బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు ప్రస్తుతం దాడుల బెడదను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా హిందూ సముదాయం పై జరగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిస్థితుల్లో, తమకు భద్రత కల్పించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఛాటోగ్రామ్ నగరంలో పెద్ద ఎత్తున ఉగ్ర నిరసన వ్యక్తం చేశారు.
హిందూ సముదాయానికి చెందిన 30,000 మంది ఒకేసారి రోడ్డెక్కారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. హింసను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, మధ్యంతర ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ర్యాలీ సమయంలో భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.
ప్రజా శాంతిని కాపాడేందుకు పోలీసులు, సైనికులు ఛాటోగ్రామ్లో పటిష్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, హింసాత్మక దాడులు, విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి తాత్కాలికంగా భారత్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామా అనంతరం, బంగ్లాదేశ్లో తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం దేశంలో శాంతిని నెలకొల్పి, ప్రజాస్వామ్య స్థిరత్వం కోసం చర్యలు చేపడుతుందని అక్కడి సుప్రీం కోర్టు పేర్కొంది.
యూనస్ నేతృత్వంలో ప్రజా వ్యతిరేకత తగ్గినప్పటికీ, మైనారిటీ హిందూ సముదాయంపై జరుగుతున్న దాడులు ఆగడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక హిందూ సంఘాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. గత ఆగస్టు నుంచి ఈ దాడులు మరింత తీవ్రతరం కావడంతో వేలాది మంది హిందువులు దోపిడీ, దాడులు, ఆస్తి నష్టం వంటి ఘటనలను ఎదుర్కొంటున్నారు. పరిస్థితి అదుపులోకి రావాల్సి ఉందని హిందూ నాయకులు పేర్కొన్నారు.
This post was last modified on November 4, 2024 11:29 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…