Trends

ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కి కాఫీ బ్రేక్‌లోనే..

ఇండియా నుంచి అమెరికా విమాన ప్రయాణానికి 18 గంటలు పడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? అయితే త్వరలో అది కేవలం నిమిషాల్లోనే పూర్తవుతుందంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ, టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న ఎలాన్ మస్క్ ఈ అద్భుతాన్ని నిజం చేస్తానంటున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా మస్క్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవం తీసుకురాబోతున్నారు.

మస్క్ తన కొత్త ప్రాజెక్ట్ గురించి చెబుతూ, రాకెట్ టెక్నాలజీని వినియోగించి ప్రపంచంలోని ఏ దేశానికైనా కేవలం 30-40 నిమిషాల్లో చేరే సదుపాయాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. స్టార్ షిప్ రాకెట్ సాయంతో, న్యూయార్క్ నుంచి ఢిల్లీకి కేవలం 40 నిమిషాల్లోనే ప్రయాణం చేయవచ్చని మస్క్ చెప్పారు. ఈ ప్రకటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సాధారణంగా విమానం ద్వారా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయడానికి 16 గంటల సమయం పడుతుంది. కానీ, మస్క్ ప్రణాళిక ప్రకారం, రాకెట్ భూమి కక్ష్యకు చేరి, అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళ్లి నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తిచేస్తుంది. ఈ టెక్నాలజీతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. మస్క్ గతంలో దీనిపై సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కొత్త పుంతలు తొక్కుతోంది.

సాధారణ విమానాలను ఉపయోగించకుండా రాకెట్ ద్వారా ప్రయాణం చేయడం వినూత్నంగా ఉంటుంది. రాకెట్ స్పీడ్ మరియు కష్టతరమైన ప్రయాణ మార్గాల ద్వారా ఇది సాధ్యమవుతుందని మస్క్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. అయితే, మస్క్ చేస్తున్న ప్రయత్నాలు చూసి, ఇది భవిష్యత్తులో కొత్త ప్రయాణ యుగానికి నాంది అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాకెట్ ప్రయాణం ద్వారా ప్రపంచం మరింత దగ్గరవుతుందన్న నమ్మకం బలపడుతోంది. మస్క్ చేసిన ఈ ప్రకటన, టెక్నాలజీపై ఉన్న గౌరవాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 18, 2024 12:27 pm

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

11 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

3 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

4 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

9 hours ago