Trends

ప్రాణాలు కాపాడిన వాళ్లకు పంత్ ఏమిచ్చాడు?

భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఆడతాడని.. టీమ్ ఇండియా జెర్సీలో కనిపిస్తాడని చాలామంది ఊహించలేదు. రెండేళ్ల కిందట అతడికి అంత పెద్ద ప్రమాదం జరిగింది. 2022 డిసెంబరులో తెల్లవారుజామున ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు తనే కారు డ్రైవ్ చేసుకుని వెళ్తుండగా.. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడం.. పంత్ తీవ్ర గాయాలతో కారులో చిక్కుకుపోవడం.. మంటలు చెలరేగి కారు దగ్ధమైపోతున్న దశలో ఎవరో అది చూసి పంత్‌ను బయటికి లాగడం.. చకచకా జరిగాయి.

ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే పంత్.. ఆ మంటల్లో కాలిపోయేవాడు. పంత్‌ను బయటికి తీసి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతడి ప్రాణం నిలిచింది. కానీ తీవ్ర గాయాలతో అతను ఆరు నెలల పాటు మంచం దిగలేదు. అనేక సర్జరీల తర్వాత అతను కోలుకున్నాడు. ఆపై నెమ్మదిగా సాధన చేసి 15 నెలల విరామం తర్వాత ఆటలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు.ఆ ప్రమాదంలో రజత్, నిషు అనే కుర్రాళ్లు పంత్ ప్రాణాన్ని కాపాడారు. ప్రమాదం జరిగిన దగ్గర్లోనే వీళ్లిద్దరూ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వాళ్లు అప్రమత్తం కాకపోయి ఉంటే పంత్ అనేవాడు ఉండేవాడు కాదు.

ఆ రోజు వాళ్లిద్దరూ చేసిన సాయాన్ని గుర్తుంచుకుని పంత్.. ఇద్దరికీ బైకులు కొని ఇచ్చాడట. వాటి మీదే ఇప్పుడు ఆ ఇద్దరూ తిరుగుతున్నారు. రజత్, నిషులకు పంత్ కొంత ఆర్థిక సాయం కూడా చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‌తో పునరామగనం చేసిన పంత్.. ఢిల్లీ తరఫున బాగానే ఆడాడు. ఆపై టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసి టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆడుతున్నాడు. ఈ రోజు, రేపు జరగనున్న ఐపీఎల్ వేలంలో అతడికి భారీ ధర పలుకుతుందనే అంచనాలున్నాయి.

Kumar

Recent Posts

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

53 minutes ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

4 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

4 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

4 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

4 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

4 hours ago