పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, టీమిండియా ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. 5 పరుగుల వద్ద జైశ్వాల్ డకౌట్ అవగా, దేవదత్ పఠికల్ 14 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. హేజిల్వుడ్ బౌలింగ్లో కోహ్లీ కూడా కేవలం 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు.
ఇక ఇదే తరుణంలో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔట్ నిర్ణయం వివాదాస్పదమైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కీపర్ క్యాచ్ అయ్యారన్న కారణంగా థర్డ్ అంపైర్ రాహుల్ను ఔట్గా ప్రకటించాడు, అయితే ఈ నిర్ణయంపై పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇన్ స్వింగర్ బంతిని రాహుల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బంతి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లోకి వెళ్లింది.
స్టార్క్, కీపర్ అప్పీల్ చేయగా ఆన్ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్గా తీర్పు ఇచ్చాడు. అయితే ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెంటనే కీపర్ తో చర్చించి రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ రిప్లేను పరిశీలించాడు. రిప్లేలో బంతి బ్యాట్ను తాకినట్లు స్పైక్ కనిపించినా, బ్యాట్తో పాటు ప్యాడ్ను తాకినప్పుడు శబ్దం వచ్చినట్లు అనుమానం తలెత్తింది. స్పష్టమైన ఫుటేజ్ లేకపోయినా, థర్డ్ అంపైర్ రాహుల్ను ఔట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయం రాహుల్ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.
మరో యాంగిల్ను పరిశీలించకపోవడం తనకు అన్యాయంగా అనిపించిందని రాహుల్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. బంతి నిజంగా బ్యాట్ను తాకిందా లేక ప్యాడ్ను తాకిందా అన్న విషయంపై స్పష్టత లేకపోయినా, ఔట్ ప్రకటించడం వివాదానికి దారితీసింది. రాహుల్ నిరాశగా మైదానాన్ని వీడినప్పుడు భారత అభిమానులు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీక్షకులు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలు తెలిపారు. “అస్పష్టత ఉన్న సందర్భంలో ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని కొనసాగించడం థర్డ్ అంపైర్ బాధ్యత. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది” అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
This post was last modified on November 22, 2024 12:37 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…