Trends

కోడి ముందా? గుడ్డు ముందా? తెలిసిపోయింది!

కోడి ముందా? గుడ్డు ముందా? అనేది ఇప్ప‌టి వ‌ర‌కు త‌ర్కానికి అంద‌ని చిక్కు ప్ర‌శ్న‌గానే ఉంది. ఎందుకంటే గుడ్డులో నుంచేకోడి వ‌స్తుంది.. కాబ‌ట్టి గుడ్డు ముందు.. అని తీర్మానం చేయాలంటే.. అస‌లు కోడి లేకుండా గుడ్డు ఎక్క‌డ నుంచివ‌చ్చింది? అనేది వెంట‌నే తెర‌మీదికి వ‌చ్చే ప్ర‌శ్న‌. దీంతో అస‌లు స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌గానే ఇది శ‌తాబ్దాలుగా ఉండిపోయింది. అంతేకాదు.. సామెత‌గా కూడా.. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఉండిపోయింది. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు చిన్న‌వాళ్లు స‌లహా ఇస్తే.. నువ్వు ముందా? నేను ముందా? అనే విధంగా ఈ సామెతను వినియోగించ‌డం ప‌రిపాటిగా మారింది.

అయితే.. ఇప్పుడు ఈ త‌ర్కానికి కూడా శాస్త్ర‌వేత్త‌లు ఆన్స‌ర్ చెప్పేశారు. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే..గుడ్డే ముంద‌ని తేల్చేశారు శాస్త్ర‌వేత్త‌లు. దీనికి కార‌ణం.. పురాత‌న ఏక‌క‌ణ జీవుల‌ను ప‌రిశీలించిన‌ప్పుడు.. ఆయా క‌ణాల్లో గుడ్డు ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో గుడ్డే ముందు ఉండి ఉంటుంద‌ని ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు.

ఎలా గుర్తించారు?
క‌ణ విభ‌జ‌న చేసినప్పుడు జంతువుల పిండాన్ని పోలి ఉండే కణాలను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఇది.. పూర్వ ఏకకణ జీవిలో ఉంద‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే జంతువుల పరిణామానికి ముందు పిండం(గుడ్డు) అభివృద్ధి చెంది ఉండవచ్చని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు. మ‌న పురాణాలు కూడా.. అండ‌మే(గుడ్డు) ముందు జ‌నించింద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా భూమి అండాకారంలో ఉంద‌ని వేద‌మే చెబుతోంది. దీనిలో నుంచే వివిధ రూపాలు జ‌నించాయ‌న్న‌ది శాస్త్రం చెబుతున్న మాట‌.

ఇక‌, శాస్త్ర‌వేత్త‌లు తొలుత భూమి గోళాకారంగా ఉంద‌ని భావించినా.. త‌ర్వాత అండాకారంలో ఒక‌వైపు(ఉత్త‌రం వైపు) నొక్క‌బ‌డి ఉంద‌ని గుర్తించారు. సో.. సృష్టి ప‌రిణామం కూడా అండం నుంచే మొదలైంద‌న్న భావ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించింది. ఇప్పుడు కోడి ముందా? గుడ్డు ముందా? అన్న త‌ర్కంలోనూ బ‌హుశ ఈ సూత్ర‌మే ప‌నిచేసి ఉంటుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి సుదీర్ఘ కాలంగా ఉన్న చిక్కు ప్ర‌శ్న‌కు క‌ణ శాస్త్ర వేత్త‌లు(సెల్యూల‌ర్ సైంటిస్ట్స్‌) స‌మాధానం చెప్ప‌డం విశేషం.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago