అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) గత ఐదు నెలలుగా ఉంటున్నారు. వీరిని తిరిగి భూమికి తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్లైనర్ వాహన నౌక సాంకేతిక లోపాల కారణంగా మిషన్ వాయిదాపడింది. నాసా ప్రకారం, వచ్చే ఫిబ్రవరి వరకు వీరు అంతరిక్ష కేంద్రంలోనే కొనసాగనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వ్యోమగాములు ఐఎస్ఎస్లో ఎలా జీవిస్తున్నారు, ఏమి తింటున్నారు అన్నదానిపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన చిత్రాల్లో సునీతా విలియమ్స్ కాస్త బలహీనంగా కనిపించడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది. ఐఎస్ఎస్లో వీరికి అందించబడే ఆహారం గురించి నాసా కొన్ని వివరాలు వెల్లడించింది. సునీతా విలియమ్స్, విల్మోర్ పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యల కాక్టెయిల్స్ వంటి వంటకాలను తింటున్నారు.
దీనితో పాటు తక్కువ మొత్తంలో తాజా పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి నాసా పంపుతుంటుంది. ప్రత్యేక ప్యాకింగ్ చేయబడిన ఈ పదార్థాలు గడ్డకట్టిన లేదా ఎండిన స్థితిలో ఉంటాయి. అంతరిక్ష కేంద్రంలో ఆహారం తినడానికి అవసరమైన వాటిని స్పెషల్ ట్రేలలో అందిస్తారు. మాంసం, గుడ్లు వంటి పదార్థాలు భూమిపైనే వండుతారు, వాటిని అక్కడి ఫుడ్ వార్మర్లో మళ్లీ వేడి చేసుకుని తింటారు. డీహైడ్రేటెడ్ సూప్లు, క్యాసరోల్స్ల కోసం కావలసిన నీటిని ఐఎస్ఎస్లోని ప్రత్యేక నీటి ట్యాంక్ల నుంచి అందిస్తారు. వీరి ఆహారం శారీరక అవసరాలకు అనుగుణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, నాసా వైద్యులు ప్రతి రోజు వీరి ఆహారంలో సరిపడే కేలరీలు ఉంటున్నాయా లేదా అన్నది నిర్ధారించుకుంటారు. ఈ చర్యల వల్లే వ్యోమగాములు అంతరిక్షంలో సురక్షితంగా ఉండగలుగుతున్నారు. ఐఎస్ఎస్లో వీరి సాహసయాత్ర ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగనుంది. ఈ మిషన్ సాంకేతిక సమస్యలను అధిగమించి విజయవంతం అవుతుందని నాసా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
This post was last modified on November 19, 2024 3:25 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…