Trends

ఢిల్లీతో విడిపోవడానికి కారణం డబ్బు కాదు: పంత్

ఐపీఎల్ 2025 మెగా వేలం క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ జట్టులో కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ ఈసారి వేలానికి వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. కీపర్ + బ్యాట్స్ మెన్ కావడంతో అతని ధర 20 కోట్లకు పైనే ఉండవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. అందులోనూ కెప్టెన్ గా అనుభవం ఉన్న ఆటగాడు కాబట్టి ఢిల్లీ, పంజాబ్ లాంటి జట్లు వేలంలో ఆతనిపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో జరిగే మెగా వేలంలో పంత్‌ను ఏ జట్టు తనదిగా చేసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీ యాజమాన్యం రిషబ్ పంత్‌ను రిటైన్ చేయకపోవడానికి పలు కారణాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రిటెన్షన్ కోసం పంత్ ఎక్కువ ఫీజు కోరాడని, అది ఫ్రాంచైజీకి ఆమోదయోగ్యం కాలేదని పలువురు అనుకుంటున్నారు.

భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా ఇదే తరహాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అలాగే ఢిల్లీ ఫ్రాంచైజీ పంత్‌ను వేలంలోనే తిరిగి కొనుగోలు చేయాలని చూస్తుందని ఎందుకంటే వారు కొత్తగా కెప్టెన్‌ను వెతుక్కోవడం కష్టమైన విషయం..అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షోలో తెలిపారు. ఇక సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రిషబ్ పంత్ స్వయంగా స్పందించాడు. “నా రిటెన్షన్ విషయంలో డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు. అదే కచ్చితంగా చెప్పగలను” అంటూ గావస్కర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.

అయితే విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం పంత్ భయటపెట్టలేదు. పంత్ సమాధానం క్రికెట్ అభిమానుల మధ్య చర్చలకు దారితీసింది. ఇక మరోవైపు వేలంలో రిషబ్ పంత్‌ను దక్కించుకోవడానికి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పోటీ పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, పంత్ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా నిలవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 20, 2024 7:07 am

Share

Recent Posts

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

39 minutes ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

1 hour ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

1 hour ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

2 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

4 hours ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

4 hours ago