కోడి ముందా? గుడ్డు ముందా? అనేది ఇప్పటి వరకు తర్కానికి అందని చిక్కు ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే గుడ్డులో నుంచేకోడి వస్తుంది.. కాబట్టి గుడ్డు ముందు.. అని తీర్మానం చేయాలంటే.. అసలు కోడి లేకుండా గుడ్డు ఎక్కడ నుంచివచ్చింది? అనేది వెంటనే తెరమీదికి వచ్చే ప్రశ్న. దీంతో అసలు సమాధానం దొరకని ప్రశ్నగానే ఇది శతాబ్దాలుగా ఉండిపోయింది. అంతేకాదు.. సామెతగా కూడా.. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉండిపోయింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్నవాళ్లు సలహా ఇస్తే.. నువ్వు ముందా? నేను ముందా? అనే విధంగా ఈ సామెతను వినియోగించడం పరిపాటిగా మారింది.
అయితే.. ఇప్పుడు ఈ తర్కానికి కూడా శాస్త్రవేత్తలు ఆన్సర్ చెప్పేశారు. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే..గుడ్డే ముందని తేల్చేశారు శాస్త్రవేత్తలు. దీనికి కారణం.. పురాతన ఏకకణ జీవులను పరిశీలించినప్పుడు.. ఆయా కణాల్లో గుడ్డు లక్షణాలు కనిపించాయి. దీంతో గుడ్డే ముందు ఉండి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఎలా గుర్తించారు?
కణ విభజన చేసినప్పుడు జంతువుల పిండాన్ని పోలి ఉండే కణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది.. పూర్వ ఏకకణ జీవిలో ఉందని గుర్తించారు. ఈ క్రమంలోనే జంతువుల పరిణామానికి ముందు పిండం(గుడ్డు) అభివృద్ధి చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన పురాణాలు కూడా.. అండమే(గుడ్డు) ముందు జనించిందని చెబుతుండడం గమనార్హం. ప్రధానంగా భూమి అండాకారంలో ఉందని వేదమే చెబుతోంది. దీనిలో నుంచే వివిధ రూపాలు జనించాయన్నది శాస్త్రం చెబుతున్న మాట.
ఇక, శాస్త్రవేత్తలు తొలుత భూమి గోళాకారంగా ఉందని భావించినా.. తర్వాత అండాకారంలో ఒకవైపు(ఉత్తరం వైపు) నొక్కబడి ఉందని గుర్తించారు. సో.. సృష్టి పరిణామం కూడా అండం నుంచే మొదలైందన్న భావనకు మద్దతు లభించింది. ఇప్పుడు కోడి ముందా? గుడ్డు ముందా? అన్న తర్కంలోనూ బహుశ ఈ సూత్రమే పనిచేసి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి సుదీర్ఘ కాలంగా ఉన్న చిక్కు ప్రశ్నకు కణ శాస్త్ర వేత్తలు(సెల్యూలర్ సైంటిస్ట్స్) సమాధానం చెప్పడం విశేషం.
This post was last modified on November 20, 2024 11:24 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…