇద్దరికీ బైకులు కొని ఇచ్చాడట. వాటి మీదే ఇప్పుడు ఆ ఇద్దరూ తిరుగుతున్నారు. రజత్, నిషులకు పంత్ కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‌తో పునరామగనం చేసిన పంత్.. ఢిల్లీ తరఫున బాగానే ఆడాడు. ఆపై టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసి టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆడుతున్నాడు. ఈ రోజు, రేపు జరగనున్న ఐపీఎల్ వేలంలో అతడికి భారీ ధర పలుకుతుందనే అంచనాలున్నాయి.

This post was last modified on November 24, 2024 2:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: #RishabPant

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

3 hours ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

5 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

5 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

7 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

7 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

8 hours ago