Trends

బంగ్లాదేశ్ హిందువుల ఉగ్ర నిరసన

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులు ప్రస్తుతం దాడుల బెడదను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా హిందూ సముదాయం పై జరగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిస్థితుల్లో, తమకు భద్రత కల్పించాలని కోరుతూ బంగ్లాదేశ్‌లోని ఛాటోగ్రామ్ నగరంలో పెద్ద ఎత్తున ఉగ్ర నిరసన వ్యక్తం చేశారు.

హిందూ సముదాయానికి చెందిన 30,000 మంది ఒకేసారి రోడ్డెక్కారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. హింసను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, మధ్యంతర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ర్యాలీ సమయంలో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.

ప్రజా శాంతిని కాపాడేందుకు పోలీసులు, సైనికులు ఛాటోగ్రామ్‌లో పటిష్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, హింసాత్మక దాడులు, విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి తాత్కాలికంగా భారత్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామా అనంతరం, బంగ్లాదేశ్‌లో తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం దేశంలో శాంతిని నెలకొల్పి, ప్రజాస్వామ్య స్థిరత్వం కోసం చర్యలు చేపడుతుందని అక్కడి సుప్రీం కోర్టు పేర్కొంది.

యూనస్ నేతృత్వంలో ప్రజా వ్యతిరేకత తగ్గినప్పటికీ, మైనారిటీ హిందూ సముదాయంపై జరుగుతున్న దాడులు ఆగడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక హిందూ సంఘాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. గత ఆగస్టు నుంచి ఈ దాడులు మరింత తీవ్రతరం కావడంతో వేలాది మంది హిందువులు దోపిడీ, దాడులు, ఆస్తి నష్టం వంటి ఘటనలను ఎదుర్కొంటున్నారు. పరిస్థితి అదుపులోకి రావాల్సి ఉందని హిందూ నాయకులు పేర్కొన్నారు.

This post was last modified on November 4, 2024 11:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

31 minutes ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

1 hour ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

2 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

4 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

6 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

7 hours ago