బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు ప్రస్తుతం దాడుల బెడదను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా హిందూ సముదాయం పై జరగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిస్థితుల్లో, తమకు భద్రత కల్పించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఛాటోగ్రామ్ నగరంలో పెద్ద ఎత్తున ఉగ్ర నిరసన వ్యక్తం చేశారు.
హిందూ సముదాయానికి చెందిన 30,000 మంది ఒకేసారి రోడ్డెక్కారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. హింసను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, మధ్యంతర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ర్యాలీ సమయంలో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.
ప్రజా శాంతిని కాపాడేందుకు పోలీసులు, సైనికులు ఛాటోగ్రామ్లో పటిష్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, హింసాత్మక దాడులు, విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి తాత్కాలికంగా భారత్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామా అనంతరం, బంగ్లాదేశ్లో తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం దేశంలో శాంతిని నెలకొల్పి, ప్రజాస్వామ్య స్థిరత్వం కోసం చర్యలు చేపడుతుందని అక్కడి సుప్రీం కోర్టు పేర్కొంది.
యూనస్ నేతృత్వంలో ప్రజా వ్యతిరేకత తగ్గినప్పటికీ, మైనారిటీ హిందూ సముదాయంపై జరుగుతున్న దాడులు ఆగడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక హిందూ సంఘాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. గత ఆగస్టు నుంచి ఈ దాడులు మరింత తీవ్రతరం కావడంతో వేలాది మంది హిందువులు దోపిడీ, దాడులు, ఆస్తి నష్టం వంటి ఘటనలను ఎదుర్కొంటున్నారు. పరిస్థితి అదుపులోకి రావాల్సి ఉందని హిందూ నాయకులు పేర్కొన్నారు.
This post was last modified on November 4, 2024 11:29 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…