Trends

పసికందుల దహనం.. ఇంత నిర్లక్ష్యమా?

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో యూనిట్‌లో మొత్తం 52 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మంటలు చెలరేగిన వెంటనే తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు, కానీ కొన్ని చిన్నారులను రక్షించలేకపోయారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. మెడికల్ కాలేజీల్లో భద్రతా ప్రమాణాలపై మరింత కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పంసించడంతో విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.

ప్రమాదానికి కారణంగా ఓ నర్సు నిర్లక్ష్యమే కారణమని, ఆక్సిజన్ సిలిండర్ పక్కన అగ్గిపుల్లలు వెలిగించడం వల్లే మంటలు వ్యాపించాయని అక్కడ ఉన్న భగవాన్ దాస్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ సంఘటనలో తాను నలుగురు పిల్లలను కాపాడానని, మరికొంత మందిని సహాయం తీసుకుని బయటికి తరలించామని ఆయన వివరించారు. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. విచారణ జరుపుతున్నట్లు ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ తెలిపారు.

ఆరోగ్యశాఖ, పోలీసు శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో దర్యాప్తు కొనసాగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠక్ హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ప్రకటించింది. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోవడం సహించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కుటుంబాలు న్యాయం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

This post was last modified on November 18, 2024 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అతడు స్టామినాని వృథా చేస్తున్నారు

ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…

1 hour ago

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

3 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

4 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

5 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

6 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

6 hours ago