Trends

ఢిల్లీతో విడిపోవడానికి కారణం డబ్బు కాదు: పంత్

ఐపీఎల్ 2025 మెగా వేలం క్రీడాభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ జట్టులో కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ ఈసారి వేలానికి వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. కీపర్ + బ్యాట్స్ మెన్ కావడంతో అతని ధర 20 కోట్లకు పైనే ఉండవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. అందులోనూ కెప్టెన్ గా అనుభవం ఉన్న ఆటగాడు కాబట్టి ఢిల్లీ, పంజాబ్ లాంటి జట్లు వేలంలో ఆతనిపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో జరిగే మెగా వేలంలో పంత్‌ను ఏ జట్టు తనదిగా చేసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీ యాజమాన్యం రిషబ్ పంత్‌ను రిటైన్ చేయకపోవడానికి పలు కారణాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రిటెన్షన్ కోసం పంత్ ఎక్కువ ఫీజు కోరాడని, అది ఫ్రాంచైజీకి ఆమోదయోగ్యం కాలేదని పలువురు అనుకుంటున్నారు.

భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా ఇదే తరహాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అలాగే ఢిల్లీ ఫ్రాంచైజీ పంత్‌ను వేలంలోనే తిరిగి కొనుగోలు చేయాలని చూస్తుందని ఎందుకంటే వారు కొత్తగా కెప్టెన్‌ను వెతుక్కోవడం కష్టమైన విషయం..అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ షోలో తెలిపారు. ఇక సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో రిషబ్ పంత్ స్వయంగా స్పందించాడు. “నా రిటెన్షన్ విషయంలో డబ్బుతో ఎలాంటి సంబంధం లేదు. అదే కచ్చితంగా చెప్పగలను” అంటూ గావస్కర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.

అయితే విడిపోవడానికి గల అసలు కారణం మాత్రం పంత్ భయటపెట్టలేదు. పంత్ సమాధానం క్రికెట్ అభిమానుల మధ్య చర్చలకు దారితీసింది. ఇక మరోవైపు వేలంలో రిషబ్ పంత్‌ను దక్కించుకోవడానికి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పోటీ పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, పంత్ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా నిలవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 20, 2024 7:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

10 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

10 hours ago

జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…

10 hours ago

‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…

10 hours ago

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం…

11 hours ago

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు.…

12 hours ago