Trends

మహారాష్ట్ర లో పవన్ ప్రచారం హిట్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడిన విధానం అక్కడి జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా హిందువులపై జరిగిన దాడులపై ఆయన స్పందించిన తీరుకూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్ గా పాకిస్థాన్‌లో జరిగిన దాడులపై కూడా పవన్ స్పందించారు. 15 ఏళ్ల హేమ, 17 ఏళ్ల వెంటి అనే ఇద్దరు హిందూ బాలికలు పాకిస్థాన్ లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయవిదారకమని, ఇలాంటి వార్తలు కలవరపెడుతున్నాయని పవన్ అన్నారు. పవన్ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “మన హిందూ సోదరీమణులు ఇలాంటి దుర్మార్గాలకు బలవ్వడం ఎంతో బాధాకరం. హేమ, వెంటి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల ఎదుర్కొంటున్న వివక్ష, వేధింపులు తనను పదే పదే కలచివేస్తున్నాయని పవన్ లాంటి ప్రముఖులు మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

హిందూ మహిళలు, బాలికలు దాడులకు గురవుతుండటంపై ప్రపంచమంతా స్పందించాలని హిందూ మత సంస్థలు కోరుతున్నాయి. హిందూ మైనారిటీలపై జరుగుతున్న ఈ వేధింపులను ఆపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. హేమ, వెంటిల ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంస్థలు అభ్యర్థిస్తున్నాయి.

This post was last modified on November 18, 2024 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

44 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago