Trends

పసికందుల దహనం.. ఇంత నిర్లక్ష్యమా?

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో యూనిట్‌లో మొత్తం 52 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మంటలు చెలరేగిన వెంటనే తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు, కానీ కొన్ని చిన్నారులను రక్షించలేకపోయారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. మెడికల్ కాలేజీల్లో భద్రతా ప్రమాణాలపై మరింత కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పంసించడంతో విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.

ప్రమాదానికి కారణంగా ఓ నర్సు నిర్లక్ష్యమే కారణమని, ఆక్సిజన్ సిలిండర్ పక్కన అగ్గిపుల్లలు వెలిగించడం వల్లే మంటలు వ్యాపించాయని అక్కడ ఉన్న భగవాన్ దాస్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ సంఘటనలో తాను నలుగురు పిల్లలను కాపాడానని, మరికొంత మందిని సహాయం తీసుకుని బయటికి తరలించామని ఆయన వివరించారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. విచారణ జరుపుతున్నట్లు ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ తెలిపారు.

ఆరోగ్యశాఖ, పోలీసు శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠక్ హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించింది. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోవడం సహించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కుటుంబాలు న్యాయం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

7 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

36 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago