ఇండియన్ ఫుట్ బాల్ అభిమానులకు ఇది గొప్ప వార్త. ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలోనే భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. అర్జెంటీనా జట్టు భాగస్వామ్యంతో కేరళ రాష్ట్రంలో ఒక చారిత్రక అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ విషయాన్ని కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దురహిమన్ బుధవారం స్పష్టం చేశారు.
మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, అర్జెంటీనా జట్టు తమ రాష్ట్రంలో మ్యాచ్ ఆడేందుకు సానుకూలంగా స్పందించిందని, లియోనెల్ మెస్సీ సహా అర్జెంటీనా జట్టులోని స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం కేరళ ఫుట్ బాల్ ప్రియులకు ఒక గుర్తుండిపోయే అనుభవంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ చారిత్రాత్మక మ్యాచ్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం స్థానిక వ్యాపారులు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారని వివరించారు. కేరళలోని ప్రఖ్యాత స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మ్యాచ్ తేదీ, టికెట్ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడు భారత గడ్డపై మ్యాచ్ ఆడడం అరుదైన విషయం. ఇక అర్జెంటీనా జట్టు రాకతో కేరళలో ఫుట్ బాల్ ఉత్సాహం మరింత పెరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెస్సీ అభిమానులు ఇప్పటికే ఈ సమాచారం తెలుసుకుని ఆనందంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో మెస్సీ రాకపై అభిమానుల చర్చలు ఊపందుకున్నాయి. కేరళలో జరిగే ఈ మ్యాచ్ దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులకు మర్చిపోలేని సందర్భంగా నిలిచే అవకాశం ఉంది.
This post was last modified on November 20, 2024 2:50 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…