Trends

ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కి కాఫీ బ్రేక్‌లోనే..

ఇండియా నుంచి అమెరికా విమాన ప్రయాణానికి 18 గంటలు పడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? అయితే త్వరలో అది కేవలం నిమిషాల్లోనే పూర్తవుతుందంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ, టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న ఎలాన్ మస్క్ ఈ అద్భుతాన్ని నిజం చేస్తానంటున్నారు. స్పేస్ ఎక్స్ ద్వారా మస్క్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణ రంగంలో విప్లవం తీసుకురాబోతున్నారు.

మస్క్ తన కొత్త ప్రాజెక్ట్ గురించి చెబుతూ, రాకెట్ టెక్నాలజీని వినియోగించి ప్రపంచంలోని ఏ దేశానికైనా కేవలం 30-40 నిమిషాల్లో చేరే సదుపాయాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. స్టార్ షిప్ రాకెట్ సాయంతో, న్యూయార్క్ నుంచి ఢిల్లీకి కేవలం 40 నిమిషాల్లోనే ప్రయాణం చేయవచ్చని మస్క్ చెప్పారు. ఈ ప్రకటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సాధారణంగా విమానం ద్వారా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయడానికి 16 గంటల సమయం పడుతుంది. కానీ, మస్క్ ప్రణాళిక ప్రకారం, రాకెట్ భూమి కక్ష్యకు చేరి, అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళ్లి నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తిచేస్తుంది. ఈ టెక్నాలజీతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. మస్క్ గతంలో దీనిపై సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కొత్త పుంతలు తొక్కుతోంది.

సాధారణ విమానాలను ఉపయోగించకుండా రాకెట్ ద్వారా ప్రయాణం చేయడం వినూత్నంగా ఉంటుంది. రాకెట్ స్పీడ్ మరియు కష్టతరమైన ప్రయాణ మార్గాల ద్వారా ఇది సాధ్యమవుతుందని మస్క్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. అయితే, మస్క్ చేస్తున్న ప్రయత్నాలు చూసి, ఇది భవిష్యత్తులో కొత్త ప్రయాణ యుగానికి నాంది అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాకెట్ ప్రయాణం ద్వారా ప్రపంచం మరింత దగ్గరవుతుందన్న నమ్మకం బలపడుతోంది. మస్క్ చేసిన ఈ ప్రకటన, టెక్నాలజీపై ఉన్న గౌరవాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on November 18, 2024 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

24 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

60 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago