Trends

రాహుల్ ఔట్: ఇది న్యాయమేనా?

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టీమిండియా ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. 5 పరుగుల వద్ద జైశ్వాల్ డకౌట్ అవగా, దేవదత్ పఠికల్ 14 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కోహ్లీ కూడా కేవలం 5 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔట్‌ అయ్యాడు.

ఇక ఇదే తరుణంలో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔట్ నిర్ణయం వివాదాస్పదమైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ అయ్యారన్న కారణంగా థర్డ్ అంపైర్ రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు, అయితే ఈ నిర్ణయంపై పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇన్ స్వింగర్ బంతిని రాహుల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బంతి వికెట్ కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లోకి వెళ్లింది.

స్టార్క్, కీపర్ అప్పీల్ చేయగా ఆన్‌ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్‌గా తీర్పు ఇచ్చాడు. అయితే ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెంటనే కీపర్ తో చర్చించి రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ రిప్లేను పరిశీలించాడు. రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పైక్ కనిపించినా, బ్యాట్‌తో పాటు ప్యాడ్‌ను తాకినప్పుడు శబ్దం వచ్చినట్లు అనుమానం తలెత్తింది. స్పష్టమైన ఫుటేజ్ లేకపోయినా, థర్డ్ అంపైర్ రాహుల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం రాహుల్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

మరో యాంగిల్‌ను పరిశీలించకపోవడం తనకు అన్యాయంగా అనిపించిందని రాహుల్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. బంతి నిజంగా బ్యాట్‌ను తాకిందా లేక ప్యాడ్‌ను తాకిందా అన్న విషయంపై స్పష్టత లేకపోయినా, ఔట్ ప్రకటించడం వివాదానికి దారితీసింది. రాహుల్ నిరాశగా మైదానాన్ని వీడినప్పుడు భారత అభిమానులు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీక్షకులు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలు తెలిపారు. “అస్పష్టత ఉన్న సందర్భంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని కొనసాగించడం థర్డ్ అంపైర్ బాధ్యత. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది” అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

3 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

5 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

6 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

7 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

8 hours ago