Trends

భారత గడ్డపై మెస్సీ!

ఇండియన్ ఫుట్ బాల్ అభిమానులకు ఇది గొప్ప వార్త. ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలోనే భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. అర్జెంటీనా జట్టు భాగస్వామ్యంతో కేరళ రాష్ట్రంలో ఒక చారిత్రక అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ విషయాన్ని కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దురహిమన్ బుధవారం స్పష్టం చేశారు.

మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, అర్జెంటీనా జట్టు తమ రాష్ట్రంలో మ్యాచ్ ఆడేందుకు సానుకూలంగా స్పందించిందని, లియోనెల్ మెస్సీ సహా అర్జెంటీనా జట్టులోని స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం కేరళ ఫుట్ బాల్ ప్రియులకు ఒక గుర్తుండిపోయే అనుభవంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ చారిత్రాత్మక మ్యాచ్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం స్థానిక వ్యాపారులు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారని వివరించారు. కేరళలోని ప్రఖ్యాత స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మ్యాచ్ తేదీ, టికెట్ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడు భారత గడ్డపై మ్యాచ్ ఆడడం అరుదైన విషయం. ఇక అర్జెంటీనా జట్టు రాకతో కేరళలో ఫుట్ బాల్ ఉత్సాహం మరింత పెరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెస్సీ అభిమానులు ఇప్పటికే ఈ సమాచారం తెలుసుకుని ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో మెస్సీ రాకపై అభిమానుల చర్చలు ఊపందుకున్నాయి. కేరళలో జరిగే ఈ మ్యాచ్ దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులకు మర్చిపోలేని సందర్భంగా నిలిచే అవకాశం ఉంది.

This post was last modified on November 20, 2024 2:50 pm

Share

Recent Posts

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

1 hour ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

1 hour ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

2 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

2 hours ago

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…

3 hours ago

30 ఏళ్ల కింద‌ట శంకుస్థాప‌న చేసి ఇప్పుడు ప్రారంభిస్తున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క విష‌యాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. 30 ఏళ్ల కింద‌ట తాను చేసిన శంకు స్థాప‌న తాలూకు…

3 hours ago