Trends

ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కి కాఫీ బ్రేక్‌లోనే..

ఇండియా నుంచి అమెరికా విమాన ప్రయాణానికి 18 గంటలు పడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? అయితే త్వరలో అది కేవలం నిమిషాల్లోనే పూర్తవుతుందంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ, టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న ఎలాన్ మస్క్ ఈ అద్భుతాన్ని నిజం చేస్తానంటున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా మస్క్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవం తీసుకురాబోతున్నారు.

మస్క్ తన కొత్త ప్రాజెక్ట్ గురించి చెబుతూ, రాకెట్ టెక్నాలజీని వినియోగించి ప్రపంచంలోని ఏ దేశానికైనా కేవలం 30-40 నిమిషాల్లో చేరే సదుపాయాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. స్టార్ షిప్ రాకెట్ సాయంతో, న్యూయార్క్ నుంచి ఢిల్లీకి కేవలం 40 నిమిషాల్లోనే ప్రయాణం చేయవచ్చని మస్క్ చెప్పారు. ఈ ప్రకటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సాధారణంగా విమానం ద్వారా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయడానికి 16 గంటల సమయం పడుతుంది. కానీ, మస్క్ ప్రణాళిక ప్రకారం, రాకెట్ భూమి కక్ష్యకు చేరి, అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళ్లి నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తిచేస్తుంది. ఈ టెక్నాలజీతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. మస్క్ గతంలో దీనిపై సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కొత్త పుంతలు తొక్కుతోంది.

సాధారణ విమానాలను ఉపయోగించకుండా రాకెట్ ద్వారా ప్రయాణం చేయడం వినూత్నంగా ఉంటుంది. రాకెట్ స్పీడ్ మరియు కష్టతరమైన ప్రయాణ మార్గాల ద్వారా ఇది సాధ్యమవుతుందని మస్క్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. అయితే, మస్క్ చేస్తున్న ప్రయత్నాలు చూసి, ఇది భవిష్యత్తులో కొత్త ప్రయాణ యుగానికి నాంది అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాకెట్ ప్రయాణం ద్వారా ప్రపంచం మరింత దగ్గరవుతుందన్న నమ్మకం బలపడుతోంది. మస్క్ చేసిన ఈ ప్రకటన, టెక్నాలజీపై ఉన్న గౌరవాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

3 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

5 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

6 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

7 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

8 hours ago