కోడి ముందా? గుడ్డు ముందా? అనేది ఇప్పటి వరకు తర్కానికి అందని చిక్కు ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే గుడ్డులో నుంచేకోడి వస్తుంది.. కాబట్టి గుడ్డు ముందు.. అని తీర్మానం చేయాలంటే.. అసలు కోడి లేకుండా గుడ్డు ఎక్కడ నుంచివచ్చింది? అనేది వెంటనే తెరమీదికి వచ్చే ప్రశ్న. దీంతో అసలు సమాధానం దొరకని ప్రశ్నగానే ఇది శతాబ్దాలుగా ఉండిపోయింది. అంతేకాదు.. సామెతగా కూడా.. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉండిపోయింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్నవాళ్లు సలహా ఇస్తే.. నువ్వు ముందా? నేను ముందా? అనే విధంగా ఈ సామెతను వినియోగించడం పరిపాటిగా మారింది.
అయితే.. ఇప్పుడు ఈ తర్కానికి కూడా శాస్త్రవేత్తలు ఆన్సర్ చెప్పేశారు. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే..గుడ్డే ముందని తేల్చేశారు శాస్త్రవేత్తలు. దీనికి కారణం.. పురాతన ఏకకణ జీవులను పరిశీలించినప్పుడు.. ఆయా కణాల్లో గుడ్డు లక్షణాలు కనిపించాయి. దీంతో గుడ్డే ముందు ఉండి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఎలా గుర్తించారు?
కణ విభజన చేసినప్పుడు జంతువుల పిండాన్ని పోలి ఉండే కణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది.. పూర్వ ఏకకణ జీవిలో ఉందని గుర్తించారు. ఈ క్రమంలోనే జంతువుల పరిణామానికి ముందు పిండం(గుడ్డు) అభివృద్ధి చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన పురాణాలు కూడా.. అండమే(గుడ్డు) ముందు జనించిందని చెబుతుండడం గమనార్హం. ప్రధానంగా భూమి అండాకారంలో ఉందని వేదమే చెబుతోంది. దీనిలో నుంచే వివిధ రూపాలు జనించాయన్నది శాస్త్రం చెబుతున్న మాట.
ఇక, శాస్త్రవేత్తలు తొలుత భూమి గోళాకారంగా ఉందని భావించినా.. తర్వాత అండాకారంలో ఒకవైపు(ఉత్తరం వైపు) నొక్కబడి ఉందని గుర్తించారు. సో.. సృష్టి పరిణామం కూడా అండం నుంచే మొదలైందన్న భావనకు మద్దతు లభించింది. ఇప్పుడు కోడి ముందా? గుడ్డు ముందా? అన్న తర్కంలోనూ బహుశ ఈ సూత్రమే పనిచేసి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి సుదీర్ఘ కాలంగా ఉన్న చిక్కు ప్రశ్నకు కణ శాస్త్ర వేత్తలు(సెల్యూలర్ సైంటిస్ట్స్) సమాధానం చెప్పడం విశేషం.
This post was last modified on November 20, 2024 11:24 am
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…