ఐపీఎల్ 2025 మెగా వేలం క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ జట్టులో కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ ఈసారి వేలానికి వెళ్తుండటం హాట్ టాపిక్గా మారింది. కీపర్ + బ్యాట్స్ మెన్ కావడంతో అతని ధర 20 కోట్లకు పైనే ఉండవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. అందులోనూ కెప్టెన్ గా అనుభవం ఉన్న ఆటగాడు కాబట్టి ఢిల్లీ, పంజాబ్ లాంటి జట్లు వేలంలో ఆతనిపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో జరిగే మెగా వేలంలో పంత్ను ఏ జట్టు తనదిగా చేసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీ యాజమాన్యం రిషబ్ పంత్ను రిటైన్ చేయకపోవడానికి పలు కారణాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రిటెన్షన్ కోసం పంత్ ఎక్కువ ఫీజు కోరాడని, అది ఫ్రాంచైజీకి ఆమోదయోగ్యం కాలేదని పలువురు అనుకుంటున్నారు.
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా ఇదే తరహాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అలాగే ఢిల్లీ ఫ్రాంచైజీ పంత్ను వేలంలోనే తిరిగి కొనుగోలు చేయాలని చూస్తుందని ఎందుకంటే వారు కొత్తగా కెప్టెన్ను వెతుక్కోవడం కష్టమైన విషయం..అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షోలో తెలిపారు. ఇక సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రిషబ్ పంత్ స్వయంగా స్పందించాడు. “నా రిటెన్షన్ విషయంలో డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు. అదే కచ్చితంగా చెప్పగలను” అంటూ గావస్కర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.
అయితే విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం పంత్ భయటపెట్టలేదు. పంత్ సమాధానం క్రికెట్ అభిమానుల మధ్య చర్చలకు దారితీసింది. ఇక మరోవైపు వేలంలో రిషబ్ పంత్ను దక్కించుకోవడానికి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పోటీ పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, పంత్ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా నిలవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on November 20, 2024 7:07 am
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…