అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) గత ఐదు నెలలుగా ఉంటున్నారు. వీరిని తిరిగి భూమికి తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్లైనర్ వాహన నౌక సాంకేతిక లోపాల కారణంగా మిషన్ వాయిదాపడింది. నాసా ప్రకారం, వచ్చే ఫిబ్రవరి వరకు వీరు అంతరిక్ష కేంద్రంలోనే కొనసాగనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వ్యోమగాములు ఐఎస్ఎస్లో ఎలా జీవిస్తున్నారు, ఏమి తింటున్నారు అన్నదానిపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన చిత్రాల్లో సునీతా విలియమ్స్ కాస్త బలహీనంగా కనిపించడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. ఐఎస్ఎస్లో వీరికి అందించబడే ఆహారం గురించి నాసా కొన్ని వివరాలు వెల్లడించింది. సునీతా విలియమ్స్, విల్మోర్ పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యల కాక్టెయిల్స్ వంటి వంటకాలను తింటున్నారు.
దీనితో పాటు తక్కువ మొత్తంలో తాజా పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి నాసా పంపుతుంటుంది. ప్రత్యేక ప్యాకింగ్ చేయబడిన ఈ పదార్థాలు గడ్డకట్టిన లేదా ఎండిన స్థితిలో ఉంటాయి. అంతరిక్ష కేంద్రంలో ఆహారం తినడానికి అవసరమైన వాటిని స్పెషల్ ట్రేలలో అందిస్తారు. మాంసం, గుడ్లు వంటి పదార్థాలు భూమిపైనే వండుతారు, వాటిని అక్కడి ఫుడ్ వార్మర్లో మళ్లీ వేడి చేసుకుని తింటారు. డీహైడ్రేటెడ్ సూప్లు, క్యాసరోల్స్ల కోసం కావలసిన నీటిని ఐఎస్ఎస్లోని ప్రత్యేక నీటి ట్యాంక్ల నుంచి అందిస్తారు. వీరి ఆహారం శారీరక అవసరాలకు అనుగుణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, నాసా వైద్యులు ప్రతి రోజు వీరి ఆహారంలో సరిపడే కేలరీలు ఉంటున్నాయా లేదా అన్నది నిర్ధారించుకుంటారు. ఈ చర్యల వల్లే వ్యోమగాములు అంతరిక్షంలో సురక్షితంగా ఉండగలుగుతున్నారు. ఐఎస్ఎస్లో వీరి సాహసయాత్ర ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగనుంది. ఈ మిషన్ సాంకేతిక సమస్యలను అధిగమించి విజయవంతం అవుతుందని నాసా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
This post was last modified on November 19, 2024 3:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…