Trends

ఢిల్లీతో విడిపోవడానికి కారణం డబ్బు కాదు: పంత్

ఐపీఎల్ 2025 మెగా వేలం క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ జట్టులో కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ ఈసారి వేలానికి వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. కీపర్ + బ్యాట్స్ మెన్ కావడంతో అతని ధర 20 కోట్లకు పైనే ఉండవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. అందులోనూ కెప్టెన్ గా అనుభవం ఉన్న ఆటగాడు కాబట్టి ఢిల్లీ, పంజాబ్ లాంటి జట్లు వేలంలో ఆతనిపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో జరిగే మెగా వేలంలో పంత్‌ను ఏ జట్టు తనదిగా చేసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీ యాజమాన్యం రిషబ్ పంత్‌ను రిటైన్ చేయకపోవడానికి పలు కారణాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రిటెన్షన్ కోసం పంత్ ఎక్కువ ఫీజు కోరాడని, అది ఫ్రాంచైజీకి ఆమోదయోగ్యం కాలేదని పలువురు అనుకుంటున్నారు.

భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా ఇదే తరహాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అలాగే ఢిల్లీ ఫ్రాంచైజీ పంత్‌ను వేలంలోనే తిరిగి కొనుగోలు చేయాలని చూస్తుందని ఎందుకంటే వారు కొత్తగా కెప్టెన్‌ను వెతుక్కోవడం కష్టమైన విషయం..అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షోలో తెలిపారు. ఇక సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రిషబ్ పంత్ స్వయంగా స్పందించాడు. “నా రిటెన్షన్ విషయంలో డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు. అదే కచ్చితంగా చెప్పగలను” అంటూ గావస్కర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.

అయితే విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం పంత్ భయటపెట్టలేదు. పంత్ సమాధానం క్రికెట్ అభిమానుల మధ్య చర్చలకు దారితీసింది. ఇక మరోవైపు వేలంలో రిషబ్ పంత్‌ను దక్కించుకోవడానికి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పోటీ పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, పంత్ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా నిలవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 20, 2024 7:07 am

Share

Recent Posts

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

1 hour ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

3 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

3 hours ago

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

3 hours ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

4 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

5 hours ago