ఎలాన్ మస్క్.. టెస్లా కార్ల కంపెనీ అధినేతగానే కాదు.. ట్విట్టర్ దిగ్గజం, స్పేస్ ఎక్స్(అంతరిక్ష కేంద్రం) వంటి అనేక వ్యాపాలతో ఆయన దూసుకుపోతున్నారు. ప్రపంచ కుబేరుడిగా కూడా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే.. ఆయన ఆదాయం ఇప్పుడు మరిన్ని రెట్లు పెరిగింది. అసలు హద్దులు దాటిపోయిందనే అంటున్నాయి వాణిజ్య వర్గాలు. దీనికి కారణం.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మస్క్ ఆది నుంచి కూడా.. రిపబ్లికన్ పార్టీ నాయకుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను సమర్థిస్తున్న విషయం తెలిసిందే. కేవలం సమర్థనే కాదు.. ఆయనే ట్రంప్ ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
ఈ క్రమంలోనే వారానికి కోట్ల రూపాయల చొప్పున ఎన్నికల విరాళాలు విరజిమ్మారు. అక్కడితోనూ ఆగలేదు.. తన ఎక్స్ ఖాతాను.. కేవలం ట్రంప్ అనుకూల పరివారానికి మాత్రమే పరిమితం చేశారు. ట్రంప్ ప్రత్యర్థులు డెమొక్రాట్లకు అసలు ఎక్స్లో చోటు కల్పించేందుకు కూడా ఇష్టపడలేదు. అదేసమయంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించి. ఎక్స్లో ట్రంప్-మస్క్లు చేసిన ప్రచారం దుమ్మురేపింది. నిరంతరం.. ఏదో ఒక వినూత్నను ప్రదర్శించిన మస్క్.. ఆద్యంతం కూడా ట్రంప్ కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకానొక దశలో డెమొక్రాట్లను సమర్థిస్తున్న ‘గూగుల్కే’ హెచ్చరికలు జారీ చేశారు.
అంతేకాదు.. ఈవీఎంలను తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టుకు కూడా వెళ్లి.. దీనిని రద్దు చేయించి.. బ్యాలెట్ను తీసుకువచ్చే విషయంలో మస్క్ చాలనే ఇబ్బందులు పడ్డారు. అయినా.. తన ఫ్రెండ్, పార్టనర్ ట్రంప్ కోసం.. ఆయన ఎన్నో చేశారు. చివరకు మస్క్ తన తల్లిని కూడా మీడియా ముందుకు తీసుకువచ్చారు. ట్రంప్కు అనుకూలంగా ప్రచారం చేయించారు. ఇలా .. తనదైన శైలిలో మస్క్ ట్రంప్కు అన్ని విధాలా సాయం చేశారు. ఇక, ఇప్పుడు మస్క్ అనుకున్న లక్ష్యం నెరవేరింది. ట్రంప్ ఘన విజయం సాధించారు.
ఎలా పెరిగాయి?
ట్రంప్ విజయంతో మస్క్ వ్యాపారాలకు తిరుగులేదన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ట్రంప్ సర్కారు ఎలాంటి అడ్డంకులు లేని విధానాన్ని మస్క్కోసం తెచ్చినా ఆశ్చర్యం లేదు. దీంతో మస్క్ వ్యాపారాలన్నీ.. స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా పుంజుకున్నారు. ఇప్పటి వరకు ఉన్నవన్నీ.. లాభాల జోష్లో కొనసాగుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. మస్క్ చేసిన సాయం.. తనకు ఎవరూ చేయలేదని.. ట్రంప్ చెప్పడం.. గమనార్హం. అంతేకాదు.. మస్క్కు తాను రుణ పడిపోతానని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం మస్క్ వ్యాపార సామ్రాజ్యం పుంజుకోవడం మరో విశేషం.
This post was last modified on November 7, 2024 9:27 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…